-
ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యామా?
విశాఖపట్నం: చంద్రబాబు కేబినెట్ రావణాసురులతో నిండిపోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నలుగురిలో ఇద్దరు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయాలు ఎగ్గొట్టినా సుజనా చౌదరి కేంద్రంలో, రూ. వందల కోట్లు ఎగ్గొట్టినా గంట శ్రీనివాసరావుకు రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బావబామ్మర్ది గంట, నారాయణ దోచుకున్నారని ఆరోపించారు. వారిద్దరి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయికి విశాఖ అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా లిక్కర్ షాపులు విశాఖలోనే ఉన్నాయని తెలిపారు. బెల్ట్ షాపులు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యామా అని ప్రశ్నించారు. టీడీపీ మంత్రులకు దోపిడీపై ఉన్న శ్రద్ధ విశాఖ రైల్వే జోన్ సాధనపై లేదని విమర్శించారు. ఓటుకు కోటు కేసు నుంచి బటయపడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేపట్టబోతున్న పాదయాత్రకు అందరూ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అల్లాడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం ధ్వజమెత్తారు. -
పరిశీలనలో విశాఖ రైల్వే జోన్
రైల్వే బోర్డు సభ్యులు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.శుక్రవారం తెలుగు మీడియా ప్రతినిధులతో బోర్డు సభ్యులు మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బోర్డు సభ్యులు స్పందిస్తూ.. ‘రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఏపీకి ఏం లాభం? జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఉద్యోగాలు కానీ, ఆదాయం కానీ రాదు కదా? అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. భువనేశ్వర్ – మైసూర్, హౌరా – యత్వంత్పూర్ మధ్య నడిచే అంత్యోదయా రైళ్లకు ఏపీలో పలుచోట్ల హాల్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీకి రాజధాని రైలును ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించగా.. ‘ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కానివ్వండి.. తర్వాత మా రాజధాని రైలును కేటాయిస్తామ’ని సభ్యులు చమత్కరించారు. -
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు
ఏపీ ఇన్చార్జి సిద్ధార్థనాథ్సింగ్ సాక్షి, విశాఖపట్నం: ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేస్తామే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్సింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన బీజేపీ స్టేట్ మీడియా వర్కుషాపు బుధవారం విశాఖలో జరిగింది. అనంతరం సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు.ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, దాన్ని పూడ్చేందుకు కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఏపీకి 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను 10 శాతం వరకు పెంచామన్నారు. ఏపీకి త్వరలో ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు.టీడీపీతో సమన్వయలోపం, కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. గత రెండేళ్లలో ఏపీకి ఎన్నో చేశామనీ ఎంతో సాయం చేశాం..ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2014-15 రెవెన్యూ లోటును తొలుత రూ.14,409 కోట్లుగా పేర్కొన్న రాష్ట్రం ఈ ఏడాది జనవరిలో సమర్సించిన ప్రతిపాదనల్లో 13,776 కోట్లుగా నిర్ధారించి రూ.11,473 కోట్లు సాయం ఇవ్వాలని కోరితే రూ.2,303 కోట్ల సాయం అందించామన్నారు. -
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం'
విశాఖ : రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి విజయం సాధించాం. ఇప్పుడు అదే తరహాలో రైల్వే ప్రత్యేక జోన్ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రైల్వే జోన్ డిమాండ్ కొత్తది కాదని, దశాబ్ధాలుగా ఉందని గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోనూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ చట్టబద్ధ హక్కు కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం విశాఖకు రైల్వే ప్రత్యేక జోన్ ను కేటాయించాలని విజయ్ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. -
రైల్వేజోన్ ఉత్తరాంధ్రుల ఆకాంక్ష
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రౌండ్టేబుల్ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం డాబాగార్డెన్స్ : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. రైల్వేజోన్ సాధనకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావులు, విద్యార్థులను కలుస్తున్నామని, ఇప్పటికే వామపక్షాలు, రైల్వే యూని యన్ నాయకులను కలిసి మద్దతు కోరామని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్ను సోమవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై ఈ నెల 6న వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జిల్లా పరిషత్ జంక్షన్ దరి అంకోసా గెస్ట్హౌస్లో నిర్వహించే రౌండ్టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలకతీతంగా హాజరుకావాలని వాసుపల్లికి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ గత నెల 14న రైల్వే డీఆర్ఎమ్కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఏప్రిల్ 14 లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని లేఖ పంపినా ఇంత వరకూ స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ కోసం ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రికి లేఖ పంపినా స్పందన రాలేదన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బడ్జెట్కు, జోన్కు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి టీడీపీని ఆహ్వానించడానికే వచ్చామని అమర్ స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తే వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. వాసుపల్లిని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయ్కుమార్, కార్యదర్శులు కంపా హానోక్, జాన్వెస్లీ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, బీసీ నాయకుడు ఫక్కి దివాకర్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, పలువురు పార్టీ నాయకులు కలిశారు. ఇచ్చేది... తెచ్చేది మేమే.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇచ్చేది... తెచ్చేది మేమేనని తెలిపారు. రైల్వేజోన్ కోసం మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, వామపక్షాలతో కలిసి ఉద్యమించామన్నారు. వైజాగ్కి జోన్ రాకపోతే రాష్ట్రంలో మరెక్కడా రైల్వే జోనే ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ రైల్వేజోన్ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న రౌండ్టేబుల్ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
Taylor Swift: 14 స్పాట్లలో టాప్లో తొలి ఆర్టిస్ట్గా.. రికార్డుల సునామీ!
ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్గా లాంగ్ ఫ్రాక్స్
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
- ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
Advertisement