-
బాలికల మిస్సింగ్ : అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని సంస్కార్ ఆశ్రమ్ వసతి గృహం నుంచి తొమ్మిది మంది మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటనలో ఇద్దరు మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు వేసినట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల అదృశ్యంపై దర్యాప్తును తక్షణమే ఢిల్లీ పోలీస్ నేర విభాగానికి తక్షణమే బదలాయించాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఢిల్లీలో మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో మహిళా శిశుసంక్షేమ శాఖ విఫలమైందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారుల తీరుతో శాఖపైనే సందేహాలు వెల్లడయ్యే పరిస్థితి ఎదురైందని అన్నారు. -
పునరావాస పాట్లు
సాక్షి, ముంబై: నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చెయ్యించాలంటే మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మాడా)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాన్సిట్ క్యాంపుల్లో తగినన్ని ఇళ్లు ఖాళీగా లేకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు అనేక మంది నిరాకరిస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో గత కొన్నిరోజులుగా పాత భవనాలు పేకమేడల్లా కూలుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే వాటిల్లుతోంది. నగరంలో వందలాది భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సాధమైనంత త్వరగా వాటిని ఖాళీ చేయించాలని మాడా, బీఎంసీలను ప్రభుత్వం అదేశించింది. అయితే ప్రమాదకర భవనాల్లో నివాసముంటున్న సదరు వేలాది కుటుంబాలకు పునరావాసం ఎక్కడ కల్పించాలనేది అధికారులకు సమస్యగా మారింది. ఇందుకోసం మాడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. నగరంలో మూత పడిన మిల్లు స్థలాల్లో మాడా వాటాలోకి వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న, నిర్మించనున్న భవనాల్లో ట్రాన్సిట్ క్యాంపుల కోసం కొన్ని ఇళ్లను కేటాయించింది. ఇటీవల కాళా చౌకి ప్రాంతంలో ఓ మిల్లు స్థలంలో మాడా దాదాపు 10 వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో 6,925 ఇళ్లు మిల్లు కార్మికులకు కేటాయించగా, మిగతా 3,075 ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపుల కోసం కేటాయించింది. అయితే ముంబైలో 15 మిల్లులకు చెందిన 62,507 చదరపు మీటర్ల స్థలం కార్మికులకు ఇళ్లు నిర్మించేందుకు మాడా ఆధీనంలో ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపడితే కార్మికులకు ఇళ్లు లభించడంతోపాటు ట్రాన్సిట్ క్యాంపుల కోసం 3,283 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. అందుకు ప్రభుత్వం, మాడా సమన్వయంతో సకాలంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇళ్లు మాడా ఆధీనంలో ఉంటే అత్యవసర సమయంలో బాధితులకు పునరావాసం కల్పించడానికి ఎంతో దోహదపడతాయి. అయితే ఇప్పుడు మాడా వద్ద ఇళ్లు ఖాళీ లేకపోవడంతో పురాతన భవనవాసుల తరలింపు తలనొప్పిగా మారింది. ట్రాన్సిట్ క్యాంపుల భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలం వెతకాల్సిన పని లేదని,అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లోనే ఇళ్లు నిర్మిస్తే చాలు పునరావాస సమస్య పరిష్కరమవుతుందని మాడా గృహనిర్మాణ శాఖ అధికారులు అంటున్నారు. ఇవి అందుబాటులోకి రావాలంటే ముందు మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించాలి. వాటిని కార్మికులకు చౌక ధరకు విక్రయించాలి. వీటి ద్వారా వచ్చే నిధులతో ట్రాన్సిట్ క్యాంపు భవనాలు నిర్మించేందుకు సాధ్యపడుతుందని ఓ అధికారి వెల్లడించారు. నగరం, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో సుమారు 58 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడడంతో నియమాల ప్రకారం మిల్లు స్థలాన్ని మూడు భాగాలు చే యాలి. ఇందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం ప్రభుత్వానికి, మూడో భాగం మాడాకు అందజేయాల్సి ఉంటుంది. మాడా వాటాలోకి వచ్చిన మొత్తం స్థలంలో కార్మికుల ఇళ్లకు పోనూ మిగతా స్థలంలో మాడా తమ ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుంది. ఇలా నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం కాళాచౌకిలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా మిల్లు స్థలాలు మాడా అధీనంలోకి వస్తే ఇక్కడ వేలాది ఇళ్లు నిర్మించి పునరావాస గృహాలుగా వినియోగించుకునేందుకు వీలు కలగనుంది.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement