-
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్గా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్ఫండ్లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
ఇలా కూడా ‘సిప్’ చేయొచ్చు
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ముద్దుగా సిప్. ఇన్నాళ్లూ సిప్ అంటే మనకు తెలిసిందొకటే. నెలనెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం. కానీ... ఇపుడు సిప్ చేసే పద్ధతి కూడా మారుతోంది. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూనే... కావాలనుకున్నపుడు కొన్నాళ్లు విరామం తీసుకోవచ్చు. అంటే మార్కెట్లు మరీ గరిష్ట స్థాయిలో ఉన్నాయనిపిస్తే... ఆ నెలో, రెండు నెలలో సిప్ చేయటం ఆపేయొచ్చు. మళ్లీ కాస్త తగ్గాయనిపించినపుడు చేయొచ్చు. అదీ కొత్త కథ. అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం కూడా... కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ హెచ్చు తగ్గులు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సూచీలు గరిష్ట స్థాయిల వద్ద ఉన్నప్పటికీ చాలా షేర్లు విలువ పరంగా బాగా పడిపోయి ఉన్నాయి. కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... భవిష్యత్తులో పెరుగుతాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో సిప్ ఎంచుకోవడమే మంచిదంటున్నారు మార్కెట్ నిపుణులు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ ఖాతాదారులను ఆకర్షించడానికి సరికొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. అవి... డైలీ సిప్: నెలకు ఒకసారి కాకుండా ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేసేదే డైలీ సిప్. ఉదాహరణకు డాయిష్ మ్యూచువల్ ఫండ్ రోజుకు కనిష్టంగా రూ.300 చొప్పున కనిష్టంగా రెండు నెలలు ఇన్వెస్ట్ చేసేలా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐ సిప్: ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశమిచ్చేదే ఈ ఐ సిప్. దాదాపు అన్ని మ్యూచు వల్ ఫండ్ సంస్థలూ ఇపుడు ఆన్లైన్లో సిప్ ఇన్వెస్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చాయి. సిప్ పాజ్: రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూనే... చేతిలో డబ్బులు లేకున్నా, మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉండి తక్కువ యూనిట్లు వస్తాయనిపించినా బ్రేక్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ మధ్యే బరోడా పయనీర్ సిప్ పాజ్ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం వివిధ సందర్భాల్లో గరిష్టంగా 3 ఇన్స్టాల్మెంట్స్ వరకు ఆపొచ్చు. సిప్ ఇన్ డెట్: ఈ మధ్య కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెట్ ఫండ్స్లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్స్ను ఆరంభించాయి. ఎస్టీపీ: అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మీ దగ్గరున్న మొత్తాన్ని తక్కువ రిస్కుండే డెట్ పథకాల్లో మొదట ఇన్వెస్ట్ చేసి, దాన్నుంచి ఈక్విటీ ఫండ్లోకి ప్రతి నెలా కొంత ఇన్వెస్ట్ చేసే విధానమిది. సిప్ పనిచేసేదిలా... స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అన్నదాంతో సంబంధం లేకుండా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమే సిప్. ఇలా చేసినపుడు మార్కెట్లు పడిపోతున్నాయనో, పెరిగిపోతున్నాయనో ఆందోళన ఉం డదు. ఎందుకంటే ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్నాం కనక... మార్కెట్లు బాగా పెరిగి ఉన్నపుడు మన సొమ్ముకు తక్కువ యూనిట్లు వచ్చినా... మార్కెట్లు తగ్గి ఉన్నపుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుందన్న మాట. అధిక లాభాలు... చిన్న ఉదాహరణ చూద్దాం. రాజేష్ 2009 ఫిబ్రవరిలో తన దగ్గరున్న రూ.1.2 లక్షలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్లో ఒకేసారి ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఈ ఐదేళ్లలో ఈ పథకం మొత్తమ్మీద 24 శాతం రాబడి అందించింది. అంటే రాజేష్ ఇన్వెస్ట్మెంట్ ఇపుడు రూ.1.48 లక్షలకు చేరింది. ఇదే ఫండ్లో రాకేష్ మాత్రం ఒకేసారి కాకుండా 2009 ఫిబ్రవరి నుంచి నెలకు రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఐదేళ్లలో తను కూడా రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ తనకు మొత్తమ్మీద 35 శాతం రాబడి లభించింది. తన మొత్తం ఇపుడు రూ.1.62 లక్షలకు చేరింది. గత ఐదేళ్లలో మన స్టాక్ మార్కెట్లు తీవ్రమైన హెచ్చు తగ్గులకు లోనవటంతో ఇది సంభవించింది. రాజేష్కు ఒకేసారి తన మొత్తమంతా పెట్టడం వల్ల వడ్డీ కూడా చాలావరకు నష్టపోయాడు. రాకేష్ మాత్రం నెలకు కొంత చొప్పున పెట్టడం వల్ల పెద్దగా ఇబ్బంది పడకున్నా తగిన లాభం మాత్రం పొందాడు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం సిప్ ప్రయోజనాలు... హా మార్కెట్లు పెరుగుతుంటే తక్కువ యూనిట్లు పతనం అవుతున్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి కనక కాస్ట్ యావరేజింగ్కి ఉపయోగపడుతుంది. మార్కెట్లు పెరుగుతాయా? పడతాయా? అనే సందేహాలను పక్కనబెట్టి ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వలన ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. కొంచెం కొంచెం మొత్తాలతో దీర్ఘకాలంలో పెద్ద నిధిని సమకూర్చుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement