-
ఎట్టకేలకు విదిల్చారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా విభాగం 2014-15 వార్షిక సంవత్సరానికిగాను రూ.192.69కోట్ల వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ప్రణాళికను ఆమోదించినప్పటికీ.. ఒకసారి రూ.3కోట్లు విడుదలచేసి చేతులు దులుపుకుంది. దీంతో అందుబాటులో ఉన్న నిధులను ఖర్చుచేసిన అధికారులు.. నిధులు నిండుకోవడంతో పలు కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వాస్తవానికి వార్షిక ప్రణాళికలో రూ.192.69కోట్లు పేర్కొనగా.. ఇందులో సిబ్బంది వేతనాల కోసం రూ.80.55కోట్లు, విద్యార్థుల యూనిఫాం, పుస్తకాల కోసం రూ.11కోట్లు, పాఠశాల, టీచర్ల గ్రాంట్ల కోసం రూ.10కోట్లు, మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు కేటాయించారు. ప్రణాళికలో అన్ని ప్రాధాన్యత అంశాలే అయినప్పటికీ.. నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో తాజాగా రూ.16.10కోట్లు విడుదల కావడంతో అధికారులకు పనికల్పించినట్లైంది. వచ్చింది పదిశాతమే.. వార్షిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిదినెలలు గడిచింది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్లో మూప్పావువంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పలుకార్యక్రమాలు అటకెక్కాయి. ఎస్ఎస్ఏకు రెండునెలల క్రితం రూ.3 కోట్లు విడుదల చేసిన సర్కారు.. తాజాగా రూ.16.10 కోట్లు ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు రూ.19.10 కోట్లు విడుదలయ్యాయి. అంటే వార్షిక ప్రణాళికలో కేవలం పదిశాతం మాత్రమే నిధులు వచ్చాయి. మార్చిలోగా ప్రణాళిక ప్రకారం నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. చివరి నిమిషంలో వచ్చిన నిధులను ఖర్చుచేసే అంశంపైనా సందేహాలు లేకపోలేదు. వారంలోగా బడుల ఖాతాల్లోకి.. తాజాగా వచ్చిన నిధుల్లో పాఠశాల నిర్వహణ నిధుల, ఇతర గ్రాంట్లు కలిపి రూ.3.15 కోట్లు విడుదలయ్యాయి. వీటిని పాఠశాలల ఖాతాల్లోకి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారం రోజుల్లో పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయనున్నట్లు సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి కిషన్రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
అభివృద్ధికి ‘ప్రత్యేక’ బ్రేక్
సాక్షి, రాజమండ్రి / న్యూస్లైన్, మండపేట :ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 74 రోజుల పాటు అమలైన ఎన్నికల కోడ్కు తెరపడింది. ప్రజాపాలన వచ్చినా.. ప్రమాణ స్వీకారాలు పూర్తవ్వకపోవడంతో స్థానిక సంస్థల్లో ఇంకా ప్రత్యేక పాలనే కొనసాగుతోంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరేందుకు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా పరి పాలన సాగించాల్సిన ప్రత్యేకాధికారుల్లో చాలా మంది సంతకాలకు ‘నో’ చెబుతుండడం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో మా ర్చి మూడో తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అవి పూర్తయ్యే నాటికి పరిషత్ ఎన్నికల రాక తో కోడ్ కొనసాగింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లాలో ఎన్నికలు జరిగాయి. అవి పూర్తయిన వెంటనే ఏప్రిల్ 12 నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా, 16న ఓట్ల లెక్కింపుతో కోడ్ ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. దాదాపు 74 రోజుల పాటు సా గిన ఎన్నికల కోడ్కు తెరపడడంతో అభివృద్ధి కార్యక్రమా లు ఇక జోరందుకుంటాయనుకుంటున్న తరుణంలో ‘ప్రత్యేక’ రూపంలో వాటికి బ్రేక్ పడుతోంది. విభజనాం తరం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందు కు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్, మండల, జెడ్పీ పాలక వర్గాలు ప్రమాణ స్వీ కారం చేయాల్సి ఉంది. నాటి వరకు ప్రత్యేక పాలనలోనే ఆయా సంస్థలు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధుల ఎన్నిక పూర్తవ్వడంతో, ఈ గొడవ తమకెందుకన్న ఆలోచనలో ప్రత్యేకాధికారులున్నట్టు సమాచారం. కొత్త తీర్మానాలపై సంతకాలు చేసేందుకూ వెనుకాడుతుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఆగిపోయిన వర్క్ ఆర్డర్లు జిల్లాలోని నగరపాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల పరిషతుల్లో అనేక అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల కోడ్ రాకతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. కోడ్ పూర్తవ్వడం, త్వరలో కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా పనులపై వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు అనేక మంది ప్రత్యేకాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. పనులు పూర్తి చేయాలని కొత్త ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండగా, ప్రత్యేకాధికారుల సంతకాలు చేయకపోవడంతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేక చాలామంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీలు, మండల పరిషతుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యేక అధికారులు సెలవులపై వెళ్లిపోవడంతో పనులు ఎలా పూర్తిచేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం స్పందించి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేంత వరకు పరిస్థితి చక్కబడేలా పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త పాలక మండళ్లు కొలువు తీరాకే.. ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకూ ఎన్నికల నిర్వహణ ఖర్చులు, పారిశుధ్యం, నీటి నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇతర కార్యాలయ సంబంధ ఫైళ్లు మినహా మిగిలిన వాటికి చలనం లేదు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులపై మాత్రం కొత్త కౌన్సిళ్లు కొలువు తీరేలోగా ఆమోదం తెలిపేందుకు ఒకరిద్దరు కమిషనర్లు దృష్టి పెట్టినట్టు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement