-
కొత్త కళ
మరో నాలుగు బస్తీల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్లు పేదలకు సర్కారు దసరా కానుక నేడు శంకుస్థాపన సిటీబ్యూరో: స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా నగరంలో మరో నాలుగు బస్తీల్లోని ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ కాలనీ తరహాలో గ్రేటర్లోని నాలుగు నియోజకవర్గాల పేదలకు దసరా కానుకగా ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ ఇళ్లకు నేడు (గురువారం) శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్రెడ్డి, కె.టి.రామారావులు వీటికి శంకుస్థాపనలు చేస్తారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సనత్నగర్ నియోజకవర్గంలో కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్రోడ్స్ దగ్గర చిత్తారమ్మబస్తీ, సనత్నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీ, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ దోబీఘాట్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాంచారమ్మ నగర్లలో ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశారు. బోయిగూడలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కూ గురువారమే శంకుస్థాపన చేయనున్నారు. అందరికీ అవకాశం కల్పించాలని... రజకులు తదితరుల కోసం దోబీఘాట్లో ఇళ్లు నిర్మిస్తుండగా... మిగతా ప్రాంతాల్లో స్థానికంగా గుడిసెల్లో, చిన్నా చితకా ఇళ్లల్లో తలదాచుకుంటున్న వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్నారు. జ్లీపస్ 2 పద్ధతిలోనా లేక అంతకంటే ఎక్కువ అంతస్తుల్లోనా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లబ్ధిదారుల సంఖ్య, స్థానికుల నుంచి ఎదురేయ్యే అభ్యంతరాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని దీన్ని ఖరారు చేయనున్నారు. ఎక్కువ అంతస్తుల్లో ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే స్థానికంగా ఉంటున్న అందరికీ అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. త్వరలో ఐడీహెచ్ కాలనీ ప్రారంభం గత సంవత్సరం దసరా రోజున శంకుస్థాపన జరిగిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను గురువారం ప్రారంభించాలని తొలుత భావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండటం.. పూర్తయిన ఇళ్లకు రంగులు, రహదారుల నిర్మాణం వంటివి పూర్తి కావాల్సి ఉండటంతో కొద్ది రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చిలకలగూడ : చిలకలగూడ దోబీఘాట్ స్థలంలో సుమారు 200 ఇళ్ల నిర్మాణానికి గురువారం పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆబ్కారీ మంత్రి పద్మారావు బుధవారం రాత్రి దోబీఘాట్ స్థలాన్ని సందర్శించి హౌసింగ్, రెవెన్యూ అధికారులు, క్రాంతి రజక అభివృద్ధి సంఘం సభ్యులతో చర్చించారు. శంకుస్థాపన పనులను పరిశీలించారు. చిలకలగూడ దోబీఘాట్పై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్ల తరబడి సొంత ఇళ్లు లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు మంత్రి పద్మారావు చొరవతో హౌసింగ్స్కీం అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
పీపీపీ..ఇక హ్యాపీ!
- తెరపైకి కొత్త ప్రతిపాదనలు - పీపీపీ విధానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు - హామీని నిలబెట్టుకునేందుకు యత్నాలు - ఖజానాపై భారం పడకుండా సర్కారు జాగ్రత్తలు సాక్షి, సిటీబ్యూరో: స్లమ్ఫ్రీ సిటీలో భాగంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామన్న ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ హామీని నిలబెట్టుకోవడంతో పాటు... అదే సమయంలో ఖజానాపై భారం పడకుండా చూడాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది. ఇకపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అటు ప్రజల వద్ద మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని...తమకు భారం తప్పుతుందని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంతవరకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెచ్చించే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇది ఆర్థికంగా భారంగా మారుతుండడంతో కొత్త దారి వైపు చూస్తోంది. ఎస్సార్ నగర్తో శ్రీకారం తొలుత ఎస్సార్నగర్-అమీర్పేట మార్గంలోని ‘స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్’ (ఎస్హెచ్టీఓ)కు చెందిన స్థలంలో ఈ విధానంలో పేదలకు డబుల్ బెడ్రూమ్, హాల్, వంటగది, రెండు మరుగుదొడ్లతో కూడిన ఇళ్లు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సమీపంలోని ఐడీహెచ్ కాలనీలో 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం రూ.36.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఐమాక్స్ సమీపంలోని ఇందిరా నగర్లోనూ మరో 250 ఇళ్లకు దాదాపు రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఐడీహెచ్ కాలనీలో జీప్లస్ టూ విధానంలో నిర్మిస్తున్నారు. ఇందిరానగర్లో జీప్లస్5 పద్ధతిలో కట్టేందుకు ప్రతిపాదిస్తున్నారు. నగరంలోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇకపై పీపీపీ పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగైదు అంతస్తుల్లో పేదలకు అవసరమయ్యే ఇళ్లను లిఫ్ట్లతో పాటు సకల సదుపాయాలతో నిర్మించాలని యోచిస్తోంది. వీటి నిర్మాణ వ్యయాన్ని భరించే సంస్థకు మొత్తం బిల్టప్ ఏరియాలో దాదాపు 50 శాతం ఇవ్వాలనేది ప్రాథమిక యోచనగా తెలిసింది. తద్వారా ఇటు తమపై భారం తప్పడంతో పాటు అటు బిల్డర్కూ లాభసాటి గా ఉంటుందనే ఈ ప్రతిపాదనలకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారం పడకుండా... రాబోయే రెండేళ్లలో పేదల కోసం దాదాపు పదివేల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. నగర శివార్లలో... ఎక్కడో దూరంగా కాకుండా మంచి డిమాండ్ ఉన్న బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో గృహాలు నిర్మిస్తున్నారు. పేదల ఇళ్ల కోసం ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. స్థల సమస్య తీరుతున్నప్పటికీ నిర్మాణ భారం తీవ్రమవుతోంది. పీపీపీ విధానంతో ప్రభుత్వంపై భారం లేకుండానే ఇళ్లను పూర్తి చేయవచ్చునని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అమీర్పేటలో ఎస్హెచ్టీఓకు చెందిన ఏడెకరాల స్థలాన్ని ఇటీవలే జీహెచ్ఎంసీకి బదలాయించారు. జీప్లస్ 3 విధానంలో కడితే ఎకరాకు వంద ఇళ్ల చొప్పున ఏడెకరాల్లో దాదాపు 700, జీప్లస్5 పద్ధతిలో అయితే వెయ్యికిపైగా ఇళ్లు నిర్మిం చగలరని అంచనా. దాదాపు 580 ఎస్ఎఫ్టీతో వీటిని నిర్మించనున్నారు. పేదల ఇళ ్లకోసం అవసరమైతే ఎకరాకు రూ.5 కోట్లయినా ఖర్చుచేసి భూమిని కొంటామని సీఎం చంద్రశేఖరరావు ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖజానాపై భారం లేకుండానే ఎక్కువ మందికి గృహ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం పీపీపీ విధానానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
కొత్తకొత్తగా...
సాక్షి, సిటీబ్యూరో: స్లమ్ఫ్రీ సిటీలో భాగంగా నగరంలోని మురికివాడల స్థానే అందమైన కాలనీల నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం... వీటిని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ వ్యయం కొంత అధికమైనప్పటికీ, పనులు తొందరగా పూర్తవు తాయని... సమయం కలిసి వస్తుందని అంటున్నారు. స్లమ్ఫ్రీ సిటీలో భాగంగా తొలిదశలో మరో 12 బస్తీల్లో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. అందులో ఇప్పటికే 8 బస్తీలను ఎంపిక చేసినట్లు తెలిసింది. రూ.500 కోట్లతో పనులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాలకు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం రూ.250 కోట్ల వంతున (మొత్తం రూ.500 కోట్లు) మంజూరు చేసింది. ఈ నిధులతో పేదలకు డబుల్ బెడ్రూమ్, డబుల్ టాయ్లెట్, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్లను నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్కుమార్ తెలిపారు. వీటితో పాటేరహదారులు, పార్కులు, షాపింగ్కాంప్లెక్స్లు, కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తొలి దశలో 12 బస్తీల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. కూకట్పల్లిలోని అమ్రునగర్ తండాలో ప్రయోగాత్మకంగా తొలి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి ప్రాధాన్యం వారికే... ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కావడంతో ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్న బస్తీలను ఎంపిక చేశారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగలదని తొలుత అంచనా వేశారు. రహదారులు, పార్కులు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో కలిపి ఐడీహెచ్ కాలనీలో ఒక్కో ఇంటికి ప్రస్తుతం రూ.9.20 లక్షల వంతున ఖర్చవుతోంది. దీని కంటే వ్యయం కాస్త అధికమైనా సమయం, నాణ్యత ఉంటాయని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆకట్టుకునేలా... తొలి దశలో నిర్మించే ఈ ఇళ్లను చూసి మిగతా బస్తీల్లోని ప్రజలు ఆసక్తి చూపేలా నిర్మాణం... సదుపాయాలు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టే చోట స్థానికులను ఒప్పించేందుకు అధికారులు తిప్పలు పడాల్సి వస్తోంది. తక్కువ విస్తీర్ణం, సదుపాయాలు లేనప్పటికీ... తమకు ప్రత్యేకంగా ఉండాలని... అపార్ట్మెం ట్లు వద్దని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలిదశ ఇళ్లను చూసిన తరువాత వారి అభిప్రాయం లో మార్పు రావచ్చని అధికారులు ఆశిస్తున్నారు. తద్వారా మిగతా ప్రాంతాల వారు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి అంగీకరించవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన బస్తీలు... కుటుంబాలు... సామాజికవర్గాల వివరాలు సర్కిల్ బస్తీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు జనరల్ మొత్తం కాప్రా సింగం చెరువు 1 58 0 0 1 60 చార్మినార్-4 జంగమ్మెట్ 110 8 0 0 199 317 చార్మినార్-5 గోడేకి ఖబర్ 162 1 0 0 10 173 చార్మినార్-5 స్వామి వివేకానంద నగర్ 235 279 0 0 24 538 చార్మినార్-5 పార్థివాడ 7 150 0 0 0 157 అబిడ్స్-9 లంబాడీతండా 1 85 0 0 4 90 ఖైరతాబాద్-10 అంబేద్కర్ నగర్ 62 6 27 2 1 98 కూకట్పల్లి-14 అమ్రునగర్ తండా 0 155 0 0 0 155 మొత్తం 578 742 27 2 239 1588 -
స్లమ్ ఫ్రీ సిటీగా కరీంనగర్
మురికివాడలు లేని నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. 23న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో నగర రూపురేఖలు మార్చేలా రూ.100 కోట్ల నిధులు రాబట్టుకునేందుకు అధికారులు, కార్పొరేషన్ పాలకవర్గం అంచనాలు రూపొందించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, జేసీ పౌసుమి బసు, ఎంపీ వినోద్కుమార్, మేయర్ రవీందర్సింగ్లు సోమవారం నగరంలోని మురికివాడల్లో పర్యటించి, ప్రజలతో ముచ్చటించారు. - రాంనగర్/కరీంనగర్ రాంనగర్ : ముంబాయి, హైదరాబాద్లాంటి మహానగరాల్లోనే అపార్ట్మెంట్ కల్చర్ సహజంగా మారిందని, దానిని అనుసరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పేదింటి వారి కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటించనున్న 10వ డివిజన్లోని పలు మురికివాడల కానీలను ఎంపీ సోమవారం పరిశీలించారు. ఇరుకు గుడిసెలలో ఉన్న వారికి రెండు బెడ్రూమ్స్, హాల్, కిచెన్ వంటి సదుపాయాలతో ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేస్తుందన్న హామీకి కట్టుబడి సీఎం పర్యటనకు రంగం సిద్ధమైందన్నారు. దాదాపు రూ.100 కోట్లతో స్లమ్ ఏరియాలలో ఇంటి నిర్మాణాలు, డ్రెరుునేజీలు, పార్క్లు, అర్బన్ హెల్త్ సెంటర్ వ ంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు చే స్తున్నట్లు చెప్పారు. సీఎం చేస్తున్న స్లమ్ ఫ్రీ సిటీస్కు కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేక మంది కార్మికులు కరీంనగర్కు 30 ఏళ్ల క్రితం వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి వారికి భద్రత కల్పించాలనే కోణంలో సీఎం స్లమ్ ఏరియాలో పక్కా (జీ+1 )ఇంటి నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలాలు కేవలం 30 గజాలు నుంచి 50 గజాల వరకే ఉన్నాయని, వాటిలో రెండు బెడ్రూమ్స్, హాల్, కిచెన్ నిర్మాణాలకు స్థలం సరిపోదని, అందుకే అన్ని ఇళ్ల స్థలాలు మిళితం చేసి ఇంటిని నిర్మాణాలు చేపడతామని అన్నారు. సొంత భ వనంలో ఉండాలన్న కోణంలో ప్రజలు మాట్లాడిన వారి గాడిలో పెట్టేందుకు ఎంపీ స్థానిక, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ను వివరించారు. ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు వివరిస్తే వారికి అర్థమైందని, అసలు మా లీడ ర్లకే అర్థం కావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఛలోక్తులు విసిరారు. మేయర్ రవీందర్సింగ్, కమిషనర్ కేవీ.రమణాచారి, రెవెన్యూ ఆఫీసర్ మక్సూద్ మీర్జా, కార్పొరేటర్లు, నాయకులు శ్రీదేవిశ్రీనివాస్, సునీల్రావు, ఎడ్ల అశోక్, రవీందర్, ఓరుగంటి ఆనంద్ పాల్గొన్నారు. మురికివాడల అభివృద్ధికి కృషి కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ కరీంనగర్ : మురికివాడల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ అన్నారు. నగరంలోని రాజీవ్నగర్, గోదాంగడ్డలోని మురికివాడలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మురికివాడల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని తెలిపారు. గతంలో మురికివాడల్లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేయర్ రవీందర్సింగ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కార్పొరేషన్ కమిషనర్ రమణాచారి, ఆర్డీవో చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, తహశీల్దార్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
వి‘నూతనం’గా..
తెలంగాణ చరిత్రలో 2014ది ప్రత్యేక స్థానమైతే... 2015 సంవత్సరం గ్రేటర్ సిటీకి మరచిపోలేని జ్ఞాపకంగా మిగల్చాలనేది ప్రభుత్వ యోచన. ఆ దిశగా ఒక్కో అడుగూ ముందుకేసి... హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది సంకల్పం. ప్రస్తుతం ఉన్న పథకాలు... కార్యక్రమాలకు... మరికొన్నిటిని చేర్చి...నవశకం నిర్మించాలనేది లక్ష్యం. ఆ అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ⇒ ప్రణాళికతో కొత్త ఏడాదిలోకి.. ⇒విశ్వనగరం దిశగా అడుగులు ⇒ప్రాధాన్య క్రమంలో పనులు ⇒అధికార యంత్రాంగం సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2014వ సంవత్సరానిది ప్రత్యేక స్థానం. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం గ్రేటర్ నగరంలో విభిన్న పథకాలు... వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టాలని భావించింది. అధికార యంత్రాంగమూ ఆ దిశగా సిద్ధమైంది. వాటిలో కొన్నిటికి శ్రీకారం చుట్టగా... మరికొన్ని కార్యరూపం దాల్చాల్సి ఉంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం చెబుతున్నారు.ఇవన్నీ కొత్త సంవత్సరం (2015)లో సాకారమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి... ఆధునిక రహదారులు ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రహదారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నారు. వాహనాలు గమ్యస్థానం చేరే వరకూ ఎక్కడా ఆటంకాలూ లేకుండా చూడాలనేది లక్ష్యం. ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ ఆటంకాలు లేకుండా వీలైనన్ని మార్గాల్లో రహదారులను అభివృద్ధి పరచాలనేది లక్ష్యం. రోడ్లకు ఇరువైపులా వరదనీరు వెళ్లే మార్గాలు...పచ్చదనం... దారి పొడవునా ఎల్ఈడీ వెలుగులు. ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, గ్రేడ్ సెపరేటర్లు... స్పైరల్ మార్గాలు, స్కై వేల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం వెయ్యి కిలోమీటర్లలో నిర్మించాలనేది లక్ష్యం. తొలిదశలో 280 కి.మీ.లు పూర్తి చేయాలని నిర్ణయించారు. నాలాల ఆధునికీకరణ ఎంతో కాలంగా ఊరిస్తున్న నాలాల పనులు ముందుకు సాగేందుకు శ్రద్ధ చూపుతామంటున్నారు. నాలాల ప్రదేశాల్లోని ఆక్రమణల తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాననీరు సాఫీగా వెళ్లేలా చేసేందుకు నిర్ణయం. వంద కిలోమీటర్ల మేర వీటిని ఆధునీకరించాలనేది లక్ష్యం. స్లమ్ ఫ్రీ సిటీ ముఖ్యమంత్రి కలలకు అనుగుణంగా వీలైనన్ని బస్తీల్లో రెండు పడక గదులు, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్ల నిర్మాణం. స్లమ్స్లో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సదుపాయాల కల్పన. స్లమ్స్లోని స్థితిగతులను అంచనా వేసేందుకు కన్సల్టెంట్ సంస్థ బృందాలు ఇప్పటికే సర్వే జరుపుతున్నాయి. ఐడీహెచ్ కాలనీని స్లమ్ఫ్రీగా చేయడంతోపాటు దానిని మోడల్గా చూపుతూ మిగతా వాటినీ అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. చెరువుల పరిరక్షణ చెరువులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల పరిరక్షణ. పచ్చదనం పెంపు కార్యక్రమాలు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు సుందర, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలనేది ప్రాధాన్యాంశాల్లో మరొకటి. హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటడం లక్ష్యం. పేదలకు జీవనోపాధి పేదలకు జీవనోపాధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ. యువ త ఉపాధి కోసం డ్రైవర్కమ్ ఓనర్ పథకం కొనసాగింపు, ఉద్యోగాల కల్పనకు జాబ్మేళాలు, ఈ-వ్యాన్,ఈ-జోన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ. వృద్ధుల ‘ఆసరా’పై ప్రత్యేక శ్రద్ధ. జీహెచ్ఎంసీ అందిస్తున్న ఆసరా కార్డుల ప్రయోజనాల సమీక్షతో పాటు వారికి ఉపయుక్తమైన కార్యక్రమాల అమలుకు కృషి. రూ. 5కే భోజనాన్ని 50 కేంద్రాలకు విస్తరణ 350 మంది నోడల్ అధికారులతో ‘స్పెషల్ డ్రైవ్’ రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 350 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జనవరి 1 నుంచి 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు ఆస్తిపన్ను వసూళ్ల వంటి వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. స్థానిక సంఘాలే కీలకం జీహెచ్ఎంసీలో పాలక మండలి... స్టాండింగ్ కమిటీ లేవు. ప్రజలు తమకు ఏ పనులు కావాలన్నా అధికారులను సంప్రదించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వీలైనంత వరకు స్థానిక సంఘాల ద్వారానే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. అందులో భాగంగా రూ.10 లక్షల లోపు పనులను స్థానిక బస్తీ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తెచ్చి పరిష్కరించేలా ఈ సంఘాలు సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. జలమండలిలో... సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను పూర్తి చేసి... గ్రేటర్ దాహార్తిని తీర్చడమే ఈ ఏడాదిలో జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు. కృష్ణా మూడోదశను 2015 మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి పథకాన్ని జూన్ 2015 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూడో దశ ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని చెప్పారు. ఈ రెండు పథకాలతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని కాలనీల దాహార్తిని తీర్చడమే బోర్డు సిటీజనులకు ఇచ్చే నూతన సంవత్సర కానుకని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం ద్వారా రానున్న నాలుగేళ్లలో మహానగర పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement