-
ఊరటనిచ్చిన వాన
జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు నమోదు ఖరీఫ్ పంటలకు ఉపశమనం ప్రత్యామ్నాయం, పాడి, పట్టు, పండ్లతోటలకు మేలు అనంతపురం అగ్రికల్చర్: వరుణుడు కరుణించాడు. మూడు నెలలుగా మొహం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ప్రభావం చూపించాయి. దీంతో జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షం కురిసింది. అలాగే ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు వర్షపాతం కావడం ఈ ఖరీఫ్లో మొదటి సారి కావడం గమనార్హం. జూన్, జూలైలో దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో ఓ మాదిరి వర్షాలతో ఆశలు రేకెత్తించగా ఇపుడు కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పంటలకు స్వల్పంగా నష్టం జరిగినా...ఈ వర్షం జిల్లాకు చాలా ఊరటనిచ్చిందని రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తమ్మీద జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 236 మి.మీ గానూ 227 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ పంటలకు నష్టం భారీ వర్షాలు కురిసిన మండలాల్లో కొంతవరకు పంట నష్టం వాటిల్లింది. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలో రైతు వెంకటనారాయణకు చెందిన 4 ఎకరాల మిరప తోట నీటమునగడంతో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రొద్దం మండలంలో హంద్రీ–నీవా కాలువ తెగిపోవడంతో సమీపంలో మూడు ఎకరాల కర్భూజా, రెండు ఎకరాల్లో ఆముదం, ఒక ఎకరా మిరప తోట నీటిమునగడంతో రూ.6 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి చెరువుకు గండిపడటంతో సమీపంలో ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇక బెళుగుప్ప మండలం శీరిపిచెరువు, పెనుకొండ మండలం అడదాకులపల్లి చెరువులోకి రెండు మూడు నెలలకు సరిపడా వర్షపు నీరు చేరినట్లు సమాచారం. విడపనకల్లు మండలం గడేకల్లు చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరింది. చాలా మండలాల్లో లోతట్లు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించాయి. చెక్డ్యాంలు, నీటికుంటలు జలకళను సంతరించుకున్నాయి. అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం కనువిందు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంటలకు ఊరట జూన్, జూలైలో అరకొర తేమకు వేసిన వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆగస్టు, ప్రస్తుతం వేస్తున్న పెసర, అలసంద, ఉలవ, జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలకు ఈ వర్షం ఊరటనిచ్చిందంటున్నారు. అంతేకాకుండా ఎండుతున్న లక్షలాది ఎకరాల పండ్లతోటలు, పట్టు (మల్బరీ) తోటలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం 26.50 మీటర్ల మేర భారీగా క్షీణించిన భూగర్భజలాలు అక్కడక్కడ కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మండలం నమోదైన వర్షపాతం (మి.మీ) సోమందేపల్లి 71.6 పెద్దపప్పూరు 69.5 ధర్మవరం 67.1 బత్తలపల్లి 67.2 పెనుకొండ 61.7 తాడిపత్రి 59.1 విడపనకల్లు 58.2 బుక్కపట్నం 47.9 రామగిరి 43.8 అమడగూరు 43.6 పుట్లూరు 42.1 ముదిగుబ్బ 40.3 చెన్నేకొత్తపల్లి 37.7 హిందూపురం 37.3 వజ్రకరూరు 36.2 పెద్దవడుగూరు 36.2 గుంతకల్లు 34.5 డి.హిరేహాళ్ 33.8 గాండ్లపెంట 33.6 కణేకల్లు 32.3 అగళి 32 రొద్దం 31.7 చిలమత్తూరు 30.9 కదిరి 30.5 నల్లమాడ 30.4 తాడిమర్రి 30.3 పరిగి 29.9 ఓడీ చెరువు 28.5 కొత్తచెరువు 26 కనగానపల్లి 25 నార్పల 24.5 ఉరవకొండ 20.9 గుత్తి 20.6 కంబదూరు 18.3 తలుపుల 18 గోరంట్ల 16.9 శింగనమల 16.6 పామిడి 16.2 బొమ్మనహాళ్ 15.4 రొళ్ల 15.2 బెళుగుప్ప 14.9 కూడేరు 14.8 రాప్తాడు 13.8 నల్లచెరువు 13.1 యాడికి 12.8 పుట్టపర్తి 11.8 -
మరణంలోన వీడని బంధం
- రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడి దుర్మరణం - మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం - బైక్పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొన్న ఫలితం మరణంలోన వీడని బంధం నిజమే. దానికి బంధాలు.. అనుబంధాలతో పని లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో కబళిస్తుందో అంతుబట్టదు. ఇప్పుడు అదే జరిగింది. బైక్పై బయలుదేరిన మామా అల్లుడ్ని స్కార్పియో రూపంలో మృత్యువు కబళించింది. ఒకేసారి ఇద్దర్ని బలిగొంది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. - సోమందేపల్లి (పెనుకొండ) హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం బెల్లాలచెరువుకు చెందిన అంజనరాజు(32), అతని మామ రాము(50) దుర్మరణం చెందగా, జానకిరాముడు(30) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురూ కలసి బైక్లో సోమందేపల్లికి బయలుదేరగా తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన స్కార్పియో వాహనం అనంతపురం వైపు వస్తూ బైక్ను వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో బైక్ డివైడర్ను ఢీకొని 20 అడుగుల దూరంలోకి దూసుకెళ్లింది. ఘటనలో అంజనరాజు అక్కడికక్కడే మరణించగా, రామును బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. జానకిరాముడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మామను వదిలొద్దామని బయలుదేరి... సోమందేపల్లికి చెందిన రాము చేనేత కార్మికుడు. తన కుమార్తె శిరీషను ఏడాదిన్నర కిందట అంజనరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పుట్టింటికి వచ్చింది. సొంత పనిపై బెల్లాలచెరువుకు వెళ్లిన రాము అక్కడ పని ముగించుకుని సోమందేపల్లికి బయలుదేరాడు. దీంతో మామను ఇంట్లో వదిలి, తరువాత తన భార్యను పిల్చుకొద్దామని భావించిన అంజనరాజు మామతో పాటు జానకిరాముడుతో కలసి బైక్లో బయలుదేరారు. ఊహించని విధంగా మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో మృత్యువు మామా అల్లుడ్ని మృత్యు ఒడికి చేర్చింది. ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. కాగా అనంతరాజుకు 7 నెలల బాబు ఉన్నాడు. -
ఊపిరాడక.. మృత్యువాత
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి ఇందిరానగర్లో వడ్డే తిప్పన్న(47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి శనివారం మృతి చెందినట్లు అతని సోదరుడు అశోక్ తెలిపారు. ఇంటి నుంచి బయటకు బయలుదేరగా.. ఆరగడుగుల లోతు కలిగిన నీటి గుంతలో కాలుజారి పడిపోయినట్లు వివరించారు. ఆ తరువాత ఊపిరి ఆడక మృతి చెందినట్లు చెప్పారు. -
సోమందేపల్లిలో ఉద్రిక్తత
- చోరీకి యత్నించాడంటూ అదుపులో యువకుడు - పోలీసుల దెబ్బలు తాళలేక మృతి - పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు - న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన - భారీగా మోహరించిన పోలీసులు - పోలీస్ అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం తీశ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సాయినగర్కు చెందిన కిష్టప్ప(28) అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. దొంగతనం నెపంతో పోలీసులు రెండ్రోజులుగా చితకబాదడంతోనే అతను మరణించాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ససేమిరా అన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే... సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఓ ఇంటిలోకి బుధవారం రాత్రి తమ కుమారుడు చోరీకి యత్నించాడంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కిష్టప్ప తల్లిదండ్రులు లక్ష్మమ్మ, అంజినప్ప ఆరోపించారు. రెండ్రోజులుగా పోలీసులు పలుమార్లు చితకబాదారని ఆరోపించారు. ఆ తరువాత గురువారం రాత్రి ఇంటికొచ్చిన అతను నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందంటూ తల్లడిల్లిపోయాడన్నారు. అంతలోనే నోట్లో నుంచి రక్తం వచ్చిందని, ఆ వెంటనే మృతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. విచక్షణారహితంగా కొట్టడంతో వీపు, ఛాతీ భాగాల్లో మూగదెబ్బలు తగిలాయని వాపోయారు. ముమ్మాటికీ పోలీసులే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం పోలీస్స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వారికి గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక, గాయాలు ఉన్నట్లు తేలితే మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి, మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ మధ్యాహ్నం మరోసారి వారు మృతదేహంతో స్టేషన్ ముందు బైటాయించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గ్రహించిన పోలీసులు... పెనుకొండ, రొద్దం పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారంతా కలసి.. దహన సంస్కారాల అనంతరం మాట్లాడుకుందామని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, హిందూపురం వన్టౌన్ సీఐ ఈదుర్బాషా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. కిష్టప్పను పట్టిచ్చిన వ్యక్తులను పట్టుకున్న పోలీసులు ఆందోళనల నేపథ్యంలో.. దొంగతనానికి వచ్చాడంటూ కిష్టప్పను పట్టిచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, వడ్డే వెంకటేష్, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులను నిలదీశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. చోరీకి యత్నించాడన్న ఉద్దేశంతో కిష్టప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేసుకోవచ్చని, అయితే అందుకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే అతను మరణించినట్లు ఆరోపించారు. కిష్టప్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్ ఏమంటున్నారంటే... చోరీకి వచ్చాడన్న ఫిర్యాదు మేరకే కిష్టప్పను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. అయితే ఆ సమయంలో అతను మద్యం తాగి ఉండడంతో వదిలివేశారు. అతన్ని కొట్టలేదు. అనుమానాస్పదస్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేశాం. -
దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..
చిన్నారిని మింగిన సంపు సోమందేపల్లి మండలకేంద్రంలోని మారుతినగర్లో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు రాహుల్(3). సోమవారం సాయంత్రం ఇంటిలో నుంచి ఆడుకునేందుకు చిన్నారి బయటకు వచ్చాడు. అయితే సంపుపై డోర్ వేయకపోవడంతో అటువైపుగా వెళ్లిన చిన్నారి అందులో పడిపోయాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు 15 నిమిషాల తర్వాత కుమారుడు కనిపించలేదని బయటకు వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి సంపులో పరిశీలించగా నీట మునిగిన చిన్నారిని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. అయితే అప్పటికే రాహుల్ ఊపిరాడక చనిపోయాడు. ‘అయ్యోదేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని బలితీసుకుంటివా.. ఎంత పని చేశావయ్యా..ఏ పాపం చేశామని మాకీ శిక్ష వేశావంటూ’ కుమారుడిని ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎస్ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement