-
డిగ్రీకి ధరఖాస్తులు
బారులు తీరిన విద్యార్థులు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ప్రైవేట్’ గుడ్ విల్ను సొమ్ము చేసుకుంటున్న వైనం వచ్చే వారం టెన్త ఫలితాలు ఇక పీయూ కళాశాలల వద్ద జాత రే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పీయూసీ ఫలితాలు వెలువడడంతో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు దరఖాస్తుల వేటలో పడ్డారు. ప్రతిష్టాత్మక కాలేజీల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నగరంలో సెయింట్ జోసెఫ్, మౌంట్ కార్మెల్, శేషాద్రిపురం, నేషనల్ కాలేజీ, ఎంఈఎస్ తదితర కళాశాలల్లో దరఖాస్తులను తీసుకోవడానికి అభ్యర్థులు చాంతాడంత క్యూల్లో నిల్చుకోవాల్సి వస్తోంది. మరో వైపు ప్రవేశ దరఖాస్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల రూ.వంద చొప్పున వసూలు చేస్తుండగా, మిగిలిన చోట్ల అంతకంటే ఎక్కువగానే ఉంది. అయితే తాము కోరుకున్న కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తు ధర ఎంతైనా వెనకడుగు వేయడం లేదు. ప్రవేశ దరఖాస్తుల ధరను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రైవేట్ కళాశాలలు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఉత్సాహవంతులైన విద్యార్థులు దరఖాస్తులను తీసుకుని అక్కడికక్కడే భర్తీ చేసి సమర్పిస్తున్నారు. వచ్చే వారం ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం దరఖాస్తుల కోసం విద్యార్థుల రద్దీతో పీయూ కళాశాలలు జాతరను తలపించనున్నాయి. -
అమెరికా బ్యాంకులో ఉన్మాది వీరంగం.. కాల్చివేత
అమెరికాలోని ఓ బ్యాంకులో కొందరిని బందీలుగా చేసుకున్న ఓ ఉన్మాదిని పోలీసులు కాల్చిచంపారు. సెయింట్ జోసెఫ్లోని టెన్సాస్ స్టేట్ బ్యాంక్ శాఖలో ఈ ఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో(స్థానిక కాలమానం ప్రకారం) యెమన్ జాతీయుడైన ఫయాద్ అబ్దో అహ్మద్ అనే యువకుడు ముగ్గురిని బందీలుగా చేసుకున్నాడని లూసియానా స్టేట్ పోలీస్ సూపరింటెండెంట్ మైక్ ఎడ్మన్సన్ తెలిపారు. ‘అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అహ్మద్కు మనుషులను బాధించడమంటే ఇష్టం. దీనికి సంబంధించి రాసుకున్న కొన్ని నోట్స్ అతడి అపార్ట్మెంట్లో లభ్యమయ్యాయి. బ్యాంకు దోపిడీ ఉద్దేశం లేదు. కావాలనే పథకం ప్రకారమే దాడి చేశాడు. పిచ్చిపిచ్చి డిమాండ్లు పెట్టాడు. తన బుర్రలో ఏదో పరికరం ఉందని.. దాన్ని తొలగించాలని కోరాడు. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిని బందీలుగా చేసుకున్నాడు. అందులో ఓ మహిళను విడిచిపెట్టాడు. అర్ధరాత్రి దాటేదాకా ఈ డ్రామా కొనసాగింది. మిగిలిన ఇద్దరినీ చంపేస్తానని బెదిరించడంతో మేం వెంటనే భవనంలోకి దూసుకెళ్లాం. దీంతో అతడు బందీలపై కాల్పులు జరిపాడు. మేం అహ్మద్ను మట్టుపెట్టాం’ అని వివరించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement