-
అధిక జీతాలిచ్చే 'కొలువులివే'.. డిమాండ్ అధికంగా ఉన్న ఉద్యోగాలు
ఆర్థిక మాంద్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండటం.. తాజాగా చదువులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల్లో గుబులుపుట్టిస్తోంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో అంతే వేగంగా ఉపాధి అవకాశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బట్టి ఆయా సంస్థలు వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అధిక వేతనాలిచ్చే కొలువులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో.. 2023లో అధిక వేతనాలిస్తూ డిమాండ్ అధికంగా ఉన్న 10 రకాల ఉద్యోగాలను ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ సింప్లీ లెర్న్ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ పది ఉద్యోగాల్లో వార్షిక వేతనం రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కొలువు ఒకటి. ఖాతాదారులకు సంబంధించిన నగదును నిర్వహిస్తూ వారికి అధిక లాభాలను అందించడమే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ విధి. ఫైనాన్స్ సబ్జెక్ట్తో పాటు వివిధ ఫైనాన్షియల్ సేవలపై పట్టున్న వారికి ఇది సరైన కెరీర్. ఈ రంగంలో ప్రారంభ వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్నా, అనుభవమున్న వారికి రూ.40 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. సిటీబ్యాంక్, డచ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, గోల్డ్మాన్శాక్స్, జేపీ మోర్గాన్ ఛేజ్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. బ్లాక్చైన్ డెవలపర్ ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కోర్సుల్లో అత్యధికంగా వినపడేది బ్లాక్చైన్ టెక్నాలజీనే. దేశాల నగదు లావాదేవీలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిలో బ్లాక్చైన్ కీలకపాత్ర పోషిస్తుంది. కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి బ్లాక్చైన్ టెక్నాలజీ కోర్సు చేసినవారికి సగటు ప్రారం¿ý వేతనం రూ.8,01,938 లభిస్తుంటే, అనుభవం ఉన్నవారికి రూ.45 లక్షలు వరకు ఇస్తున్నాయి. ఆక్సీసెస్, సైంజీ, ప్రిమ్చైన్, సాఫ్ట్కోల్, ఓపెన్ ఎక్సల్, మైండెఫ్ట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. వైద్య వృత్తి అధిక వేతనంతో అధిక డిమాండ్ ఉన్న వాటిలో వైద్య వృత్తి కూడా ఒకటి. దేశంలో వైద్య సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో వైద్య నిపుణులకు అధిక వేతనం చెల్లించడానికి ఆస్పత్రులూ వెనుకాడటంలేదు. కేవలం డాక్టర్స్, సర్జన్సే కాకుండా ఈ రంగానికి అవసరమైన హెల్త్కేర్ అడ్మిన్, నర్సింగ్, ఫార్మసీ, హోమ్ హెల్త్ వంటి రంగాలకు డిమాండ్ ఉంటోంది. దేశంలో సగటు వైద్యుడి వేతనం రూ.10 లక్షలుగా ఉంది. జనరల్ ఫిజీషియన్స్కు రూ.6.99 లక్షలు, జనరల్ సర్జన్స్కు రూ.11.59 లక్షలు ఇస్తుంటే స్పెషలైజేషన్ చేసిన వారికి రూ.20 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, మాక్స్, కొలంబియా ఆసియా వంటి ఆస్పత్రులు అధిక వేతనాన్ని ఇస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్ వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణలో మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన వాటిలో మెషిన్ లెర్నింగ్ ఒకటి. ఎంఎల్ ప్రోగ్రాంల ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన ఆల్గోరిథమ్స్ను ఈ నిపుణులు అభివృద్ధి చేస్తారు. ఎంఎల్ కోర్సు పూర్తిచేసిన వారికి సగటున రూ.7.28 లక్షల వేతనం లభిస్తోంది. అదే అనుభవం ఉన్న వారికి రూ.19.48 లక్షల వరకు వేతనాన్ని ఇస్తున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్, జైకస్, క్వాంటిపి వంటి సంస్థలు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వ్యాపార రంగంలో ఒక వస్తువును డిజైన్ చేసి, అభివృద్ధి చేసి దాన్ని వేగంగా మార్కెట్లోకి తీసుకెళ్లడం అనేది అత్యంత కీలకం. ప్రోడక్ట్ మేనేజర్లు ఒక వస్తువును డిజైన్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో సగటు ప్రారంభ వేతనం రూ.14.40 లక్షలుగా ఉంది. ప్రారంభ వేతనం రూ.7లక్షలు లేదా రూ.8 లక్షల నుంచి, అనుభవమున్న వారికి రూ.17లక్షలు–రూ.26లక్షల వరకు ఇస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, సేల్స్ఫోర్స్, ఊబర్, ఓలా వంటి సంస్థల్లో వీరికి డిమాండ్ ఉంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వృత్తిని ఎంచుకున్న వారికి సగటున రూ.11.49 లక్షల వేతనం లభిస్తోంది. వీరికి ప్రారంభ వేతనం రూ.6లక్షలు–రూ.7 లక్షల నుంచి ఉంటే అనుభవం ఉన్న వారికి రూ.17లక్షలు నుంచి రూ.26 లక్షల వరకు వేతనం లభిస్తోంది. కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, మెకన్సీ, డెలాయిట్, ఎర్నెస్ట్ యంగ్, యాక్సెంచర్ వంటి సంస్థలు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి. సీఏ, మార్కెటింగ్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ వంటి రంగాల్లో కూడా రూ.4 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఈ మూడు వృత్తులను ఎంచుకున్న వారికి ఈ ఏడాది దేశంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్కు స్టాండర్డ్ చార్టర్డ్, ఎర్నెస్ట్ ఎంగ్, డెలాయిట్, కేపీఎంజీ, బీడీఓ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు.. మార్కెటింగ్ మేనేజర్లకు ఐబీఎం, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టీసీఎస్, టాటా మోటర్స్ వంటి సంస్థలు.. బిజినెస్ అనలిస్ట్లకు మైక్రోసాఫ్ట్, సిటీ, యాక్సెంచర్, అమెజాన్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. డేటా సైంటిస్ట్ అంతర్జాతీయంగా ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్నది డేటా సింటిస్ట్లకే. అందుబాటులో ఉన్న డేటాను సేకరించి సరైన విశ్లేషణ చేసే వారికి రూ.లక్షల్లో జీతాలను ఇవ్వడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్లో పట్టున్న వారికి డేటా సైంటిస్ట్ రంగం సరైన వేదిక. డేటాసైన్స్ రంగం ఎంచుకున్న వారికి దేశంలో సగటున రూ.11 లక్షల వేతనం అందుతుండగా, అనుభవం ఉన్న వారికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వేతనం ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడటంలేదు. డేటాసైన్స్ సర్టిఫికేషన్ పూర్తిచేసిన వారికి అమెజాన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, వాల్మార్ట్ ల్యాబ్స్, గ్రే ఆటమ్ వంటి సంస్థలు తలుపులు తెరిచి ఉంచుతున్నాయి. -
ఆన్లైన్ చదువుల సిరి
3 బిలియన్ డాలర్లకు భారత మార్కెట్ పెరుగుతున్న ఈ-లెర్నింగ్ సైట్లు న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వాడకం విద్యాభ్యాసానికి ఉన్న హద్దులను తుడిపేస్తోంది. దీంతో ఆన్లైన్ చదువుల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈలెర్నింగ్ సంస్థలు కొత్త టెక్నాలజీ, భారీ ప్రణాళికలతో వస్తున్నాయి. దేశీయంగా ఈ-లెర్నింగ్ మార్కెట్ 3 బిలియన్ డాలర్ల (రూ.18,000 కోట్లు) మేర ఉంటుందని అంచనా. సింప్లీ లెర్న్, ఇంటెలిపాట్ లాంటి స్టార్టప్ సంస్థలు మధ్యస్థాయి ప్రొఫెషనల్స్కి ఉపయోగపడే కంటెంట్ను అందిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన లెర్న్సోషల్, నాలెడ్జ్ఇన్ వంటి ఈ లెర్నింగ్ సైట్లు నేర్చుకునే వారికి, నేర్పేవారికి మధ్య సంధానకర్తలుగా ఉంటున్నాయి. కొన్ని సైట్లు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ మాధ్యమాలను కూడా మేళవించి కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఆన్లైన్ ట్రెయినింగ్ సైట్లు పాఠశాల, కాలేజీ స్థాయి కోర్సులతో పాటు కొన్ని ప్రొఫెషనల్ కోర్సులనూ అందిస్తున్నాయి. ఉదాహరణకు, ఎంట్రన్స్ ఇండియా సంస్థ భారత్లో నిర్వహించే ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ అందిస్తోంది. కుప్పలు తెప్పలుగా లభించే స్టడీ మెటీరియల్తో విద్యార్థులు గందరగోళపడ కుండా... అవ సరమైన వాటిపైనే దృష్టి పెట్టేలా ఇది తోడ్పడుతోంది. సింప్లీలెర్న్ సంస్థ .. ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొదలైన అంశాల్లో 200 పైచిలుకు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది 150 దేశాల్లో 300 పైగా కోర్సులను అందిస్తోంది. 2,00,000 పైచిలుకు ప్రొఫెషనల్స్కి శిక్షణనిచ్చింది. ఈ కంపెనీలో సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. 2011లో ప్రారంభమైన ఇంటెలిపాట్ సంస్థ ఐటీ ప్రొఫెషనల్స్కి ఆన్లైన్ శిక్షణఇస్తోంది. వివిధ అంశాల్లో దాదాపు 80 సాంకేతిక కోర్సులను అందిస్తోంది. మధ్యస్థాయి ప్రొఫెషనల్స్, విద్యార్థులకు అవసరమయ్యే కంటెంట్ను అందించడంపై లెర్న్సోషల్ దృష్టిపెడుతోంది. తాము ఆన్లైన్ లెర్నింగ్లో అమెజాన్ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చెబుతోంది. ఇదే కోవకి చెందిన నాలెడ్జ్ఇన్ సంస్థ పూర్తిగా ఐటీ సంబంధిత కోర్సులపై దృష్టి పెడుతోంది. ఆన్లైన్ ఎందుకు.. దశాబ్దం క్రితం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అంటే ఏవో కొన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజీలు తెలిసి ఉంటే చాలు. కానీ ప్రస్తుతం వారు బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సంక్లిష్టమైన వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకు తీరాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అప్డేట్గా ఉంటేనే ప్రమోషన్లు, వేతనాల పెంపు లభిస్తున్నాయి. దీంతో ఉద్యోగరీత్యా ఎదిగేందుకు కావాల్సిన నైపుణ్యాల కోసం ప్రొఫెషనల్స్ ఆన్లైన్ మాధ్యమానికి మళ్లుతున్నారు. అదే కాకుండా .. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవటమన్నది భారతీయ విద్యావ్యవస్థలో ప్రధాన లోపమని పరిశ్రమ నిపుణుల విశ్లేషణ. కాబట్టి.. భవిష్యత్లో విద్యాభ్యాసం అంతా ఆన్లైన్ కోర్సులపైనే ఆధారపడే అవకాశాలున్నాయని వారి అభిప్రాయం. పైగా ఎక్కడైనా, ఎప్పుడైనా చదువుకునే వీలుండటమూ ఆన్లైన్కు ప్రాధాన్యం పెరగటానికున్న కారణాల్లో ఒకటి. ‘మూక్స్’తో ఉచితంగానే...! ఆన్లైన్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి ఉచితంగా కోర్సులందించే ధోరణీ పెరుగుతోంది. ముద్దుగా ‘మూక్స్’ అని పిలుస్తున్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులనందిస్తున్న సంస్థల్లో స్టాన్ఫోర్డ్ వంటి వర్సిటీలూ ఉంటున్నాయి. అమెరికాకు చెందిన వర్సిటీల కోర్సుల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తున్న సంస్థల్లో coursera.com, edx.org, udemy.com Ð]ంటివి ముందున్నాయి. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల కోర్సుల్ని కూడా కొన్ని సంస్థలు అందిస్తుండగా... ప్రధానంగా ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్, మేనేజిమెంట్ కోర్సులకు డిమాండున్నట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement