-
శ్రీదేవి సినిమాను గుర్తుచేసిన ట్రైలర్..!
ముంబై : సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న సెన్సిబుల్ మూవీ ‘ఆక్టోబర్’.. ఇప్పటికే ఈ సినిమా ఫొటోలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. తన ట్రైనింగ్లో భాగంగా ఓ ఫైవ్స్టార్ హోటల్లో పనిచేసే హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిగా ఈ సినిమాలో వరుణ్ కనిపిస్తాడు. బాలీవుడ్లో ఆరంగేట్రం చేస్తున్న బనిత సంధూ ఈ సినిమాలో వరుణ్ క్లాస్మేట్గా కనిపించనుంది. కొన్ని అనుకోని దురదృష్టకరమైన పరిణామాల వల్ల ఆమె ఐసీయూలో చేరుతుంది. ఆ తర్వాత గతాన్ని మరిచిపోయి హీరోను, మిగతా స్నేహితులను కూడా గుర్తుపట్టని స్థితిలోకి వెళుతుంది. తన కోసం హీరో ఏం చేశాడన్నది సినిమా. ఇటీవల కన్నుమూసిన శ్రీదేవి ప్రఖ్యాత సినిమా వసంతకోకిల (హిందీలో సద్మా)ను గుర్తుచేసేలా ఈ సినిమా ట్రైలర్ ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చాలా సెన్సిబుల్గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
శ్రీదేవి సినిమాను గుర్తుచేసిన ట్రైలర్..!
-
నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్
షూజిత్ సర్కార్.. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు.. సాధారణంగా కమర్షియల్ దర్శకులు కొన్ని కథల జోలికి వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటి కథలతో సంచలనాలు సృష్టించే ఈ దర్శకుడు.. తాజాగా సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ను కాపీ చేస్తానంటూ చెప్పిన షూజిత్.. ఆ విషయం మాత్రం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకుండా జాగ్రత్త పడతానన్నాడు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కోల్కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న షూజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింటును 'పథేర్ పాంచాలి' స్ఫూర్తితోనే తెరకెక్కిస్తానని, నిజానికి రే తీసిన ప్రతి సినిమా భారతీయ సినీ పరిశ్రమకు బైబిల్ లాంటిదని అన్నాడు. మద్రాస్ కేఫ్, విక్కీ డోనార్, పికు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన షూజిత్ సర్కార్ ప్రస్తుతం అమితాబ్ ప్రధానపాత్రలో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలను ప్రకటించి.. వాటికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
'మద్రాస్ కేఫే' సినిమా రివ్యూ!
‘విక్కి డోనర్’తో సంచలన విజయం సాధించిన శుజిత్ సర్కార్, జాన్ అబ్రహంలు మళ్లీ ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈసారి రెగ్యులర్ బాలీవుడ్ మసాలా చిత్రంతో కాకుండా.. శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగిన అంతర్యుద్ధం, భారత్లో మాజీ ప్రధాని హత్యకు కుట్ర ఎలా జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ పొలిటికల్ డ్రామా తెరెకెక్కిన ‘మద్రాస్ కేఫే’ చిత్ర కథను పరిశీలిద్దాం! ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాటం చేస్తున్న ఎల్టీఎఫ్కు శ్రీలంక ప్రభుత్వానికి మధ్య భీకరమైన దాడులు జరగడం, అందులో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం శాంతి సైన్యాన్ని ఆదేశానికి పంపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల శాంతి సైన్యాన్ని భారత్ వెనక్కి ర ప్పిస్తుంది. శాంతి సైన్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని భావించిన ఎల్టీఎఫ్ భారత ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలోనే భారత్లో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని హత్యకు కుట్రపన్ని ఎలా చంపారనేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం ‘రా’ అధికారిగా నటించాడు. జాఫ్నాలో ఎల్టీ ఎఫ్ అధినేత అన్న ప్రభాకర్ అధిపత్యానికి గండి కొట్టడానికి జాఫ్నాకు పంపిన అధికారి పాత్రలో జాన్ అబ్రహం అద్బుతంగా నటించాడు. ఇప్పటి వరకు జాన్ చేసిన పాత్రలు ఒక ఎత్తు.. విక్రమ్ సింగ్ పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రం ద్వారా జాన్ మీద మంచి నటుడి గా ముద్ర పడటం ఖాయం. మద్రాస్ కేఫే లాంటి విభిన్న కథా చిత్రానికి జాన్ అబ్రహం నిర్మాతగా వ్యవహరించడం మరో పెద్ద సాహసం. ఇక ఈ చిత్రంలో జయ అనే జర్నలిస్ట్ పాత్రలో బాలీవుడ్ తార నర్గీస్ ఫక్రీ నటించింది. శ్రీలంకలో యుద్ద వార్తలను కవరేజ్ చేసే బ్రిటిష్ జర్నలిస్టుగా నర్గీస్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో ఇంటలిజెన్స్ అధికారి ఆర్డీ పాత్రలో క్విజ్ మాస్టర్ సిద్దార్థ బసు నటించాడు. సిద్ధార్థ బసు నటనలో చక్కటి పరిణతి ప్రదర్శించి ఫుల్ మార్కులు కొట్టేశాడు. శ్రీలంకలో జరిగిన వాస్తవ సంఘటనలను, యాక్షన్ సీన్లను ఊపిరి బిగపెట్టి చూసేంతగా దర్శకుడు శుజిత్ సర్కార్ తెరకెక్కించాడు. వినోదానికి తావులేని స్క్రిప్ట్ను దర్శకుడు తెరపై నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్ర తొలి భాగంలో శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగే పోరాటాలు సహజసిద్దంగా ఉన్నాయి. ద్వితీయ భాగంలో భారత మాజీ ప్రధాని హత్యకు కుట్ర, ఆ కుట్రను భగ్నం చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారుల ప్రయత్నాలు, క్లైమాక్స్ చిత్రీకరణ చిత్రానికి హైలెట్గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు శంతను మోయిత్రా, క మల్జీత్ నేగి ఫోటోగ్రఫి, చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ‘మద్రాస్ కేఫే’ను హైరేంజ్లో నిలిపాయి. ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకునే రేంజ్లో లేకపోవడం మద్రాస్ కేఫేకు కలిసి వచ్చే అంశం. యాక్షన్, పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ‘మద్రాస్ కేఫే’ తప్పక నచ్చుతుంది.
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ‘కాపులను పవన్ కాల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
Advertisement