-
షటిల్ ఆడుతూ జారిపడ్డ హోంమంత్రి
-
అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి?
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు. -
మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్
లండన్ :యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన ప్రభావం ఇంకా పౌండ్ ను పట్టి పీడిస్తోంది. బ్రెగ్జిట్కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటువేయడంతో భారీగా పతనమైన కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ మంగళవారం మరింత దిగజారింది. డాలర్ కంటే యూరో కు వ్యతిరేకంగా మరింత తక్కువ పడిపోయింది ఆర్థిక, ద్రవ్య అనిశ్చితి పరిస్థితులపై ఇన్వెస్టర్ల ఆందోళనతో పౌండ్ మరోసారి 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 1.3 శాతం నష్టంతో 1985 నాటి కంటే కిందికి క్షీణించింది. అలాగే రెఫరెండం తర్వాత సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా పౌండ వాల్యూని దెబ్బ తీసింది. యూరో కి వ్యతిరేకంగా పౌండ్ విలువ 84.90 పెన్స్ కు పడిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డాలర్ కు వ్యతిరేకంగా పౌండ్ విలువ 10 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ పరిణామంతో యూరోజోన్ కూడా బలహీనంగా ఉంది. అయితే బ్రిటన్ కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ను ప్రకటించనుంది. ఇది బ్యాంకుల స్థిరీకరణకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవకాశం ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. తన సామర్థ్యం పునరుద్ఘాటించుకోనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రభావం పౌండ్ మీద ఉండదని తెలిపారు. అయితే రెఫరెండానికి ముందు స్థాయికి పౌండ్ విలువ చేరాలంటే మరిన్ని వారాలు పడుతుందని ఆర్ బీసీ క్యాపిటల్ మార్కెట్స్ కి చెందిన అదాం అలే చెప్పారు. మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనావేశారు. మరోవైపు బ్రిటిష్ ఆర్థిక మంత్రి జార్జ్ ఓస్ బోర్న్ బ్యాంకు ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ అయ్యారు. ఈయూ నుంచి నిష్క్రమణ ఎలా స్పందించాలనే దానిపై చర్చలు జరిపారు. బ్రెగ్జిట్ బ్లాస్ట్ ఫలితంగా బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ లో ముఖ్యమైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సోమవారం తన ట్రేడింగ్ ను సస్పెండ్ చేసింది. అటు ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement