-
మెడికల్ సీట్లలో స్కాం
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ధృవీకరణతో స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల స్కాం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో కొందరు మెడికల్ సీట్లు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఎంబీబీఎస్ సీట్ల కోసం స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. -
సోఫీ థామస్ కేసేమైంది?
అనంతపురం క్రైం, న్యూస్లైన్ : ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి. రన్నింగ్, కబడ్డీలో గుర్తింపు పొందిన ఆణిముత్యం. క్రీడాప్రతిభతోనే ఉద్యోగాన్ని కూడా సాధించింది. అయితే.. మృగాళ్ల బారి నుంచి మాత్రం తప్పించుకోలేక పోయింది. వారి ఆకృత్యాలకు బలైపోయింది. ఈ ఘటన జరిగి పదేళ్లయినా.. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పటి పోలీసుల పుణ్యమా అని నిజాలు సమాధి అయినట్లు తెలుస్తోంది. కేరళ నుంచి నర్సింగ్ కోసం మన రాష్ట్రంలో అడుగుపెట్టిన సోఫీ థామస్ గుంతకల్లుకు చేరింది. స్పోర్ట్స్ కోటా కింద రైల్వేశాఖలో బంట్రోతు ఉద్యోగం సంపాదించింది. అవివాహిత కావడంతో ఉద్యోగినులకు కేటాయించిన డార్మెటరీ రైల్వే క్వార్టర్స్లో ఉండేది. ఆమెతో పాటు నలుగురు యువతులు ఆ క్వార్టర్సులోనే ఉండేవారు. ఉదయం లేచింది మొదలు పరుగు, వ్యాయామం, అనంతరం ఉద్యోగం... ఇదీ ఆమె దినచర్య. ఎవరితో పెద్దగా సత్సంబంధాలు కలిగి ఉండేది కాదు. ఓ రోజు ఉదయాన్నే మైదానంలో జాగింగ్కు వెళ్లిన సోఫీని గుంతకల్లు పట్టణానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ దివంగత నేత కుమారుడు టీజ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే ఆమె జీవితంలో మొదటిసారిగా గొడవ పడ్డ సందర్భమని స్నేహితురాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుమించి ఎవరితోనూ విభేదాలు లేవు. ఇదిలా ఉండగా.. ప్రతియేటా లాగానే 2002 డిసెంబర్ 31న రాత్రి డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనతో పాటు క్వార్టర్సులో ఉంటున్న ముగ్గురు స్నేహితురాళ్లలో ఇద్దరు విధులకు, మరొకరు సొంతూరికి వెళ్లడంతో నూతన సంవత్సర వేడుకలకు సోఫీ ఒంటరిగానే హాజరైంది. రాత్రి 11.30 సమయంలో తలనొప్పిగా ఉందంటూ సహచర ఉద్యోగులకు చెప్పి క్వార్టర్సుకు బయలుదేరింది. కాగా.. తెల్లవారుజామున విధులు ముగించుకుని క్వార్టర్సుకు వచ్చిన స్నేహితురాళ్లు తలుపులు తెరిచి చూడగా రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. దీంతో వారు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి డీఎస్పీ మార్కండేయులు, సీఐ పాపారావు, ఎస్ఐ ఆంజనేయులు హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సోఫీ మంచి దేహదారుఢ్యం, ధైర్యసాహసాలు కల్గిన క్రీడాకారిణి. దీంతో ఆమెను హత మార్చడానికి కనీసం ఐదుగురైనా వచ్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోఫీపై దాడి చేసే సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిన ఆనవాళ్లు లభించాయి. హంతకుడు ధరించిన టీషర్ట్ చిరిగిపోయిన ముక్కతో పాటు ఆమె గోళ్లలో హంతకుడి చర్మం కనిపించింది. మెడకు టెలిఫోన్ కేబుల్తో ఉచ్చు బిగించి.. ఛాతీ, పొట్ట కింది భాగంలో బలంగా కొట్టి చంపారు. రంగంలోకి డాగ్స్క్వాడ్ , క్లూస్ టీమ్ను దింపిన పోలీసులు హంతకులను గుర్తించేందుకు ప్రయత్నించారు. డాగ్స్క్వాడ్ శాంతినగర్లోని సోఫీ ఉంటున్న క్వార్టర్సు నుంచి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్లోని ఎస్-2 బోగీ వద్ద ఆగిపోయింది. దీంతో హంతకులు రెలైక్కి పరారై ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎన్నెన్నో అనుమానాలు సోఫీ థామస్ హత్య విషయంలో ఎన్నెన్నో అనుమానాలున్నాయి. ఆమెను డిసెంబర్ 30వ తేదీనే దారుణంగా హత్య చేసినట్లు స్థానికంగా వదంతులు షికార్లు చేశాయి. అయితే.. అప్పట్లో అధికార పార్టీకి చెందిన నేత ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా పోలీసులు, రైల్వేశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు, వైద్యులు మాత్రం డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత సోఫీ హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు (క్రైం నంబర్ 175/02, ఐపీసీ 302 సెక్షన్ ) నమోదైంది. అయితే.. సాక్ష్యాలేమీ లేవని కేసును పక్కనబెట్టారు. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేసినా పురోగతి కనిపించలేదు. హత్యోదంతం ఒకరోజు తర్వాత వెలుగుచూడటంతో అప్పటికే హంతకులు పోలీసులతో చేతులు కలిపి సాక్ష్యాలకు పాతరేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసును ఛే దించేందుకు అప్పటి ఎస్పీ అంజనాసిన్హా ప్రత్యేక టీమ్ని రంగంలోకి దింపినా కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది. అనంతరం ఈ కేసులో అనుమానితులుగా అప్పటి అధికార పార్టీకి చెందిన నేత కుమారుడితో పాటు ఓ కేబుల్ ఆపరేటర్, సోఫీ థామస్ సహచర ఉద్యోగులను పోలీసులు విచారణ చేశారు. అంతకుమించి పురోగతి సాధించలేదు. అట్టుడికిన రెండు రాష్ట్రాలు ఢిల్లీ వీధుల్లో నిర్భయ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలా ఉద్యమాలు జరిగాయో... నాడు గుంతకల్లులో సోఫీ దారుణ హత్య ఘటన కూడా ఆంధ్ర, కేరళ రాష్ట్రాల ప్రజలను కదిలించింది. ఈ కేసులో మృగాళ్లకు శిక్ష పడాలని ప్రస్తుత మంత్రి గీతారెడ్డి కూడా అప్పట్లో పెద్దఎత్తున ఉద్యమాలకు సహకరించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్ సుర్జీత్సింగ్ బర్నాలను గీతారెడ్డి, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, మహిళా సంఘాల నేతలు కలిసి సోఫీ హత్యకేసులో దోషులను శిక్షించాలని విన్నవించారు. -
‘క్రీడా పాలసీని అమలు చేయాలి’
జింఖానా, న్యూస్లైన్: దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచే ప్రభుత్వం క్రీడా పాలసీని అమలు చేయాలని ‘మన పాఠశాలలు, క్రీడా సంస్కృతి’ అనే అంశంపై జరిగిన సెమినార్లో పలువురు ప్రముఖులు సూచించారు. అలాగే క్రీడలను కూడా పాఠ్యాంశంగా చేర్చాలని తెలిపారు. దీంతో పిల్లలు బాల్యం నుంచే క్రీడా సంస్కృతిని అలవరచుకుంటారని చెప్పారు. వివిధ సంస్థల్లో రెండు శాతం ఉద్యోగ నియామకాలను స్పోర్ట్స్ కోటా కింద అమలు చేయాలని వారు సూచించారు. దీని ద్వారా యువత క్రీడల వైపు ఆకర్శితులవుతుందని చెప్పారు. ఈ సెమినార్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పి.ఎన్ రావు ఐఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ క్రీడల మాజీ సలహాదారుదు డాక్టర్ చిన్నప్ప రెడ్డి, స్పోర్ట్స్ కోచింగ్ అసోసియేషన్ కార్యదర్శి, రంజీ మాజీ క్రికె టర్ కె. సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement