-
స్వామివారిని దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
-
చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న విశాఖ శారదా పీఠాధిపతి
-
లోక కల్యాణం కోసమే మహాకుంభాభిషేకం
పెందుర్తి : లోక కల్యాణం కోసం నిరంతరం విశాఖ శ్రీశారదాపీఠం పాటుపడుతోందని, అందులో భాగంగా పీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చెప్పారు. దేశం, రాష్ట్రానికి అమ్మవారి కరుణ, కటాక్షం ఉండాలన్నది పీఠం ఆకాంక్ష అన్నారు. పీఠం వార్షిక వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం అష్టబంధన మహాకుంభాభిషేకం వేడుకగా నిర్వహించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని ప్రకృతీష్టి జరిపామని వెల్లడించారు. పీఠం గుంటూరు జిల్లా కన్వీనర్, విరంచి ఫ్యాషన్స్ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, మృదుల దంపతులు కిలో స్వర్ణ కిరీటాన్ని స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు. కళాతపస్వి ఐ.వి.ఎన్ శాస్త్రిని సంగీత శాస్త్ర విశారద బిరుదుతో స్వామీజీ సత్కరించారు. -
14న అష్టబంధన మహాకుంభాభిషేకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ క్షేమం కోరుతూ విశాఖ శ్రీశారదాపీఠంలో ఈ నెల 14న అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు పీఠం వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో గురువారం స్వామీజీ మాట్లాడుతూ... శారదాపీఠం లో సుధా దేవాలయం(రాజశ్యామల అమ్మవారి దేవాలయం) పునఃప్రతిష్ఠలో భాగంగా శిలా దేవాలయాన్ని నిర్మించామని, ఈ నెల 10న దేశం నలుమూలల నుంచి వచ్చే పండితుల చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనతో పాటు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయని వెల్లడించారు. తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం ప్రారంభం, వాల్మికీ రామాయణం, దేవీ భాగవత పారాయణాలు, మేధా దక్షిణామూర్తికి పంచామృతాభిషేకా లు, రుగ్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృ తిక కార్యక్రమాలు, రెండో రోజు దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం, నీరాజన మంత్రపుష్పం, కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలం గాణ సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని స్వామీజీ చెప్పారు. సమావేశంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో వంద అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం
♦ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడి ♦ వేంకటేశ్వరస్వామికి సువర్ణ వక్ష స్థలం బహూకరణ సాక్షి, గుంటూరు: నూతన రాజధాని అమరావతిలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వంద అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సంకల్పించామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. అద్వైత స్థాపనతో హిందూ జాతిని ఏకతాటిపైకి తెచ్చి జాగృతపరిచిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు అని కొనియాడారు. ఆదివారం గుంటూరులోని బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామివారికి మర్రెడ్డి రామకృష్ణా రెడ్డి, మృదుల దంపతులు శ్రీవత్స చిహ్నాంకిత రత్న ఖచ్చిత సువర్ణ వక్షస్థలాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం విశేష పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి చేతుల మీదుగా సువర్ణ వక్షస్థలాన్ని దేవస్థానానికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన పుణ్యవా చన, అజసహస్ర దీపారాధన, రక్షా సూత్రదా రణ, నవగ్రహారాధన, అష్టదిక్పాలక పూజ, వాస్తు మండపారాధన, వాస్తు పర్యాగ్నికర ణ, మహాసుదర్శన హోమం, మçహాసంప్రోక్ష ణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంత రం ఆదిశంకరాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని ఆదిశంకరాచార్య ఆరాధన నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. అనంతరం అన్నదాన ప్రసాదం నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement