-
విషాదం నింపిన విహారయాత్ర !
మహబూబ్నగర్: విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన ముగ్గురు స్నేహితులు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ షుకూర్(55), షేక్ బాషా(58), పాకాలపాడుకు చెందిన అంజయ్య కలిసి డ్రైవర్ ప్రశాంత్కుమార్తో ఈ నెల 22న సత్తెనపల్లి నుంచి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లారు. గోవా నుంచి బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మక్తల్ మండలం గుడిగండ్ల శివారులో మక్తల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో షుకూర్, షేక్బాషా అక్కడికక్కడే మృతిచెందారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో చుట్టపక్కల వారు అక్కడికి చేరుకుని బయటకు తీశారు. కాళ్లు, చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలైన అంజయ్యను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్నగర్కు తరలించారు. డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. కేసు నమోదు.. షుకూర్కు ఓ సినిమా థియేటర్ ఉండగా.. షేక్బాషాకు బేకరి ఉంది. వీరంతా ప్రతి సంవత్సరం గోవాకు వెళ్లి వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. షుకూర్కు భార్య షేక్ ఆరిఫ్, కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. షేక్బాషాకు భార్య రఫియా సుల్తానా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సత్తెనపల్లి నుంచి మక్తల్కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. -
హజ్ సేవకు దరఖాస్తుల షురూ
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2018కి వెళ్లే వారికి సేవలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు హజ్ సేవకులుగా వెళ్లడానికి అర్హులన్నారు. ఉద్యోగి వయసు 25–58 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలు చేసినవారే హజ్ సేవ చేయడానికి అర్హులన్నారు. అలాగే హజ్ ఆరాధనపై అవగాహన ఉండాలన్నారు. ఆసక్తి గల వారు హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నాక ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు, డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలకు వెళ్లి వచ్చినట్లు ప్రూఫ్, పాస్పోర్టు జిరాక్స్, మెడికల్ సర్టిఫికెట్ పత్రాలను ఈ నెల 24లోపు రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయాలని తెలిపారు. ఎంపికైన వారి అన్ని ఖర్చులు హజ్ కమిటీ భరిస్తుందని, వారు హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన రోజులను ఆన్డ్యూటీగా పరిగణిస్తామని చెప్పారు. -
ఆగస్టు 11న హజ్ యాత్ర షురూ
రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ సాక్షి, హైదరాబాద్: 2017 హజ్ యాత్రికులు ఈ ఏడాది సౌదీ ఎయిర్లైన్స్ విమానాల ద్వారా ఆగస్టు 11 నుంచి హజ్ ఆరాధనలకు వెళుతున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో యాత్రికులు వెళ్లేవారని.. ఈసారి మార్పు జరిగినట్లు చెప్పారు. కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర యాత్రికుల విమానాలు ఆగస్టు 11–22 మధ్య బయలుదేరతాయని తెలిపారు. యాత్రికులు ఇక్కడి నుంచి ఎహెరామ్ (హజ్ ఆరాధన దుస్తులు)ల్లో జిద్దా వెళ్లి అక్కడి నుంచి మక్కా నగరానికి వెళతా రన్నారు. ఈ ఏడాది నుంచి మక్కా, మదీన నగరాల్లో ఆరాధనల సందర్భంగా వసతుల ఖర్చులు పెరిగాయన్నారు. మీనా, ముస్దలీఫాలో మౌల్లిమ్ ద్వారా మూడుపూటల భోజన ఏర్పాటు ఉందన్నారు. ప్రతీ ఏడాది హజ్ కమిటీ తరుఫున ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చే వారని, ఈ ఏడాది నుంచి యాత్రికులే సిమ్కార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిద్దా ఎయిర్పోర్టులో సిమ్కార్డులను తీసుకునే సౌకర్యం ఉందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement