-
నకిలీ బాబా శివకు జ్యుడిషియల్ రిమాండ్
హైదరాబాద్: నకిలీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు శివను చంచల్ గూడ జైలుకు తరలించారు. శివ పూజల పేరుతో పలువురిని మాయం చేసి రూ.1.33 కోట్లు దోచుకున్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతణ్ని విమానంలో నగరానికి తరలించారు. నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నించి కేసు నమోదు చేశారు. -
'మా ఇంట్లో జరిగింది మామూలు పూజే'
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన బురిడీ బాబా వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో ద్యాప్తు చేస్తున్నారు. బేగం పేటలోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్, రియల్టర్ అయిన మధుసూదన్ రెడ్డి ఇంట్లో డబ్బును రెట్టింపు చేస్తానంటూ పూజలు నిర్వహించి రూ.1.33 కోట్లతో పరారైన శివానంద బాబాను గంటల వ్యవధిలోనే పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతనిపై ఐపీసీ 420, 307,379 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి ప్రశ్నిస్తున్నారు. నకిలీ బాబా డ్రైవర్ షాజహాన్ సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: పరమాన్నం తినిపించి పంగనామం!) కాగా, మధుసూదన్ రెడ్డి ఇంట్లో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలపై ఆయన కుమారుడు సందేశ్ రెడ్డి స్పందించారు. 'మా ఇంట్లో జరిగింది మామూలు పూజే. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇవ్వడం వల్ల మేమంతా స్పృహ కోల్పోయాం. నకిలీ బాబా శివానందతో గతంలో మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు' అని సందేశ్ రెడ్డి మీడియాకు చెప్పారు. (చదవండి: బురిడీ బాబా చిక్కాడు) -
నకిలీ బాబాను ప్రశ్నిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్ : పూజల పేరుతో రూ.1.33 కోట్లు మాయం చేసిన బురిడీ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాను టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చారు. నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అతగాడిని అర్ధరాత్రి విమానంలో నగరానికి తరలించారు. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో నకిలీ బాబా, డ్రైవర్ షాజహాన్తో సహా మరో ఇద్దర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం బురిడీ గ్యాంగ్ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు కాజేసిన విషయం తెలిసిందే. డబ్బుతో హైదరాబాద్ నుంచి పరారైన శివ బెంగళూరు చేరుకుని నగర శివార్లలోని తన ఇంట్లో తలదాచుకున్నాడు. డబ్బుతో సహా అక్కడ్నుంచి జారుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా టాస్క్ఫోర్స్ బృందం మెరుపుదాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
బురిడీ బాబా చిక్కాడు
బెంగళూరులో పట్టుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాది ఏళ్లుగా ఇదే దందా స్వస్థలం చిత్తూరు జిల్లాలోని వెండుగంపల్లి ‘లక్ష్మీ పూజల’ పేరుతో గతంలో భారీగా మోసాలు ఇంటర్ చదువు మధ్యలో ఆపేసి వక్రమార్గం భక్తులు మత్తులోకి జారుకునేందుకు పరమాన్నంలో ఉమ్మెత్త గింజల గుజ్జు ఇలా మోసం చేసి గతంలో రెండుసార్లు అరెస్టు సాక్షి, హైదరాబాద్: డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు ఎగరేసుకుపోయిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి బెంగళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రూ.1.33 కోట్లతో హైదరాబాద్ నుంచి పరారైన శివ బెంగళూరు చేరుకుని నగర శివార్లలోని తన ఇంట్లో తలదాచుకున్నాడు. డబ్బుతో సహా అక్కడ్నుంచి జారుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా టాస్క్ఫోర్స్ బృందం మెరుపుదాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం శుక్ర లేదా శనివారాల్లో పోలీసులు అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శివను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవర్ షాజహాన్ మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దొంగబాబా శివ గతంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. 2012లో సైబరాబాద్లోని కూకట్పల్లిలో, 2014లో తిరుపతిలో అలిపిరి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘భక్తులకు’ మత్తు కలిగించడం కోసం పరమాన్నంలో ఉమ్మెత్త గింజల గుజ్జు కలుపుతాడని వెల్లడైంది. మత్తులోకి దించుతాడిలా... భక్తులు పూర్తిగా తన ‘ముగ్గులోకి’ దిగారని నమ్మకం కుదిరిన తర్వాత ‘పెద్ద పూజ’కు రం గం సిద్ధం చేస్తాడు శివ. మత్తు కలిగించడం కోసం ఉమ్మెత్త గింజల్ని గుజ్జుగా చేసి తనతోపాటు గుట్టుగా తీసుకు వస్తాడు. అత్యాశకు పోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన డబ్బుకు ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు కుటుంబీకు లు తప్ప ఇతరులెవ్వరూ ఉండకూడదని చెబుతాడు. పూజ పూర్తయ్యే సమయంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా తీవ్రమైన మత్తులోకి జారుకోవడంతో పూజలో ఉంచిన సొమ్ముతో ఉడాయిస్తాడు. ‘బాబా’వారి లీలలు ఎన్నెన్నో... దొంగ బాబా శివ 2012లో కూకట్పల్లి పరిధిలో ఇలాగే ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లాలోని అలిపిరిలో ఇలాగే మోసగించాడు. అక్కడ రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబాన్ని మోసగించేందుకు యత్నించాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకుడు దామోదర్ రావడంతో అక్కడ్నుంచి ఉడాయించాడు. మత్తు లో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ డబ్బును తానే తీసుకొని దొంగతనాన్ని బాబాపైకి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్రెడ్డి ఇం ట్లో పూజ చేసి రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు... శివ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన ఓ బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడి సమాచారంతో దామోదర్ను అరెస్టు చేసి రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్కు ఏడాది నుంచే పరిచయం ‘లైఫ్స్టైల్’ మధుసూదన్రెడ్డితో దాదాపు ఏడాది నుంచి శివకు పరిచయం ఉంది. అనేక రకాల పేర్లు చెప్పి గతంలోనూ పూజలు చేసి ‘రెట్టింపు’ నమ్మకం సంపాదించుకున్నాడు. ఇక ఆయన నుంచి సొమ్ము కొల్లగొట్టడానికి ప్లాన్ వేసిన శివ.. మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి షాజహాన్ అనే డ్రైవర్కు చెందిన ట్యాక్సీలో బయల్దేరాడు. ఈ ట్యాక్సీని సైతం తన ఇంటి వద్ద ఎక్కకుండా వేరే ప్రాంతంలో ఎక్కాడు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని బంజారాహిల్స్లోని ఓహిరీస్ హోటల్లో బస చేశాడు. రెండింతల డబ్బు కోసం ఆశపడిన మధుసూదన్రెడ్డి తన డబ్బుతోపాటు స్నేహితుల వద్ద నుంచీ తీసుకువచ్చి రూ.1.33 కోట్లు పూజలో పెట్టి మోసపోయారు. ‘దొంగ బాబాలు’ నేర్పిన విద్యయే.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లోంచి వస్తూ కొంత బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. వీటితో తిరుపతి, బెంగళూరు, కేరళలోని అనేక ఆశ్రమాలకు వెళ్లి స్వామీజీలను కలిశాడు. కొద్దిరోజుల పాటు వారితో కలిసి ఉన్న శివకు జనం బలహీనతలు తెలిశాయి. ఈ నేపథ్యంలోనే కొందరు దొంగ స్వాములతో పరిచయాలు పెంచుకొని జనాన్ని ఎలా మోసగించవచ్చో తెలుసుకున్నాడు. అనంతరం దొంగ బాబాగా మారి 2012 నుంచి దందా ప్రారంభించాడు. లక్ష్మీ పూజ పేరుతో నమ్మిస్తాడు.. బురిడీ బాబా శివ భక్తులకు లక్ష్మీ పూజ పేరుతో టోకరా వేస్తా డు. తనను ఆశ్రయించిన వారి ఇంటికి వెళ్లి ముందు పూజలు చేస్తాడు. పూజకు ముందే కొంత డబ్బు తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తా న్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఆపై మంచి రోజు సమీపిస్తోందని, ఈసారి పూజలో పెట్టిన మొత్తానికి మూడింతలొస్తుందంటూ ఎర వేస్తాడు. డ్రైవర్ ఎలా దొరికాడంటే .. దొంగబాబా కారు డ్రైవర్ షాజహాన్ బుధవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలో పోలీసులకు చిక్కాడు. బాబా మోసం గురించి తెలియగానే.. మహబూబ్నగర్ ఎస్పీ రమారాజేశ్వరి బెంగళూరుకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలకు ఆదేశించారు. బుధవారం రాత్రి ఓ ఇన్నోవా వాహనాన్ని పెబ్బేరు ఎస్సై నిలిపేందుకు యత్నించారు. ఆపకుండా వేగంగా వెళ్లడంతో దాన్ని వెంబడించారు. ఇటిక్యాల ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో చివరికి ఎర్రవల్లి చౌరస్తా వద్ద అతడిని పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు శివ రూ.16 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మధుసూదన్ ఇంటి నుంచి సొమ్మును ఎత్తుకొచ్చిన శివ.. వస్త్ర దుకాణాల్లో కొన్ని బ్యాగులు కొని డబ్బు కట్టలను అందులో ఉంచి తన వాహనం వెనుక సీట్లో కూర్చున్నాడని షాజహాన్ తెలిపినట్లు సమాచారం. కాసేపటికి రెండు బ్యాగులతో కిందకు దిగి కారు పార్కింగ్ చేసి రమ్మన్నాడు. కారు పార్క్ చేసి వచ్చేలోపే బాబా కనిపించలేదని, సెల్ఫోన్ను సైతం స్విచ్చాఫ్ చేశాడని షాజహాన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. షాజహాన్ను బుధవారం రాత్రే హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement