-
ఏకంగా టూత్ బ్రష్ మింగేసింది...అయితే
షిల్లాంగ్ : సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, చిన్న చిన్నమూతలు, ఒక్కోసారి పిన్నీసులు లాంటి మింగేయడం చూశాం. అయితే ఒక పెద్దావిడ (50) ఏకంగా టూత్ బ్రష్ను మింగేసింది. ఇదే వింతగా వుంటే.. వైద్యులు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా చాకచక్యంగా బ్రష్ను బయటకు తీయడం విశేషంగా నిలిచింది. షిల్లాంగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోయర్ మాప్రెమ్కు చెందిన మహిళ ఇటీవల పళ్లు తోముకుంటున్న సమయంలో ఒక్కసారిగా టూత్బ్రష్ మింగేసింది. అది నేరుగా ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. అయినా ఆమెకు ఎలాంటి అరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. కానీ అయితే వైద్యుడిని సంప్రదించాలని కూతురు బలవంతపెట్టడంతో..ఎట్టకేలకు మహిళ ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు టూత్బ్రష్ ఒక్క పట్టాన కనబడలేదు. చివరికి ఎండోస్కోపీ ద్వారా బ్రష్ను కొనుగొన్న డాక్టర్లు తిరిగి నోటి ద్వారానే మింగేసిన బ్రష్కు బయటికు తీశారు. దీనిపై వైద్యుడు ఇసాక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ...మొదట ఎక్స్రేలో ఆమె కడుపులో టూత్బ్రష్ కనపడలేదని, దీంతో తాము ఎండోస్కోపీ నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. టూత్బ్రష్ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యపోయామనీ షిల్లాంగ్లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారని పేర్కొన్నారు. చికిత్స అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. అయితే బ్రష్ను తీసి ఉండకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తేవని చెప్పారు. -
అబ్దుల్ కలాం కన్నుమూత
ఐఐఎం షిల్లాంగ్లో తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిన మాజీ రాష్ట్రపతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే తుదిశ్వాస ‘లివబుల్ ప్లానెట్’పై ప్రసంగించేందుకు ఐఐఎంకు వెళ్లిన కలాం మిస్సైల్ మ్యాన్గా, ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఘనత ప్రజా రాష్ట్రపతిగా, యువ హృదయాలకు స్పూర్తిప్రదాతగా మన్నన కలాం మృతి వ్యక్తిగత లోటన్న రాష్ట్రపతి మార్గదర్శకుడిని కోల్పోయానన్న ప్రధాని నేడు ఢిల్లీకి పార్థివదేహం రామేశ్వరంలోనే అంత్యక్రియలు జరపాలని బంధువుల విజ్ఞప్తి షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆయనను హుటాహుటిన నాన్గ్రిమ్ హిల్స్లోని బెతానీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. స్థానిక ఆర్మీ ఆసుపత్రి, ఇందిరాగాంధీ ఈశాన్య వైద్య విజ్ఞాన సంస్థ నుంచి డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందించారు. కలాంను ఆసుపత్రిలో చేర్చిన వార్త వినగానే మేఘాలయ గవర్నర్ షన్ముఖనాథన్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం, అబ్దుల్ కలాం సాయంత్రం 7.45 గంటలకు తుదిశ్వాస విడిచారని షన్ముఖనాథన్ ప్రకటించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయనను కాపాడలేక పోయారన్నారు. కలాం పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం ఢిల్లీకి తరలించనున్నారు. అప్పటివరకు మిలటరీ ఆసుపత్రిలో భద్రపరుస్తారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు వైమానిక దళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహాన్ని గువాహటి వరకు, అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు జులై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జాతీయ సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది తర్వాత తెలియజేస్తామంది. ఈ వారం రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. పార్టీలకతీతంగా అనేకమంది ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం తెలిపేందుకు మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సాధారణ స్థాయి నుంచి: అతి సాధారణ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం తండ్రి జైనులబ్దీన్ చిన్న పడవకు యజమాని. తల్లి అశియమ్మ గృహిణి. కలాం మద్రాస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివారు. భారతీయ క్షిపణి వ్యవస్థకు ఊపిరులూది ‘మిస్సైల్ మ్యాన్’గా పేరుగాంచారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన అగ్ని, పృథ్వి తదితర క్షిపణులు ఆయన మార్గనిర్దేశకత్వంలో రూపొందినవే. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల వెనుక కీలక శక్తి అయిన కలాం.. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. 1997లో ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి లక్ష్మి సెహగల్పై భారీ మెజారిటీతో గెలిచి, 2002 నుంచి 2007 వరకు దేశ 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం విశేష సేవలందించారు. ప్రత్యక్ష రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రాష్ట్రపతి కావడం అదే ప్రథమం. సుఖోయి యుద్ధ విమానాన్ని నడిపిన, జలాంతర్గామిలో ప్రయాణించిన, సియాచిన్ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆయన ప్రఖ్యాతి గాంచారు. టీచర్గా.. రైటర్గా: రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగిన అనంతరం కలాం తనకిష్టమైన బోధన రంగంలో కొనసాగారు. ఐఐఎం షిల్లాంగ్, అహ్మదాబాద్, ఇండోర్లకు విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందించారు. హైదరాబాద్ ట్రిపుల్ఐటీలో ఐటీ బోధించారు. అలాగే, తనకిష్టమైన మరో ప్రవృత్తి రచనావ్యాసంగం కొనసాగించారు. ఎందరో ప్రముఖుల మన్ననలు పొందిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ కలాం ఆత్మకథాత్మక రచన. ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన అబ్దుల్ కలాంకు చిన్నారులంటే ఎంతో అభిమానం. వారితో సమయం గడిపేందుకు ఆయన ఎంతో ఇష్టపడేవారు. వారిలో విజయకాంక్షను నింపేందుకు ప్రయత్నించేవారు. వేలాది యువ హృదయాల్లో స్ఫూర్తిని.. మస్తిష్కాల్లో జిజ్ఞాసను రగిల్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అబ్దుల్ కలాం(ఫైల్) చిన్నబోయిన రామేశ్వరం.. కలాం మృతి వార్తతో ఆయన స్వస్థలం తమిళనాడులోని చిన్న ద్వీప పట్టణం రామేశ్వరం చిన్నబోయింది. భారీ సంఖ్యలో బంధువులు, అభిమానులు ఆయన స్వగృహానికి చేరుకుని, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. కలాం పెద్దన్న 99 ఏళ్ల మొహమ్మద్ ముత్తుమీర లెబ్బై మరైకర్ శోక సంద్రంలో మునిగిపోయారు. తన తమ్ముడి ముఖాన్ని ఒక్కసారైనా చూపించండంటూ కన్నీటితో వేడుకుంటున్నాడని ఆయన కుమారుడు జైనులబ్దీన్ తెలిపారు. కలాం అంత్యక్రియలను రామేశ్వరంలో జరిపే అవకాశాలపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. కలాం మనవడు సలీం సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ తన తాతయ్య భౌతిక కాయాన్ని రామేశ్వరం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన భౌతిక కాయానికి స్వస్థలం రామేశ్వరంలోనే అంత్యక్రియలు చేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. షిల్లాంగ్లో చివరి క్షణాలు సాయంత్రం 5.40 గంటలకు - షిల్లాంగ్ చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6.35 - ‘లివబుల్ ప్లానెట్’ అంశంపై ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారు. 6.40 - తీవ్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. 7.00 - 1 కిమీ దూరంలో ఉన్న బెతానీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. 7-45 - తుది శ్వాస విడిచారు (అని గవర్నర్ షన్ముఖనాథన్ ప్రకటించారు) ‘లివబుల్ ప్లానెట్’ అంశంపై ప్రసంగించేందుకు ఐఐఎం షిల్లాంగ్ వెళ్తున్నా’ అంటూ కలాం చివరి ట్వీట్ చేశారు. గుండెపోటుతో కలాం చనిపోయారని ఆసుపత్రి అధికారులు తనకు చెప్పారని ఐఐఎం షిల్లాంగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ డే తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే కలాంలో జీవ స్పందనలేవీ కనిపించలేదని ఆయనకు వైద్యసేవలందించిన డాక్టర్ ఖర్బమాన్ వెల్లడించారు. అప్పటికే శ్వాస తీసుకోవడంలేదని, నాడి స్పందనలు ఆగిపోయాయని, రక్తపోటు శూన్యమైందని, కనుగుడ్లు పెద్దవయ్యాయని ఆయన వివరించారు. అయితే, ఆ లక్షణాలతో వెంటనే మరణించినట్లుగా ప్రకటించలేమని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కలాంను ఉంచిన షిల్లాంగ్ లోని బెథానీ ఆస్పత్రి ఆవరణలో విషణ్నవదనంతో స్థానికులు చివరి క్షణం వరకూ స్ఫూర్తి పంచుతూనే..! ‘షిల్లాంగ్ వెళ్తున్నాను... అక్కడి ఐఐఎమ్లో ‘లివబుల్ ప్లానెట్ ఎర్త్’ అంశం గురించి మాట్లాడబోతున్నా...’ - ఇదీ కలాం చివరి ట్వీట్. సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఆయన ఈ ట్వీట్ చేశారు. కలాంకు ప్రముఖుల సంతాపం కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే దార్శనికుడు కలాం - ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయన పూడ్చలేని ఖాళీని వదిలి వెళ్లారు - కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాస్త్రవేత్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయారు ఆయన లేని లోటు తీరనిది. -జి.సతీశ్ రెడ్డి, రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ), రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు దేశం ఒక మేధావిని కోల్పోయింది - సంగీత దర్శకుడు ఏఆర్ రెహ మాన్ కలాం గొప్ప మానవతావాది కూడా - బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ రాష్ట్ర నేతల సంతాపం రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా కలాం సేవలు మరవలేనివంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. -
కలాం.. నీకు సలాం!
-
అబ్దుల్ కలాం ఇక లేరు!
మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి గంటలకు కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగే సెమినార్లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే వేదికపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆయనను అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బెథనీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1931 అక్టోబర్ 15న ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాంను ఆస్పత్రికి తరలిస్తూనే వెంటనే ఆర్మీకి చెందిన వైద్యులను అక్కడకు పిలిపించారు. వాళ్ల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిన కలాంను దాదాపు మరణించిన పరిస్థితిలోనే తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని బెథనీ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. తాము ఆయనను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామని, అయితే దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయామని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement