-
‘అమరావతిని నల్లధనం అడ్డాగా మార్చేశారు’
సాక్షి, విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణం పేరిట చేస్తున్న దోపిడిపై టీడీపిని కడిగిపారేశారు. రాజధాని నిర్మాణాన్ని తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టె అంశంగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూదందా వెనుక వేలకోట్ల కుంభకోణం ఉందని, అడ్డగొలుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తాత్కాలికి నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని జీవిఎల్ ఆరోపించారు. అమరావతిని టీడీపీ తన వ్యాపారాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో.. యనమల మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి వైద్యం కోసం సింగపూర్కు వెళ్లి లక్షలు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన 1690 ఎకరాల భూమిలో 1070 ఎకరాలను ఫ్లాట్లుగా అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడంపై మండిపడ్డారు. ఆ కంపెనీ 306 కోట్ల పెట్టుబడులు పెట్టినదానికి 16 వేల కోట్ల విలువైన భూమిని అప్పగిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానికి ఈ అక్రమాలపై సమాచారం ఉందని, ఈ ల్యాండ్ మాఫియాకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్ల అక్రమాలకు అమరావతి కేంద్రం కాబోతోందని ఆరోపించారు. అమరావతిని నల్లధనం అడ్డాగా, మరో స్విస్ బ్యాంక్గా చంద్రబాబు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లోపు కొంతైనా పురోగతి చూపండి
- సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు సీఎం వేడుకోలు - స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పనిని వెంటనే ప్రారంభించి, వచ్చే ఎన్నికల నాటికి కొంతైనా పురోగతి చూపించాలని చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను కన్సార్టియంను కోరారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉందన్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్గా స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసిన ప్రభుత్వం సోమవారం విజయవాడలో దీనిపై ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రెండేళ్లలో సింగపూర్ కంపెనీలు తమ సామర్థ్యం చూపాలని కోరారు. అమరావతికి గుండెకాయ స్టార్టప్ ఏరియా రాజధానికి మూడు దశల్లో మాస్టర్ప్లాన్లు అందించిన తర్వాత తమ సేవలను కొనసాగించాలని సీఎం చంద్రబాబు కోరారని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. నాణ్యమైన నిర్మాణాలు చేపడతా మన్నారు. స్టార్టప్ ఏరియా రాజధాని అమరావతికి గుండెకాయలా మారుతుందని చెప్పారు. దీంతోపాటు మరో మూడు ఒప్పంద పత్రాలపై చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు. అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తాం అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులకు తాళ్లాయపాలెం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. విభజనతో నష్టపోయామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అమెరికాకు వెళ్లి పలు కంపెనీలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అదే విధంగా నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్ది దానికి సైబరాబాద్ అని పేరు కూడా తానే పెట్టానన్నారు. విభజన జరిగిన తరువాత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సింగపూర్ వెళ్లినట్లు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ అడిగిన వెంటనే ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకు క్యాపిటల్ రీజయన్, క్యాపిటిల్ సిటీ, సీడ్ క్యాపిటల్ ప్లాన్లు ఇచ్చిందన్నారు. సింగపూర్ స్ఫూర్తితో అమరావతిని నిర్మించాలని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. -
సింగపూర్ కన్సార్టియం-ఏపీ సర్కార్ మధ్య ఎంవోయు
విజయవాడ: సింగపూర్ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సోమవారం ఎంవోయు కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ ఎంవోయులో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించనుంది. మరోవైపు సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లింగాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. రాజధానికి తమ భూమలను ఇవ్వలేదని రైతులు తెలిపారు. తమ అనుమతి లేకుండానే సింగపూర్ కంపెనీలకు భూములు ఎలా కట్టబెడతారని రైతులు ప్రశ్నించారు. వెంటనే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను తరిమేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందంటూ లింగాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహానికి రైతులు వినతిపత్రం సమర్పించారు. -
అమరావతి తలపై సింగపూర్ ‘టోపీ’!
-
అమరావతి తలపై సింగపూర్ ‘టోపీ’!
సర్కారు జేబుకు చిల్లు పెట్టే ‘స్టార్టప్’ డీల్ - భూమి ఇచ్చి.. మౌలికవసతులు కల్పించేది ప్రభుత్వం - లే అవుట్లు వేసి అమ్ముకునేది సింగపూర్ కన్సార్టియం - భూమితో కలిపి రూ.13వేలకోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి వచ్చేవాటా రూ.446కోట్లు - రూ.304 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు దక్కేది రూ.5,768 కోట్లు - అమరావతి వేదికగా కనీవిని ఎరుగని నారావారి దోపిడీ ‘స్టార్టప్’ - సింగపూర్బాబు కనుసన్నల్లో మేనేజ్మెంట్ కంపెనీ సాక్షి, అమరావతి: అది ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నుంచి బలవంతంగా ‘సమీకరించిన’ భూమి.. అందులోనూ రాజధానికి గుండె వంటి స్టార్టప్ ఏరియాలో ఇప్పుడే ఎకరా రూ.4 కోట్లు పలుకుతున్న భూమి.. అలాంటి విలువైన భూమిని సింగపూర్ ప్రయివేట్ కంపెనీల కన్సార్టియంకు రాష్ట్రప్రభుత్వం అప్పగించబోతోంది. భూములిచ్చిన రైతులు గానీ, ఐదు కోట్ల మంది ప్రజలు గానీ ఏం ఆశిస్తారు? ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మంచి లాభసాటి చర్చలు జరుపుతుందని భావి స్తారు.. అద్భుతమైన రాజధాని నిర్మించేస్తారని, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చుతారని, తద్వారా ప్రజాధనాన్ని కాపాడతారని ఆశిస్తారు. కానీ ఇక్కడ జరిగేది పూర్తిగా రివర్స్.. రూ. 7వేల కోట్ల విలువ చేసే భూమిని ఆ కంపెనీలకు అప్పగిస్తోంది.. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది.. కానీ సర్కారు తిరిగి పొందేది పిసరంత.. అంత విలువైన భూమిని అప్పగించేటపుడు గ్లోబల్ టెండర్లు పిలిచి, భూమి ఇస్తున్నాం కనుక మన ఖర్చేమీ లేకుండా, అభివృద్ధి చేసిన భూమిలో మనకు అధిక వాటా ఉండేలా.. మంచి లాభసాటి బేరం చూసుకోవాలి.. కానీ నారా వారి రూటే సెప‘రేటు’.. సర్కారు ‘అభివృద్ధి’ చేసిన భూమిలో లే అవుట్లు వేసుకుని అమ్మేసుకునేందుకు సింగపూర్ కన్సార్టియంకు సర్వహక్కులూ రాసిచ్చేశారు. మన వాటా కింద సగటున ఓ 8.7% ఇస్తే చాలని ఒప్పేసుకున్నారు. అభివృద్ధి చేసిన భూమిని అమ్మడం కోసం ముందు నిర్ణయించిన బేసిక్ ధర ఎకరా రూ. 4.1 కోట్లను కూడా తగ్గించేసి రూ. 62 లక్షలుగా ఫిక్స్ చేసే శారు.. ఇంత నష్టమైన బేరంగానీ, ఇంత లాలూచీగానీ ముందెన్నడూ ఎరిగి ఉండరు. ఆ కథేమిటో మీరే చూడండి. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భూమికి తొలుత ప్రాథమిక ధర(బేసిక్ ప్రైస్) నిర్ణయించిన సర్కార్.. తాజాగా ఫిక్స్డ్ ప్రైస్(నిర్ణీత ధర) ఖరారు చేసేసింది. అంటే గతంలో ప్రాథమిక ధర నిర్ణయించారు. దానికి తగ్గకుండా ఎంతకు అమ్మినా మొత్తం ధరలో ప్రభుత్వానికి వాటా ఉండేది. ఇపుడు ఫిక్స్డ్ ధర నిర్ణయించారు. దానిపైనే సర్కారుకు రెవెన్యూ వాటా ఇస్తారు. పైన ఎంతకు అమ్ముకున్నా సర్కారుకు సంబంధం ఉండదన్నమాట. ప్రైవేట్ మేనే జ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని సింగపూర్ కన్సార్టియం ఎవరికి, ఎంతకు అమ్ముకున్నా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సింగపూర్ కన్సార్టియం, బాబు అండ్ కో భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ లో భాగంగానే భూమికి ఫిక్స్డ్ ప్రైస్ నిర్ణయించి.. ఆ రేటుపై వచ్చే ఆదాయంలోనే ప్రభుత్వా నికి వాటా(రెవెన్యూ షేర్) ఇవ్వాలని నిర్ణయించారు. అదీ దశలవారీగా. మొత్తమ్మీద 15 ఏళ్లల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల ఖర్చుల న్నీ పోను రూ.5,768.60 కోట్ల ఆదాయం వస్తుందని సింగపూర్ కంపెనీలు తేల్చాయి. ఇందులో ప్రభుత్వానికి రూ.446 కోట్ల వాటా ఇస్తాయి. ఇలాంటి దారుణమైన డీల్కు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమి ఇచ్చి మౌలిక వసతులు కల్పించి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1,691 భూమి ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.5,500 కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున రూ.222 కోట్లను పెట్టుబడి పెడుతుంది. సింగపూర్ కన్సార్టియం కేవలం రూ.304 కోట్లే. కన్సల్టెన్సీలతో ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేసి భూమిని అమ్ముకునే సింగపూర్ కన్సార్టియంకు వచ్చే వాటా రూ.5,322.6 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలంం రూ.446 కోట్లే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇచ్చే అంశంపై సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన సీల్డ్ కవర్పై మెకెన్సీ, హైపవర్ కమిటీ, సీఆర్డీఏ అథారిటీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంటే భూమి కాకుండా ధన రూపంలో రూ.5,722 కోట్ల పెట్టుబడి పెట్టే సర్కార్కు 15 ఏళ్లలో దక్కేది కేవలం రూ.446 కోట్లు. అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల సర్కార్కు రూ.5,276 కోట్ల నష్టం వస్తుందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరుతున్నా.. ప్రైవేట్ మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికే సింగపూర్ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వ ముఖ్యనేత కట్టబెట్టేశారన్నది స్పష్టమవుతోంది. సర్కారు ఆమోదించిన సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలివీ.. ► 1,691 ఎకరాల్లోని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రూ.3,137 కోట్ల వ్యయం అవుతుంది. ఎకరం భూమి ప్రాథమిక విలువ(బేసిక్ ప్రైస్) రూ.4.1 కోట్లుగా నిర్ణయించింది. ► ఇందులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) వాటా రూ.222 కోట్లు.. సింగపూర్ కన్సార్టియం వాటా రూ. 304 కోట్లు. మిగతా నిధులను భూమిని తనఖా పెట్టడం, విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటుంది. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 శాతం. ► ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం రెండు కలిసి సంయుక్తంగా ఏడీపీని ఏర్పాటు చేస్తాయి. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులు నలుగురు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఏడీపీకి సింగపూర్ కన్సార్టియం ప్రతినిధే ఛైర్మన్గా వ్యవహరిస్తారు. దీనిని బట్టి సింగపూర్ కంపెనీలు చెప్పిందే వేదం అని అర్ధం కావడం లేదూ? ► ఉత్ప్రేరక అభివృద్ధి కోసం ముందుగా 50 ఎకరాలను ఉచితంగా సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఇందులో ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించి విక్రయిస్తారు. ఇందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వరు. ► రెండో దశలో 200 ఎకరాలను నామమాత్రపు ధరపై సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలి. ఈ భూమిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉండదు. ► 1,691 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా(రెవెన్యూ షేర్) ఇస్తామని ప్రతిపాదించింది. ► ఈ ప్రతిపాదన లపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాతే స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం గోప్యంగా ఉంచడాన్ని హైకోర్టు తప్పుపడుతూ టెండర్ల ప్రక్రియను ఆపేయాలని సెప్టెంబరు 12, 2016న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 5% వాటాకే అంగీకారం రెవెన్యూ షేర్లో ప్రభుత్వానికి ఇచ్చే వాటాపై సింగపూర్ కన్సార్టియం అందించిన సీల్డ్ కవర్ను మార్చి 3న సీఆర్డీఏ అధికారులు తెరిచారు. మొత్తం ఆదాయంలో 5 శాతం రెవెన్యూ షేర్ ఇస్తామని సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించాయి. వీటికి సీఎం అధ్యక్షతన గల సీఆర్డీఏ అథారిటీ భేటీలోనే ఆమోదం తెలిపారు. అయితే ఐదు శాతం రెవెన్యూ షేర్ చాలా తక్కువంటూ విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దాంతో హైపవర్ కమిటీ ఏప్రిల్ 18, 24 తేదీల్లో సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో రెవెన్యూ షేర్ పెంపుపై సంప్రదింపులు జరిపింది. దీంతోఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. తొలి దశలో అంటే ఐదేళ్లలో 5 శాతం, రెండో దశలో మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశ అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు సింగపూర్ కంపెనీలు అంగీకరించగా అందుకు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. బేసిక్ ధర ‘ఫిక్సింగ్’ ఇలా.. ఎకరం భూమి బేసిక్ ధరను రూ. 4.1 కోట్లుగా తొలి ప్రతిపాద నల్లో సింగపూర్ కన్సార్టియం, ప్రభుత్వం నిర్ణయించాయి. అభివృద్ధి చేసి భూమిని ఎకరం రూ.4.1 కోట్లకు తక్కువ కాకుండా విక్రయించాలని సింగపూర్ కంపెనీలు తమ ప్రతిపా దనల్లో పేర్కొన్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సంస్థకు నాలుగు కోట్ల కన్నా తక్కువ ధరకు విక్రయిం చమని కోరితే ఆ వ్యత్యాసం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ కంపెనీలు షరతు విధించాయి. అయితే ఇప్పుడు .. ఆ ప్రాంతంలో భూమి విలువ రూ.నాలుగు కోట్లు లేదని గ్రహించామని, అందువల్ల అభివృద్ధి చేసిన ఎకరం ఫిక్స్డ్ బేసిక్ ధరను రూ.62 లక్షలుగా నిర్ణయిస్తున్నట్లు సీఆర్డీఏ అథారిటీ పేర్కొంది. తొలి దశ, రెండో దశ, మూడో దశలో అభివృద్ధి చేసిన భూమి ఎంతకు విక్రయం అవుతుందో తెలియకుండానే ఈ మూడు దశల్లో భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే నిర్ధారించేశారు. మూడు దశల్లో రూ. 5,768 కోట్లు ఆదాయం వస్తుందని, ఇందులో సర్కారుకు రూ.446 కోట్లు రెవెన్యూ షేర్ వస్తుందని లెక్కకట్టారు. ఇందుకు హై పవర్ కమిటీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదించాయి. అంటే ఎక్కువ ధరకు సింగపూర్ కంపెనీలు భూములను విక్రయించినా ఆ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ ఉండదని స్పష్టం అవుతోంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. దోపిడీకి మూలం ఇక్కడే ఉంది. సింగపూర్ కన్సార్టి యంకు సాగిలపడ్డ సర్కార్.. తొలుత ఆమోదించిన ప్రతిపాదనలను తుంగలోతొక్కి నష్టదాయకమైన తాజా ప్రతిపాదనలకు తలూపింది. స్టార్టప్ ఏరియా అప్పగింత సాక్షి, అమరావతి: పేరుకు స్విస్ చాలెంజ్ విధానం అయినప్పటికీ ఎటువంటి ఛాలెంజ్ లేకుండా సింగిల్ టెండర్పై సింగపూర్ కంపెనీలకు రాజధాని స్టార్ట్ అప్ ఏరియా ప్రాంతం 1691 ఎకరాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో అంటే తొలి ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి 5 శాతం మేర, రెండో దశలో అంటే మరో ఐదేళ్లలో 7.5 శాతం, మూడో దశలో అంటే ఇంకో ఐదేళ్లలో 12 శాతం రెవెన్యూ వాటా ఇవ్వనుందని సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎంత ఆదాయంలో ఐదు శాతం అనేది స్పష్టం చేయలేదు. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని హై పవర్ కమిటీతో పాటు కేబినెట్ ఆమోదించిన ఫైలులో మాత్రం ఆదాయం నిర్ధారించారు. ఆ ఆదాయ వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచారు. తొలుత సింగపూర్ కంపెనీలు రెవెన్యూ వాటా ఐదు శాతమే ఇస్తామన్నారని, అయితే ఇందుకు అంగీకరించకుండా సంప్రదింపులు జరపాలని ఉన్నతస్థాయి కమిటీని కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు జరపగా తొలి దశలో ఐదు శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటా ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తద్వారా భూముల ధరలు పెరుగుతాయని, అలాగే ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్ర స్తూల ఉత్పత్తి పెరుగుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు సింగపూర్ కంపెనీలు ఒప్పందాలను చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం సూచించింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement