-
ప్రత్యేక యంత్రాలతో రసాయనాల స్ప్రే
-
‘ఐ క్లిక్’.. వేధింపులకు చెక్
ఏటీఎం కేంద్రాలే ఫిర్యాదు స్టేషన్లు మహిళా బాధితుల కోసం ప్రత్యేక యంత్రాలు కసరత్తు చేస్తున్న ఏపీ పోలీసు విభాగం చదవురాని వారికి ‘మాటల సందేశం’ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతుల భద్ర త కోసం ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఐ క్లిక్’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పోలీసు కంప్యూటర్, సాంకేతిక సేవల విభాగం దీనికి అవసరమైన కసరత్తు చేస్తోంది. ఆపదలో ఉన్న, వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలోనే ఈ మిషన్ల ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎం సెంటర్లు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీటిలో ఏటీఎం మిషన్లతో పాటు పోలీసులకు సంబంధించిన ‘ఐ క్లిక్’ ఫిర్యాదు యంత్రాలను ఏర్పాటు చేయాలన్నది ఉన్నతాధికారుల యోచన. బాధితులు తమ ఫిర్యాదుల్ని ఈ యంత్రంలో ఉండే ఓ మీటను నొక్కడం ద్వారా నమోదు చేయవచ్చు. ఇవి నేరుగా ‘డయల్-100’ కంట్రోల్రూమ్తో అనుసంధానించి ఉంటాయి. 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఫిర్యాదు సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్, గస్తీ బృందాలకు అందిస్తారు. ఫిర్యాదులోని అంశా లు, దాని తీవ్రత ఆధారంగా స్థానిక పోలీసులు, పెట్రోలింగ్ పార్టీలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. పూర్తిస్థాయి జవాబుదారీతనం, పాదర్శకత కోసం ఈ మిషన్ల ద్వారా ఫిర్యాదు చేసిన వారికి రసీదు కూడా ముద్రితమై వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ తరహాకు చెందిన ఓ మిషన్ను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. అయితే అందులో బాధితులు తమ ఫిర్యాదును టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో నివసించే వారికి ముఖ్యంగా మహిళలకు టైపింగ్పై అవగాహన ఉండదనే నేపథ్యంలో ఇక్కడి మిషన్లలో మీట ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో పాటు బాధితులు, సమాచారం ఇచ్చే వారు మాటల రూపంలోనూ(వాయిస్ మెసేజ్) వాటిని దాఖలు చేసేలా ఏర్పాట్లు చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఆ సంస్థకు సూచించారు. ఏటీఎం కేంద్రాల్లో వీటి ఏర్పాటు, అవసరమైన విద్యుత్, ఆన్లైన్ కనెక్టివిటీ, నిర్వహణ సహకారం తదితర అంశాలపై ఆయా బ్యాంకులతో సంప్రదింపులు జరపాలని పోలీసు విభాగం నిర్ణయించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement