-
సంక్షోభం!
► సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ► యాభై మందికిపైగా దివాళా తీసిన వ్యాపారులు ► పేరుకుపోయిన కోటి మీటర్ల వస్త్రం ► సర్కారు పైనే భారం సిరిసిల్ల : ‘సిరి’శాలగా పేరున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్రవ్యాపారం బందీకావడం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను దెబ్బతీయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాళా తీస్తున్నారు. సిరిసిల్లలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, ఏడువేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఒక్కో మగ్గంపై నిత్యం వంద మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది. నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి అవుతుంది. పాలిస్టర్ వస్త్రానికి వినియోగించే నూలు కిలో ధర రూ.102 ఉంది. ఇరవై రోజుల కిందట కిలో ధర రూ.92 ఉంది. ప్రతి కిలో నూలుకు రూ.10 ధర పెరగ్గా ఉత్పత్తి అయిన వస్త్రానికి ఆ మేరకు ధర పెరగడం లేదు. మీటరు పాలిస్టర్ వస్త్రాన్ని సిరిసిల్ల మగ్గాలపై ఉత్పత్తి చేసేందుకు రూ.7.30 ఖర్చు అవుతుంది. కానీ మీటరు వస్త్రానికి రూ.6.70 ధర లభిస్తుంది. ప్రతి మీటర్ వస్త్రంపై వ్యాపారులు 60పైసలు నష్టాలను చవిచూస్తున్నారు. బట్టకు ధరలేదని అమ్మడం ఆపేయడంతో సిరిసిల్లలో వస్త్రం నిల్వ లు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సిరిసిల్లలో కోటి మీటర్ల వస్త్రం నిల్వలున్నాయి. సిరిసిల్లకు నూలు సరఫరా చేసే హైదరాబాద్ పెద్ద సేట్లే మళ్లీ వస్త్రం కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్లకు నూలు ఇవ్వడం, గుడ్డ కొనడం వారిచేతుల్లోనే ఉంది. దీంతో పెద్ద సేట్ల కనుసన్నల్లోనే సిరిసిల్ల వస్త్ర వ్యాపారం ఆధారపడి ఉంది. యాభై మంది హైదరాబాద్ సేట్లు సిరిసిల్లను గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. నిజానికి ఇతర ప్రాంతాల్లోనూ పాలిస్టర్ వస్త్రానికి ధర లేకపోవడంతో అనివార్యంగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు హైదరాబాద్ సేట్లకు బట్ట ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దివాళా తీసిన వ్యాపారులు సిరిసిల్లలో ఎంతో నమ్మకంగా వస్త్ర వ్యాపారం సాగిస్తున్న పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా తీసినట్లు చర్చసాగుతోంది. మంత్రి రవీందర్ వాట్సప్ మెసేజ్ ఉదంతంతో దివాళా వ్యాపారుల దైన్యస్థితి వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది మధ్య తరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో పెద్ద సేట్లుగా పేరున్న ఓ నలుగురు వ్యాపారులు చిన్న వ్యాపారులను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు వస్త్రం ధరలను మరింత తగ్గించి, ఆసాములకు ఇచ్చే కూలిని తగ్గిస్తూ.. చిన్న వ్యాపారులను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్లో పోటీ లేకుండా చేసుకునే లక్ష్యంతో సిరిసిల్ల పెద్దసేట్లు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు సమాచారం. సిరిసిల్లలోని వ్యాపారులకు హైదరాబాద్ సేట్లు నూలు ఇవ్వకుండా అడ్డుపడుతూ అపనమ్మకాన్ని కలిగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ వ్యాపారులు సైతం గతంలో నూలు ఉద్దెర ఇస్తూ.. నెల రోజులకు డబ్బులు తీసుకునే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారం రోజుల్లో డబ్బులిస్తేనే నూలు ఇస్తాం... గుడ్డ అమ్మినా.. అమ్మకపోయినా డబ్బులిస్తామంటేనే పాలి స్టర్ నూలు ఇస్తామని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో నష్టపోయిన సిరిసిల్ల వ్యాపారులు అప్పుల వేటలో పడగా కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. గుడ్డ అమ్మక, నూలు నమ్మక వస్త్రవ్యాపారం సంక్షోభం ఉంది. ఇప్పటికిప్పుడు యాభై మంది వస్త్ర వ్యాపారులు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో సిరిసిల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు కరువు పరిస్థితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీని ప్రభావం సిరిసిల్లలోని ఇతర రంగాల్లోనూ ప్రబలంగా ఉంది. ప్రత్యామ్నాయం ఏమిటి..? ► సిరిసిల్లలో ఇప్పుడున్న మరమగ్గాలపై అనేక రకాల వస్త్రాలను ఉత్పత్తి చేయవచ్చు. ► మార్కెట్లో డిమాండ్ లేని పాలిస్టర్ను వదిలిపెట్టి, డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేయాలి. ► కొద్ది మంది వస్త్రవ్యాపారులు డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. సంక్షోభాలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ► హైదరాబాద్లోని బడా సేట్లపై ఆధారపడకుండా సొంతగా బ్యాంకు రుణాలు పొంది పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ► సిరిసిల్లలో ముద్రవంటి పథకాల్లో రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ► ఇప్పటికే కొద్ది మంది ప్రయోగాలను చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నారు. ► చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వస్త్ర వివరాలను సేకరించాలి. ► సిరిసిల్ల మరమగ్గాలపై పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేసే నైపుణ్యం కార్మికుల్లో ఉంది. ► సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ని సృష్టిస్తేనే ఆర్థిక సంక్షోభాలను అధిగమించవచ్చు. -
కావూరి.. కరుణించాలి
సిరిసిల్ల, న్యూస్లైన్ : రాష్ర్టంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలతో ఘనకీర్తి పొందిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ నేతన్నల బతుకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. సర్కారు అస్తవ్యస్త విధానాలతో తరచూ తలెత్తుతున్న సంక్షోభాల వల్ల నేత కార్మికులు నూలుపోగులనే ఉరితాళ్లుగా చేసుకుని బలవన్మరణాల బలిపీఠమెక్కుతున్నారు. వస్త్రపరిశ్రమనే నమ్ముకుని ఐదు వేల మంది ఆసాములు, 25 వేల మంది కార్మిక కుటుంబాలు నిత్యం బతుకు సమరం సాగిస్తున్నాయి. పరిశ్రమలో ఆటుపోట్లతో నష్టపోతున్నది ఆసాములు, కార్మికులే. గత ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది ఆత్మహత్య చేసుకోవడం కార్మిక కుటుంబాల దుస్థితిని తెలుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జౌళిమంత్రిత్వ శాఖ సిరిసిల్లను క్లస్టర్గా ఎంపిక చేసి మరమగ్గాల ఆధునికీకరణకు పూనుకోవడం శుభపరిణామం. కేవలం ఈ క్లస్టర్తోనే కష్టాలు కడతేరుతాయనుకోవడం అత్యాశే అవుతుందని కార్మికులు అంటున్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభానికి మూలాలను గుర్తించి.. ఆ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరమగ్గాల ఆధునికీకరణ క్లస్టర్ ప్రారంభోత్సవానికి నేడు సిరిసిల్లకు వస్తున్న కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మరిన్ని వరాలు ప్రకటించాలని వేడుకుంటున్నారు. క్లస్టర్పై ఆసక్తి కరువు.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు పవర్లూం క్లస్టర్లను గుర్తించగా అందులో సిరిసిల్ల ఒకటి. దీనికింద 50 శాతం సబ్సిడీతో మరమగ్గాలను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న మగ్గాలకు ఆధునిక పరికరాలను అమర్చుకుంటే పవర్లూంపై మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 8 మగ్గాల వరకు ఆధునికీకరించుకోవచ్చు. సిరిసిల్లలో 5 వేల మంది ఆసాములు, 34 వేల మరమగ్గాలు ఉండగా ఇప్పటివరకు 392 మంది ఆసాములు, 2,982 మగ్గాలను మాత్రమే ఆధునికీకరించుకునేందుకు ముందుకొచ్చారు. సమస్యలిక్కడ.. సేవాకేంద్రం ఎక్కడో.. సిరిసిల్లలో సేవలందించాల్సిన మరమగ్గాల సేవాకేంద్రం హైదరాబాద్లో కొనసాగుతోంది. దానిని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. సమస్యలు ఇక్కడ ఉంటే.. సేవా కేంద్రం అక్కడ ఉండడం ఎవరికి సేవలందించేందుకో అర్థం కాదు. చిత్తూరు జిల్లా నగరిలో పదివేల మరమగ్గాలు ఉంటే.. అక్కడే సేవా కేంద్రం కొనసాగుతోంది. 7వేల కుటుంబాలకే బీమా ధీమా సిరిసిల్లలో 25 వేల కార్మిక కుటుంబాలుండగా.. ఏడువేల కుటుంబాలకే జనశ్రీ బీమా యోజన వర్తిస్తోంది. మిగతా 18 వేల కుటుంబాలకు బీమా ధీమా కరువైంది. ఇప్పటికీ సగం మంది కార్మికులు గుర్తింపు కార్డులకు నోచుకోవడం లేదు. టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల మూత రాష్ట్రంలోనే తొలిసారిగా 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కు ఆదిలోనే మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. అధిక విద్యుత్ బిల్లులు, అందని రాయితీలు, మౌలిక వసతుల లేమితో ఈ దుస్థితి తలెత్తింది. ఇందులో 223 ప్లాట్లు కేటాయించగా, 130 పరిశ్రమలు మాత్రమే వెలిశాయి. ఇందులో ఇప్పటికే 40 దాకా యూనిట్లు మూతపడ్డాయి. చేనేత ఖిల్లా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. కాలం చెల్లిన మగ్గాలను ఆధునికీకరించి నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో డిమాండ్గా వస్త్రాన్ని అమ్ముకునే అవకాశం దరిచేరుతోంది. దేశంలోనే తొలిసారిగా సిరిసిల్లలో పవర్లూం క్లస్టర్ను కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మంగళవారం ప్రారంభించనున్నారు. సిరిసిల్లను పవర్లూం క్లస్టర్గా ప్రకటించి ప్రత్యేక రాయితీలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జౌళి శాఖ అధికారులు పేర్కొంటుండగా, క్లస్టర్ ఏర్పాటు కార్మికుల కష్టాలను గట్టెక్కిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి ‘కావూరి’ రాక సందర్భంగా సిరిసిల్ల సమస్యలపై ఫోకస్... సిరిసిల్ల, న్యూస్లైన్ మూడు దశాబ్ధాలుగా సిరిసిల్ల నేతన్నలు పురాతన మగ్గాలతో కాటన్, పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో మొత్తం 34 వేల మరమగ్గాలు ఉండగా, ఇందు లో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మ గ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తవుతోంది. 120 డైయింగ్లు, 50 సైజింగ్లతో వస్త్రోత్పత్తి పరిశ్ర మ విస్తరించి ఉంది. పాతికవేల మంది కార్మికులు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మగ్గాలకు కేవలం రూ.30 వేల పెట్టుబడితో ఆధునికీకరించుకోవడం ద్వారా వస్త్రం నాణ్యత పెరుగుతుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మరమగ్గాలకు ఆధునికమైన వార్ప్, వెప్ట్ స్టాప్మోషన్, ఎపిసెంట్ బ్రేకింగ్ డివైస్, 0.75 హెచ్పీ మోటార్లు అమర్చుకుంటే సరిపోతుంది. ఈ విధానం మూలంగా పోగు తెగిపోయినప్పుడు వెంటనే మగ్గం ఆగిపోతుం ది. ఫలితంగా వస్త్రం నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క మగ్గం ఆధునికీకరించేందుకు రూ.30 వేలు అవసరమవుతుండగా, ఇందులో కేంద్ర జౌళి శాఖ రూ.15 వేల సబ్సిడీ అంది స్తోంది. మరో రూ.15 వేలను ఆసామి భరిస్తే మగ్గాల ఆధునికీకరణ పూర్తవుతుంది. ఇంత మొత్తాన్ని భరించలేని ఆసాములకు రూ.10 వేల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పవర్లూం క్లస్టర్ పెలైట్ పథకం ద్వారా ఎన్ని మగ్గాలనైనా వచ్చే ఐదేళ్ల లో ఆధునికీకరించేందుకు సబ్సిడీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ మగ్గాలపై ఆధునిక డిజైన్లను ఉత్పత్తి చేసే వీలుంది. మరోవైపు కార్మికుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇప్పించాలి. బకాయిలకు మోక్షం లభించేనా? 2010 మార్చి నుంచి సిరిసిల్ల సెస్కు రాష్ట్ర ప్ర భుత్వం ద్వారా రావాల్సిన యాభై శాతం విద్యుత్ రాయితీ బకాయి ఏటేటా పెరిగిపోతోంది. ఇప్పటివరకు రూ.25.26 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సిరిసిల్లలో 5,710 మరమగ్గాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిపై వచ్చే విద్యుత్ బిల్లుల్లో సగాన్ని ఆసామి చెల్లిస్తుండగా, మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించాలి. ఇటీవల ప్రభుత్వం సెస్ బకాయిలు మంజూరు చేస్తూ, రూ.7.59 కోట్ల ఎఫ్ఎస్ఏ రద్దు చేస్తూ జీవో జారీ చేసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో సెస్కు రావాల్సిన రూ.25.26 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఫలితంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మూడంచెల విధానం సిరిసిల్లలో మూడంచెల విధానం అమలవుతోంది. నూలు మిల్లుల ద్వారా సిరిసిల్లలోని యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములు నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేసిన తరువాత తిరిగి ఆ వస్త్రాన్ని యజమానులకు అప్పగిస్తారు. ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులకు పని కల్పిస్తారు. మగ్గాల యజమాని ఆసామే కావడంతో కరెంటు బిల్లులను భరిస్తూ యజమాని వద్ద నూలు తెచ్చుకుని వస్త్రాన్ని తయారు చేసి అప్పగించడం ఆసామి డ్యూటీ. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. సిరిసిల్లలో యాభైమంది వరకు యజమానులు ఉండగా.. ఐదువేల మంది ఆసాములు ఉన్నారు. అందరూ కలిసి పాతికవేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమలో సంక్షోభం కారణంగా ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధలు, అనారోగ్యం, పరిశ్రమ సంక్షోభం ఆత్మహత్యలకు కారణమవుతోంది. కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి లభించే విధంగా చేతినిండా పని ఉంటేనే వారి బతుకులకు భరోసా లభిస్తుంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు.. విద్యుత్ టారిఫ్ రేటు పెరగడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు ఎక్కువగా వస్తున్న విద్యుత్ చార్జీలను భరించలేకపోతున్నారు. వీటికి తోడు ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) భారంగా మారాయి. మార్కెట్లో మరమగ్గాల మరమ్మతుకు అవసరమయ్యే విడిభాగాల రేట్లు పెరగడం, వస్త్రపరిశ్రమకు అవసరమైన నూలు రేట్లు పెరగడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. అదే స్థాయిలో వస్త్రాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి వీలులేక వస్త్రానికి గిట్టుబాటు ధర లభించడం లేదు. యజమానులు, ఆసాములు, కార్మికుల వ్యవస్థ మొత్తం ప్రైవేటు, అసంఘటిత రంగం కావడంతో ప్రభుత్వపరంగా వారిపై అజమాయిషీ ఉండడం లేదు. ఫలితంగా ఆసాములు సమ్మె చేయడంతో దినసరి కార్మికులు నష్టపోతున్నారు. యజమానులు మొండికేసినప్పుడు కార్మికశాఖ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో రాత్రీ పగలు పని చేయడం మూలంగా కార్మికులు, ఆసాములు శారీరకంగా అలసిపోతున్నారు. ఒక్కో కార్మికుడు పన్నెండు గంటల పాటు వస్త్రోత్పత్తి చేయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఎనిమిది గంటల పని విధానం ఉంటే పరిశ్రమలో కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. ఇటీవల అమలు చేస్తున్నా అది పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. సిరిసిల్ల వస్త్రోత్పత్తికి అవసరమైన నూలును యజమానులతో సంబంధం లేకుండా ఆసాములకు అందే విధంగా ప్రభుత్వ పరంగా నూలు డిపోలు లేకపోవడం పెద్ద సమస్య. ప్రభుత్వం నూలు డిపోలను ఏర్పాటు చేస్తే కొంత మేర మేలు జరిగే అవకాశముంటుంది. చేతినిండా పని ఉండాలి కార్మికులకు చేతినిండా పని ఉండే విధంగా చూస్తే చాలు. చేసుకుని బతుకుతం. నేను సూటింగ్ పని చేస్తా. నా భార్య మల్లిక బీడీలు చేస్తుంది. ఇప్పుడు 8 గంటలు పని చేస్తే వారానికి వెయ్యి నుంచి 1300 వస్తుంది. కూలి పెంచి పని కల్పించాలి. - సామల సాయికృష్ణ, కార్మికుడు హెల్త్కార్డులు ఇవ్వాలి కార్మికులకు హెల్త్కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు దవాఖానాల్లోనూ ఉచితంగా వైద్యం అందించాలి. మగ్గాలను ఆధుని కీకరించడంతోపాటు కార్మికులకు ఇల్లు, జాగ ఇచ్చి ఆ దుకోవాలి. అన్నింటి ధరలు పెరిగిన యి. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతలేదు. - కొమటిపల్లి సదానందం, కార్మికుడు కార్మికులకు మగ్గాలివ్వాలి ప్రతీ కార్మికుడికి నాలుగు మగ్గాలు ప్రభుత్వం అందించే ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణానికి రుణ వసతి కల్పించాలి. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించాలి. - మూషం రమేశ్, కార్మిక నాయకుడు చేనేత రంగాన్ని జౌళి శాఖ నుంచి వేరు చేసి సిరిసిల్ల కేంద్రంగా ప్రత్యేక కమిషనరేట్ను ఏర్పాటు చేయాలి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆప్కో తరహాలో కో-ఆప్టెక్స్ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ధర లేనప్పుడు నిల్వ చేసుకునే ఉత్పత్తిదారులకు రుణవసతి కల్పించాలి. వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలను రాయితీపై అందించేందుకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. చేనేత రుణాలతోపాటు మరమగ్గాల పరిశ్రమకు సంబంధించిన రుణాలను, వ్యక్తిగత రుణాలను మాఫీ చేయాలి. సిరిసిల్లకు 50 శాతం విద్యుత్ రాయితీని అందిస్తుండగా.. మరో 25 శాతం పెంచాల్సిన అవసరం ఉంది. వస్త్రోత్పత్తి, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ జనశ్రీ బీమా పాలసీలు చేయించాలి. తమ వద్ద పనిచేసే కార్మికులందరికీ యజమానులు, ఆసాములు బీమా చేయించేలా చర్యలు తీసుకోవాలి. పేద కార్మికులకు 35 కిలోల అంత్యోదయ కార్డులను అందించి అనర్హుల కార్డులను తొలగించాలి. సిరిసిల్లలోనే పాలిస్టర్, కాటన్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి వస్త్రం అమ్మకాలకు మార్కెట్ వసతి కల్పించాలి. సిరిసిల్ల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి కాకుండా.. దోమ తెరలు, చీరెల ఉత్పత్తి, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. {పభుత్వరంగ సంస్థల్లో సిరిసిల్ల వస్త్రాన్ని వినియోగించే విధంగా ప్రోత్సహించాలి. సాంఘిక సంక్షేమ హాస్టల్, స్కూల్ పిల్లలకు డ్రెస్లు, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బంది యూనిఫాంలకు ఇక్కడి వస్త్రాన్ని వినియోగించాలి. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న డైయింగ్, సైజింగ్, వార్పిన్ యూనిట్లకు పవర్లూం సబ్సిడీని వర్తింపజేయాలి. పవర్లూం స్థాపనకు గతంలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ ఇవ్వగా దాన్ని రూ.75 వేలకు పెంచి పవర్లూం పరిశ్రమను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్లూం సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. సబ్సిడీ విడుదల చేసి పవర్లూం పరిశ్రమ పటిష్టానికి ప్రభుత్వం కృషి చేయాలి. సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో చేపడితే.. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సమస్యలకు శాశ్వత మోక్షం లభిస్తుంది. ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ‘సిరి’సిల్లగా విలసిల్లే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement