-
త్వరలో నియోజకవర్గాల యాత్ర
సాక్షి, మెదక్: ‘‘ఎవరేమన్నా అనుకోనీ... కొద్దిరోజుల్లో నేను నియోజకవర్గాల యాత్ర చేస్తున్నా. నియోజకవర్గాల్లో రెండేసి రోజులు పర్యటిస్తా.. ప్రజలతోనే ఉంటా’’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. నియోజకవర్గ పర్యటనల్లో భాగంగా త్వరలో గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. తూప్రాన్లో ఒక రోజంతా ఉండి పట్టణ అభివృద్ధిపై చర్చిస్తానన్నారు. అందరితో కలసి భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ తూప్రాన్లో రూ.11 కోట్లతో నిర్మించి న 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రి లోపలకు వెళ్లి అంతా కలియదిరిగి చూశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారంతా పేదలేనని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమైతే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తాను దేశ సేవలో ఉండటం వల్లే తూప్రాన్ వచ్చేందుకు ఆలస్యమైనట్లు తెలిపారు. తూప్రాన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్థానిక నేతలు తనకు తెలియజేస్తున్నట్లు వివరించారు. తూప్రాన్లో 50 పడకల ఆస్పత్రి ప్రారంభించడం ఎంతో అనందంగా ఉందన్నారు. తూప్రాన్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూప్రాన్ పట్టణంలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ హాల్కు రూ. కోటి నిధులతోపాటు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కేసీఆర్ తూప్రాన్ పర్యటనకు గంట ఆలస్యంగా వచ్చారు. హైదరాబాద్ నుంచి 11.30 గంటలకు తూప్రాన్ చేరుకోవాల్సి ఉండగా 12.30 గంటలకు చేరుకున్నారు. సీఎం రాక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వేదపండితులు ముహూర్తం దాటిపోతుందని ఆస్పత్రి లోపల, వెలుపల గుమ్మడికాయ, టెంకాయలు కొట్టారు. సీఎం వచ్చాక ఆస్పత్రి ప్రారంభించడంతోపాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఎంఆర్పీఎస్, టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రామలింగారెడ్డి, మదన్రెడ్డి, భూపాల్రెడ్డి, వేముల ప్రశాంత్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పల్లా రాజేశ్వర్రెడ్డి, భూపాల్రెడ్డి, రాష్ట్ర రోడ్డు రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తూముకుంట నర్సారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, కలెక్టర్లు వెంకట రాంరెడ్డి, మాణిక్కరాజ్ కణ్ణన్, గడా ఓఎస్డీ హన్మంతరావు, ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో పనుల పరిశీలన సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ బుధవారం పరిశీలించారు. మెదక్ జిల్లా పర్యటన ముగించుకొని గజ్వేల్ చేరుకున్న సీఎం ముం దుగా అధునాతన హంగులతో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణాలను చూశారు. మార్కెట్ భవన నిర్మాణాలు, రైతులకు ఉపయోగాలు మొదలైన అంశాలతో ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని చూసి అక్కడి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే మండల కేంద్రం మర్కూక్లో ఏర్పాటు చేసిన గ్రామసభకు వెళ్లాల్సి ఉన్నా అర్ధంతరంగా పర్యటనను వాయిదా వేసుకొని ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్కు వెళ్లి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. గజ్వేల్లో ఎంఆర్పీఎస్ నాయకులు సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. మర్కూక్ గ్రామ సభలోనూ వారు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొనడం వల్లే సీఎం గ్రామసభ వాయిదా పడినట్లు సమాచారం. సీఎం వెంట వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్రెడ్డి, ఎంపీ ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు. నేతి విద్యాసాగర్ మాతృమూర్తికి సీఎం నివాళి నకిరేకల్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాతృమూర్తి దివంగత రాధమ్మకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ముందుగా నేతి రాధమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేతి విద్యాసాగర్, కుటుంబీకులను పరామర్శించారు. 20 నిమిషాలపాటు విద్యాసాగర్ ఇంట్లోనే గడిపారు. అక్కడే అల్పాహారం స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా మళ్లీ హైదరాబాద్కు పయనమయ్యారు. తూప్రాన్లో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించి వైద్య పరికరాలను పరిశీలిస్తున్న కేసీఆర్ -
రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
* చిత్తూరులో ఆస్పత్రి ప్రారంభం * పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ * అధికారికంగా విడుదల కాని టూర్ షెడ్యూల్ చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ విడుదల కాకపోయినా జిల్లా యంత్రాంగం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ సిద్దార్థజైన్, ట్రైనీ కలెక్టర్ శ్రుతి ఓజా, జెడ్పీ సీఈవో వేణుగోపాల్రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనపై టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్లో మురకంబట్టులోని సీతమ్స్ కళాశాల వద్దకు చేరుకుంటారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన టాయ్లెట్లు ప్రారంభిస్తారు. అనంతరం హై రోడ్డు మీదుగా పీసీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఓవర్ బ్రిడ్జి నుంచి ఠాణా వరకు ఉన్న రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కొంగారెడ్డిపల్లె కూరగాయల మార్కెట్ వద్ద మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చిత్తూరులో రూ 5.కోట్లతో నిర్మించనున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, రూ.2 కోట్లతో నిర్మించనున్న సహకార భవనం, బీసీల భవనం, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ సెమినార్ భవ నాలకు శంకుస్థాపనలు చేస్తారు. బహిరంగ సమావేశం అనంతరం మెసానికల్ మైదానానికి చేరుకుని హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. అధికారులతో జేసీ సమావేశం చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జేసీ భరత్గుప్త మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన విధులను వివిధ శాఖలకు కేటాయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
టంపాబేలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024)
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
కేజ్రీవాల్కు బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement