-
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
‘సింగం’ సీక్వెల్స్ కొనసాగిస్తా
‘సింగం’ సీక్వెల్స్ కొనసాగించేందుకే తాను మొగ్గు చూపుతున్నట్లు డెరైక్టర్ రోహిత్ శెట్టి చెప్పాడు. ఇంతకుముందు తాను తీసిన సూపర్ హిట్ చిత్రం ‘సింగం’కు సీక్వెల్గా తీసిన ‘సింగం రిటర్న్స్’ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంంది. కాగా, ఈ సినిమాపై ఆయన స్పందిస్తూ.. ‘నేను ఇంతకుముందు గోల్మాల్ సీరీస్, ఆల్ ది బెస్ట్ వంటి కామెడీ సినిమాలు తీశాను. మొదటిసారి ‘సింగం’ వంటి యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాను. అది ప్రేక్షకుల మన్ననలను పొందింది. అందుకే దానికి సీక్వెల్గా ఇప్పుడు ‘సింగం రిటర్న్స్’ తీశాను. ఇది కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉంది. అయితే సీక్వెల్ పేరిట ఒకే విషయాన్ని పదేపదే చూపిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది.. అందుకే ఈ సినిమాను కొత్త కథాంశంతో తెరకెక్కించాం.. ఇందులో సూపర్స్టార్ అజయ్ దేవగన్ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారు. ఇందులో అతని పాత్ర ఏసీపీ బాజీరావ్ సింగం.. ముంబై నగరంలో క్రైం ప్రపంచాన్ని గడగడలాడించే పవర్ఫుల్ పాత్ర అది.. అంతకుముందు ‘సింగం’ సినిమాలో అజయ్ గోవాలో ఏసీపీగా కనిపించారు..’ అని తెలిపారు. సింగం సినిమాలో హీరోయిన్ కాగల్ అగర్వాల్ కాగా, సీక్వెల్ సింగం రిటర్న్స్లో కరీనా కపూర్ ఖాన్ ప్రధానపాత్ర పోషించింది. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథాంశం మారుతుంది. అందుకే హీరోయిన్ను మార్చామన్నారు. ఈ సినిమాలో ‘విలన్’గా నటుడు, డెరైక్టర్ అమోల్ గుప్తాను తీసుకున్నారు. అమోల్ను విలన్గా తీసుకోవాలని మొదట తాను అనుకోలేదని రోహిత్ చెప్పారు. తన అసిస్టెంట్ డెరైక్టర్ ఒకరు ఇచ్చిన సలహా మేరకు అమోల్ను విలన్ పాత్రకు ఎంపిక చేశామన్నారు. అమోల్ తీసిన కామిని సినిమా చూశానని, చాలా బాగుందని రోహిత్ కితాబిచ్చారు.ఇదిలా ఉండగా, సింగం రిటర్న్స్ను కథాంశం డిమాండ్ మేరకు వాస్తవ ప్రదేశాల్లోనే చిత్రీకరించామని రోహిత్ వివరించారు. దీనికోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మహీంలోని మఖ్దూమ్షా బాబా దర్గా, గేట్వే ఆఫ్ ఇండియా, కాటన్ గ్రీన్,రియే రోడ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు మహారాష్ట్ర హోం మంత్రి, పోలీసులు ఇచ్చిన సహకారం మరవలేనిదన్నారు.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
నగరం ఓటెత్తాలని..
తప్పక చదవండి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
Advertisement