-
ఆ ఎమ్మెల్యే ఎక్కడ?
ఇక్కడి యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఈ కేసు దర్యాప్తును సీసీబీకి అప్పగించారు. అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు, ఈ కేసులో తొలి నిందితుడు సోమశేఖర్ గౌడ ఇక్కడి సెషన్స్ కోర్టులో ముంద స్తు బెయిల్ కోసం అర్జీలు సమర్పించారు. మరో వైపు నిర్ణీత సమయం గడిచి పోయినా బార్ను ఎందుకు తెరిచి ఉంచారంటూ అబ్కారీ శాఖ స్కై బార్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత మంగళవారం రాత్రి ఒకటిన్నర వరకు బార్ను తెరచి ఉంచడం, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి వారం గడువు ఇచ్చారు. ఆలోగా సమాధానం రాకపోతే లెసైన్స్ను రద్దు చేస్తామని అబ్కారీ శాఖ నోటీసులో పేర్కొంది. -
రభస..
ఎమ్మెల్యే కాశప్ప వ్యవహారంపై అట్టుడికిన ఉభయ సభలు అరెస్ట్కు పట్టుబట్టిన బీజేపీ శెట్టర్, సిద్ధు తీవ్ర వాగ్వాదం స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యుల ఆందోళన సభలు సోమవారానికి వాయిదా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాగలకోటె జిల్లా హనగుంద ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ (కాంగ్రెస్)ను తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్ష బీజేపీ రెండో రోజు శుక్రవారమూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో సభ్యులను శాంతింపజేయడానికి పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సోమవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎమ్మెల్యే ఆచూకీ గురించి ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ఈ దశలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. మూడు సార్లు బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ల మధ్య ఆవేశ పూరితంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఈరోజు దీనిపై ప్రకటన చేస్తానని చెప్పిందని శెట్టర్ గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక దీనిపై మాట్లాడతామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రతిష్టంభన నెలకొంది. తొలుత బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఆచూకీ గురించి మీకేమైనా తెలుసా అంటూ స్పీకర్ను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన శెట్టర్ ఇదో తలవంపుల సంఘటన అంటూ, తానేమీ తప్పు చేయలేదని చెబుతున్న ఎమ్మెల్యే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారని నిలదీశారు. దీనిపై ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి, న్యాయ శాఖ మంత్రుల్లో ఎవరూ సభలో లేరని తెలిపారు. ఈ దశలో ప్రవేశించిన ముఖ్యమంత్రి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. మంత్రిగా ఉన్నప్పుడు హాలప్ప చేసిన పని, ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య కేసు, శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నీలి చిత్రాలు చూడడం లాంటి సంఘటలను ఉటంకించడంతో బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఎమ్మెల్యే విషయమై సమాధానం చెబుతామంటున్నా, ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ నిలదీశారు. ప్రశ్నోత్తరాలను జరగనీయండి, సభకు ఆటంకం కల్పించవద్దు అని కోరారు. ఈ సందర్భంగా శెట్టర్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ హయాంలో కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించడంలో సభలో మళ్లీ అలజడి చెలరేగింది. మధ్యలో కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ ‘పార్టీలు అందరూ చేసుకుంటారు. విజయానంద అవివేకంగా ప్రవర్తించాడు. తగులుకోకుండా ఉండాల్సింది’ అని అనడంతో గందరగోళంలోనూ సభ్యులు నవ్వుకున్నారు. ఈ దశలో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే బీజేపీ సభ్యులు పట్టు వీడకుండా ధర్నాకు దిగారు. శాసన మండలిలో.. పోలీసులపై ఎమ్మెల్యే విజయానంద దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు శాసన మండలిలో శుక్రవారం ధర్నాను కొనసాగించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వం నుంచి ప్రకటన చేయించాలని చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రకటన చేయిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, ధర్నా విరమించలేదు. ఈ సందర్భంగా పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభా నాయకుడు ఎస్ఆర్. పాటిల్ జోక్యం చేసుకుని, ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, వేరే విషయాన్ని చేపట్టిన ఉదాహరణలు లేవని గుర్తు చేశారు. జేడీఎస్ నాయకుడు బసవరాజ హొరట్టి కూడా ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని బీజేపీ సభ్యులను కోరారు. చివరకు చైర్మన్ ప్రశ్నోత్తరాల తర్వాత హోం మంత్రితో ప్రకటన చేయిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సోమవారం ప్రకటన చేస్తానని హోం మంత్రి తెలపడంతో బీజేపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. -
ఎమ్మెల్యే సహా తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు
స్కై బార్ ఫలితం పరారీలో రౌడీ షీటర్ సోమశేఖర గౌడ అవసరమైతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తాం : శరత్ చంద్ర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఇక్కడి యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసులు, బార్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బాగలకోటె జిల్లా హునగుంద ఎమ్మెల్యే (కాంగ్రెస్) విజయానంద కాశప్పనవర్ సహా తొమ్మిది మందిపై పోలీసులు గురువారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కల్పించారని, నోటికొచ్చినట్లు దూషించారని, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 353, 504 కింద కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు ఉన్న రౌడీ షీటర్ సోమశేఖర గౌడ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ కేవీ. శరత్ చంద్ర తెలిపారు. అతనిపై గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి అవసరమైతే ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా మంగళవారం రాత్రి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బార్కు వెళ్లి దౌర్జన్యం చేసి, ఒకటిన్నర గంటల వ రకు పూటుగా మద్యం సేవించి, నృత్యాలు చేశారు. సమయం మించి పోయినా బారును తెరిచి ఉంచడంతో పోలీసు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఎమ్మెల్యేతో పాటు విజయానంద దాడికి పాల్పడ్డారు. మరో వైపు పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఎమ్మెల్యే ఇక్కడి సిటీ కోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. బహిష్కరణ దౌర్జన్యానికి పాల్పడిన సోమశేఖర గౌడను కాంగ్రెస్ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్యే విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే, చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement