-
USA: కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు కారణంగా సియెర్రా నెవడాలోని ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. A snow storm hinders traffic on one of the main roads in California.#snow #Snowfall #snowstorm #California #USA pic.twitter.com/Jc8nam9SO2 — Anil Kumar Verma (@AnilKumarVerma_) March 3, 2024 పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలు తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకుండా పోయింది. మంచు కారణంగా కరెంటు ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను మూసివేశారు. ⏰#Breaking:❄🇺🇸 - It has snowed just a little bit in 📌Truckee ⛳️ California: Snow reports of up to 5 feet around downtown with another 8-14 inches to come by Monday. Semi trucks abandoned and buried on I-80 EB east of Truckee. pic.twitter.com/X5XkxqbYdt — SHORT NEWS (@BuonJose11019) March 3, 2024 ఇదీ చదవండి.. పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి -
కాలిఫోర్నియాకు మంచు తుపాను, వరద ముప్పు
లాస్ఏంజెలెస్: అమెరికాను మంచుతుపాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాను శనివారం మధ్యాహ్నానికి ఎన్నడూ లేనంతటి వరదలు, తీవ్ర మంచు తుపాను చుట్టుముట్టే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాస్ఏంజెలెస్ కొండ ప్రాంతాల్లో 5 అడుగుల మేర మంచు కురియవచ్చని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. మంచు తుపాను ఈ వారమంతా కొనసాగుతుందని పేర్కొంది. ఒరెగాన్ నగరంలో చాలా భాగం అడుగు మేర మంచు కురిసింది. పోర్ట్లాండ్లో అకస్మాత్తుగా కురిసిన మంచుతో ట్రాఫిక్ జామైంది. కరెంటు లైన్లు తెగిపోవడంతో సరఫరా నిలిచింది. స్కూళ్లు మూత బడ్డాయి. 10 లక్షల నివాసాలు, వ్యాపార సంస్థలు చీకట్లో మగ్గాయి. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, విస్కాన్సిన్ల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
అమెరికాలో భీకర మంచు తుపాను (ఫొటోలు)
-
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
స్వగ్రామానికి తెలుగు దంపతుల కుమార్తెలు
సాక్షి, ప్రత్తిపాడు: అమెరికాలో దుర్మరణం చెందిన తెలుగు దంపతుల కుమార్తెలు ఆదివారం స్వగ్రామానికి రానున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లిన దంపతులు సరస్సులో గల్లంతై, మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలు ఒంటరిగా మిగిలిపోయారు. తానాతో పాటు నారాయణ పనిచేస్తున్న టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకుని ఇద్దరు చిన్నారులను భారత్కు తీసుకువస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం చిన్నారులను తీసుకుని టీసీఎస్ ప్రతినిధులు అమెరికాలోని డల్లాస్ నుంచి భారతదేశానికి బయల్దేరారు. ఆదివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి తీసుకువచ్చి నాయనమ్మ వెంకటరత్నం, తాతయ్య సుబ్బారావుకు చిన్నారులను అప్పగిస్తారని బంధువులు చెప్పారు. నారాయణ, హరిత మృతదేహాలు ఇక్కడకు వచ్చేందుకు మరికొద్ది రోజులు పడుతుందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement