-
ఇన్వెస్ట్మెంట్.. మనోళ్లకు మహా ఇష్టం!
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్ చార్టర్డ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది అభిప్రాయాలను సేకరించింది. పొదుపు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు తగినంత ఆదాయం కలిగి సంపన్న వినియోగదారులుగా అవతరిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మనదేశంలో ఎక్కువ మంది సంపన్న కస్టమర్లు నమ్మే విషయం... సంపద నిర్వహణ సమర్థంగా నిర్వహించడం అన్నది గొప్ప సామాజిక చైతన్యానికి ప్రతీక అని. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ... ♦ మన దేశంలో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు. ఈ సర్వేలో ఇదే గరిష్ట స్కోరు. ♦ 31 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకుంటుంటే, 25 శాతం మంది ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలను, 22 శాతం ఈక్విటీలను ఎంచుకుంటున్నారు. కానీ, భారత్ వెలుపల సర్వే జరిగిన ఇతర మార్కెట్లలో ఈ సాధనాలను ఎంచుకునే వారు 16 శాతం, 19 శాతం, 18 శాతంగానే ఉన్నారు. ♦ 44 శాతం మంది కెరీర్లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు. మరో 25 శాతం మంది అయితే వ్యాపారం ఆరంభించాలని, సంపద వృద్ధికి ఇదే చక్కని మార్గమని భావిస్తున్నారు. ♦ ఇక మనదేశంలో సంపన్న వినియోగ వర్గంగా అవతరించే వారిలో 79 శాతం మంది సమర్థవంతమైన సంపద నిర్వహణ సామాజిక చైతన్యానికి కీలకమని భావిస్తుండడం గమనార్హం. ♦ అధిక సామాజిక చైతన్యం కలిగిన మార్కెట్గా భారత్ నిలిచింది. చైనా, భారత్ దేశాల్లో మూడింట రెండొంతులు (67%) మంది సామాజిక చైతన్యం పెరుగుదలను అనుభవిస్తున్నారు. ♦ తమ పిల్లల చదువుల కోసం పొదపు చేయడం వీరి కీలక లక్ష్యంగా ఉంది. మన దేశంలో 17 శాతం మంది దీన్నే తెలియజేశారు. అంతేకాదు ఇతర మార్కెట్లలోనూ ఇదే అగ్ర ప్రాధాన్యమని 16 శాతం మేర చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ♦ మన దేశంలో ఎక్కువ మందికి ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ... తక్కువ ఆర్థిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న అన్ని సాధనాల గురించి తెలియకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్టు స్టాండర్డ్ చార్డర్ట్ బ్యాంకు, రిటైల్ బ్యాంకింగ్ భారత విభాగం హెడ్ శ్యామల్ సక్సేనా తెలిపారు. డిజిటల్ ఉపకరణాలు వారి లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని చెప్పారు. సామాజిక చైనత్యం మన దేశంలో సామాజిక చైనత్యం ఫరిడవిల్లుతోంది. ఆదాయాల్లో చక్కని వృద్ధి ఇందుకు తోడ్పడుతోంది. 46% మందికి గత ఏడాదిలో 10% వేతనం పెరగ్గా, 30 శాతం మందికి గత ఐదేళ్ల కాలంలో 50 శాతం అంతకంటే ఎక్కువే వేతనం వృద్ధి చెందింది. 78% మంది డిజిటల్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. వారి విజయానికి ఇవే కీలకమని భావిస్తున్నారు. 80 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్కు ఓటేయగా, డిజిటల్ నగదు నిర్వహణ అన్నది ఆర్థిక లక్ష్యాల సాధనకు తమను దగ్గర చేశాయని తెలిపారు. -
10 శాతం ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
బ్రిటీష్ బహుళ జాతీయ బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ స్టాండర్డ్ చార్టడ్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోబోతుందట.. తన గ్లోబల్ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయాలని బ్యాంకు నిర్ఘయించినట్టు సంబంధిత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వ్యయాలను తగ్గించుకోవడానికి బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగులపై కోత విధించినున్నట్టు తెలిపాయి. ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ ఈ వారం మొదటి నుంచే సింగపూర్, హాంగ్కాంగ్ వంటి అన్ని మేజర్ బ్యాంకింగ్ సెంటర్లలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే తమ కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ డివిజన్ను మరింత సమర్థవంతంగా తయారుచేస్తామని స్టాండర్డ్ చార్టడ్ అధికార ప్రతినిధి చెప్పారు. వృథాగా ఉన్న ఉద్యోగాలను తీసివేసి, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ఈ చర్యలతో బ్యాంకు వ్యయాలను తగ్గించుకోనున్నట్టు తెలిపారు. కొన్ని ఉద్యోగాలపైనే ఈ ప్రభావం పడుతుందని ప్రకటించిన ఆయన ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారో తెలుపలేదు. ఈ బ్యాంకులో జూన్ ముగింపుకు మొత్తం 84,477 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగ, ఈ బ్యాంకు అంచనావేసిన దానికంటే తక్కువగా మూడో త్రైమాసిక ఫలితాలను నమోదుచేసింది. బ్యాంకు రాబడి, లాభాలు ఆశించదగ్గ స్థాయిలో లేవని ప్రకటించిన ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ వింటర్స్, సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉద్ఘాటించారు. -
ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయ్...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం రెండు ప్రముఖ సంస్థలు- ఐక్యరాజ్యసమితి, ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి పేర్కొంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంకన్నా, చేసే వ్యయం అధికంగా ఉండే పరిస్థితిని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. తక్కువ వృద్ధిరేటు, సబ్సిడీల భారం తీవ్రంగా ఉండడం, పన్నుల ఆదాయం తగ్గే అవకాశాలు వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని ఐక్యరాజ్యసమితిని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2014’ పేరుతో రూపొందించిన నివేదికలో సమితి ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.9 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటుందని, 2014-15లో ఇది 5.3 శాతానికి పెరగవచ్చని కూడా తెలిపింది. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతులు రానున్న నెలల్లో పెరగవచ్చని వివరించింది. ఇండియా రేటింగ్స్ ఇలా..: కాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత మౌలిక రంగం ఔట్లుక్ను ‘ప్రతికూలత’ గ్రేడింగ్లో ఉంచుతున్నట్లు ఫిచ్ గ్రూప్ కంపెనీ ఇండియా రేటింగ్స్ గురువారం పేర్కొంది. పలు కంపెనీల ప్రాజెక్టులకు బలహీన రుణ పరిస్థితులు దీనికి కారణమని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement