-
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్డ్రింక్స్కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
సూక్ష్మసాగులో ‘అనంత’కు అగ్రస్థానం
అనంతపురం అగ్రికల్చర్ : సూక్ష్మ సాగు (డ్రిప్, స్ప్రింక్లర్లు) విస్తరణలో ఈ ఏడాది రాష్ట్రంలోనే అగ్రస్థానం సాధించామని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు (శుక్రవారం) ‘అనంత’ కన్నా చిత్తూరు కాస్త ముందంజలో ఉండగా.. అర్ధరాత్రికి అధిగమించి అగ్రస్థానం చేరామన్నారు. చివరి రోజు ఒక్కరోజే దాదాపు 1,500 హెక్టార్లకు మంజూరు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మంజూరు చేసిన రైతుల పొలాల్లో యూనిట్లు అమర్చే కార్యక్రమం వేగవంతం చేస్తామన్నారు. మొత్తమ్మీద 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27,357 హెక్టార్లకు మంజూరు చేసి టాప్లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (26,781 హెక్టార్లు), వైఎస్సార్ జిల్లా (25,427 హెక్టార్లు), కర్నూలు (14,263 హెక్టార్లు) ఉన్నాయన్నారు. -
సూక్ష్మ సేద్య పరికరాలు సీజ్
– గోదాముపై తూ.కో అధికారుల దాడులు అనంతపురం సెంట్రల్ : వ్యవసాయంలో వినియోగిస్తున్న సూక్ష్మసేద్య పరికరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ సీజ్ చేశారు. బుధవారం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నెటాఫిమ్, ఎంటెల్ కంపెనీలకు చెందిన గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీటిలో తయారిదారుని చిరునామా, ఇతర వివరాలేమి లేకుండా తయారై వచ్చిన వస్తువులను అధిక రేట్లకు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాల్వెంట్ సిమెంట్ ప్యాకెట్లు, ప్రెజర్గేజ్ మీటర్లు, వాల్వ్లు తదితర వాటిని సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. -
యువ కృషీవలురు!
మేడ్చల్: ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన నగర శివారు ప్రాంత రైతులు ప్రస్తుతం సేద్యంపై దృష్టిసారించారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు మండలంలోని రాయిలాపూర్ యువ రైతులు. కూరగాయలు, ఆకుకూరల పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. రాయిలాపూర్లో దాదాపు 200 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగవుతున్నాయి. గ్రామంలోని 100 మంది రైతుల్లో 50 మంది యువకులే ఉండటం.. వ్యవసాయంపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి.. కూలీలపై ఆధారపడకుండా కు టుంబ సభ్యులే ఆకుకూరలను కట్టలుగా తయారు చేస్తున్నారు. కూరగాయలను కోసి గంపల్లో వేసి నగరంలోని వివిధ మార్కెట్లకు తరలిస్తున్నారు. చిన్న రైతులు చిరు వ్యాపారులకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. మరికొంత మంది మేడ్చల్ మార్కెట్కు తరలిస్తున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతేరాజు అని నిరూపిస్తున్నారు. -
సబ్సిడీ సగమే
గుర్రంపోడు :స్ప్రింక్లర్లపై రైతులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం సగానికిసగం కోత విధించింది. గతంలో 90 శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. వాస్తవానికి మూడేళ్లుగా మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల సరఫరా నిలిపివేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్లో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల పంపిణీకి పూనుకుంది. సబ్సిడీ స్ప్రింక్లర్లు పొందేందుకు గతంలో 90 శాతం రాయితీ పోగా, మిగతా పదిశాతం రైతులు చెల్లించేవారు. ఇప్పుడు 50 శాతం రైతులే చెల్లిం చాలి. ఒక్కో స్ప్రింక్లర్ యూనిట్కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19,600. స్ప్రింక్లర్లు తీసుకుంటే డ్రిప్ ఉండదు మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ.లక్ష విలువ గల పరికరాల వరకు రాయితీపై పొందే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు స్ప్రింక్లర్లు, డ్రిప్లలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. స్ప్రింక్లర్లు పొందే రైతులకు సుమారు 10 వేల రూపాయల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుండగా, భవిష్యత్లో పదేళ్ల వరకు డ్రిప్ పొందే అవకాశం కోల్పోతాడు. స్ప్రింక్లర్లు తీసుకున్న రైతుకు మిగతా 90 వేల విలువకు కూడా రాయితీపై డ్రిప్ పరికరాలు పొందే అవకాశం కూడా లేదు. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల స్ప్రింక్లర్ల పరికరాలకు డిమాండ్ ఉన్నా, డ్రిప్ అవకాశం కోల్పోతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నిబంధనలు సడలించి రైతుకు గరిష్టంగా నిర్ణయించిన రాయితీ పరిమితికి లోబడి స్ప్రింక్లర్లు, డ్రిప్ రెండింటిని పొందే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు మైక్రోఇరిగేషన్ అధికారులు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించారు. 24 మంది ఎంఐఓలు, ఉద్యాన వనశాఖలోని 8 మంది అధికారులు, వ్యవసాయశాఖలో 27 మంది అధికారులను ఆయా మండలాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఈ నెల 25వ తేదీ వరకు వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందేందుకు సంబంధింత ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎంఐపీ ఏపీడీ పి.యాదగిరి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement