-
ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు!
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది. 18 వేల మంది సిబ్బంది అవసరం.. ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్లు ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
అభాగ్యులకు ఆపన్నహస్తం
కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయనను పలువురు కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో సీఎం చలించిపోయారు. తక్షణ సాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజనకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఆరుగురు బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలాగే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన బాధితుల వివరాలు ♦ కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యు.అశోక్ ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ♦ గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన కురువ రాజు కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ♦ ఎమ్మిగనూరుకు చెందిన షేక్ రేష్మకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా రెండు కళ్లు కోల్పోయింది. ♦ ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్ కుడి కాలు ఆపరేషన్ చేయించుకుని ఆరి్థకంగా చితికిపోయారు. ♦ గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి ఆరేళ్లుగా కిడ్నీ, యూరిన్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నారు. ♦ ఎమ్మిగనూరుకు చెందిన గొల్ల లక్ష్మన్న కుమార్తె శ్రావణి మానసిక జబ్బుతో బాధపడుతోంది. -
Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’
కర్నూలు(సెంట్రల్) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదువుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని కోరడంతో కలెక్టర్ డాక్టర్ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్లో ఇంటర్ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది. అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్ డాక్టర్ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మాట్లాడి.. నిర్మలను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది. -
మర్డర్ మిస్టరీ
అరుణ్, సృజన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో ‘వేటాడతా’ చిత్రం తెరకెక్కుతోంది. ఎమ్.అంకయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. వైజాగ్ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయివెంకట్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్ అందించగా, నిర్మాత రామ సత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీగా ‘వేటాడతా’ చిత్రం రూపొందుతోంది. ఈ నెలాఖరులో షూటింగ్ను స్టార్ట్ చేస్తాం. అరకు, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు అంకయ్య. ‘‘మా నాన్న(అంకయ్య) సిద్ధం చేసిన కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్. ఈ సినిమాకు సహ–నిర్మాత: డి.శివ ప్రసాద్, సంగీతం: శేఖర్ మోపూరి. -
కర్నూలు మొదటి మహిళా జిల్లా కలెక్టర్గా డాక్టర్ సృజన (ఫోటోలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement