-
ఎవరైనా సరే.. రూల్ ఫర్ ఆల్!
ఆదిలాబాద్ క్రైం : స్పెషల్ డ్రైవ్లో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్ హడలెత్తించారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన వాహనాల స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని కూడళ్లలో పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఏఎస్పీ స్వయంగా రోడ్డుపై వాహనాలు ఆపుతూ నంబర్ప్లేట్, పత్రాలు లేని పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేసి ఆర్టీవో ఆఫీస్కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట సిగ్నల్ పడిన సమయంలో ఆగిన వాహనాలు సైతం తనిఖీలు చేశారు. నాలుగు రోజుల ముందే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. వాహనదారులు అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పత్రాలు లేకుండా చాలామంది వాహనదారులు అడ్డంగా దొరికిపోయారు. ప్రతి రోజు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపడుతామని ఏఎస్పీ తెలిపారు. వాహనదారులు పత్రాలు వెంటే ఉంచుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్తో నేరాల అదుపునకు కృషి చేస్తున్నామని వివరించారు. -
పర్మిట్ లేకపోతే వాహనం సీజ్
అరసవల్లి, న్యూస్లైన్: పర్మిట్లు లేకుండా నడుస్తున్న వాణిజ్య వాహనాలకు ముకుతాడు వేయడానికి రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ప్రత్యేక దాడులు చేయనున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దాడులు చేయనున్నట్లు తెలిపారు. వాణిజ్య వాహనాలు, టాక్సీలు, బస్సులు తదితర వాహనాల పర్మిట్లు తనిఖీ చేస్తామన్నారు. పర్మిట్ లేకపోయిన, పన్ను చెల్లించకపోయిన సంబంధిత వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ బస్సులతో పాటు ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా, అర్హులైన డ్రైవర్లు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు. జిల్లాలో రెండు బస్సులకు మాత్రమే రూట్ పర్మిట్లు ఉన్నాయని, వాటిని ఇప్పటికే తనిఖీ చేశామని తెలిపారు. శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రంతాలకు నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడిపితే వెంటనే సీజ్ చేస్తామన్నారు. అలాగే లగేజీ తీసుకువెళ్లే వాహనాల్లో ప్రయాణి కులను తీసుకువెళితే సహించేది లేదని చెప్పారు. ప్రవేటు బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వోల్వో బస్సుల్లో ప్రయాణికులను తీసుకువెళ్లే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవరసర పరిస్థితిల్లో ఏం చేయాలన్న విషయాలు పూర్తిగా తెలియ జేయాలని ట్రావెల్సె వారికి తెలిపినట్లు చెప్పారు. ప్రయాణికుడి పూర్తివివరాలు, సెల్ నంబరు ఖచ్చితంగా ఉండాలని వారికి చెప్పినట్లు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement