-
క్రికెట్ సౌతాఫ్రికా కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు అదిరిపోయే శుభవార్త! కానీ..
క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్నెస్ టెస్టుల విషయంలో ఊరటనిస్తూ తమ క్రికెటర్లకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై రెండు కిలోమీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేకపోయినా... సెలక్షన్కు అందుబాటులో ఉండొచ్చని పేర్కొంది. అయితే, ఫిట్నెస్లో విఫలమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలన్న నిబంధన కూడా తప్పనిసరి కాదని.. జాతీయ జట్ల కోచ్లదే అంతిమ నిర్ణయం అని స్పష్టం చేసింది. ఫిట్నెస్ విషయంలో కనీస స్థాయి ప్రమాణాలు అందుకోకపోనట్లయితే అధికారిక మ్యాచ్లలో మైదానంలో దిగే అవకాశం మాత్రం ఉండదని కరాఖండిగా చెప్పింది. పరిమిత ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లోనూ ఈ కొత్త మార్గదర్శకాలను పాటిస్తామని బోర్డు తెలిపింది. పురుష, మహిళా క్రికెటర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని క్రికెట్ సౌతాఫ్రికా స్పష్టం చేసింది. కాగా ఇటీవల ప్రొటిస్ మహిళా క్రికెటర్లు డేన్ వాన్ నికెర్క్, లిజెల్లీ లీ.. సౌతాఫ్రికా మెన్స్ స్టార్ పేసర్ సిసంద మగల నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 18 సెకండ్ల తేడాతో టెస్టులో విఫలమై టీ20 ప్రపంచకప్కు దూరమైన నికెర్క్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. మగల మాత్రం ఫిట్నెస్ టెస్టులో పాసై నెదర్లాండ్స్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. 2023-24 సీజన్లో మాత్రం పాత నిబంధనలు పాటించాల్సి ఉంటుందని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడే పురుష క్రికెటర్లు 8 నిమిషాల 30 సెకండ్లలో పరుగు పూర్తి చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే మహిళా క్రికెటర్లు 9 నిమిషాల 30 సెకండ్లలో రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.అయితే, దేశవాళీ క్రికెట్ ఆడే వాళ్లు మాత్రం 10 నిమిషాల 15 సెకండ్ల వరకు ఛాన్స్ ఉంటుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్ -
చెన్నై సూపర్ కింగ్స్కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ ఔట్
ఐపీఎల్ 2023 సీజన్లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్ చాహర్, సిమ్రన్జీత్ సింగ్, బెన్ స్టోక్స్, ముకేశ్ చౌదరీ సేవలు కోల్పోయిన (తాత్కాలికంగా) ఆ జట్టుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్, సఫారీ భారీ కాయుడు సిసండ మగాలా ఫీల్డింగ్ చేస్తూ కుడి చేతి వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను మరో రెండు వారాలు లీగ్కు దూరంగా ఉంటాడని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సీఎస్కే పేస్ విభాగం.. మగాలా సేవలు కూడా కోల్పోవడంతో దిక్కుతోచని స్థితికి చేరింది. ఆ జట్టుకు పేస్ విభాగంలో మరో ఆప్షన్ కూడా లేదు. దేశీయ పేసర్లు, అంతగా అనుభవం లేని హంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్సింగ్లతో తదుపరి మ్యాచ్ల్లో నెట్టుకురావాల్సి ఉంటుంది. డ్వేన్ ప్రిటోరియస్, మతీష పతిరణ లాంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా జట్టు సమీకరణల దృష్ట్యా వీరికి తుది జట్టులో అవకాశం లభించడం కష్టం. తదుపరి మ్యాచ్ సమయానికంతా బెన్ స్టోక్స్ కోలుకున్నా అతను బౌలింగ్ చేయలేని పరిస్థితి. ఐపీఎల్కు ముందే తాను బౌలింగ్ చేయలేనని, కేవలం బ్యాటర్గా అందుబాటులో ఉంటానని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం బ్యాటింగ్ వనరుల సాయంతో సీఎస్కే నెగ్గుకురావడం దాదాపుగా అసాధ్యం. గాయాల బారిన పడిన పేసర్లు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే చేసేదేమీ ఉండదు. పేస్ బౌలింగ్ విభాగం విషయంలో సీఎస్కే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోకపోతే చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధోని మోకాలి గాయం ఆ జట్టును మరింత కలవరపెడుతుంది. గాయం పెద్దదేమీ కాదని కోచ్ చెప్తున్నప్పటికీ లోలోపల ఆ జట్టు ఆందోళన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, రాజస్థాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో సీఎస్కే 3 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించగా.. ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్లు) చెన్నైను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Kalki 2898 AD : ప్రమోషన్స్కి భారీ ప్లాన్..నెల రోజుల్లో ఎన్నో సర్ప్రైజెస్!
నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
తప్పక చదవండి
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
- అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
- పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
Advertisement