-
రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.59,831 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.59,831 కోట్ల రుణం అవసరమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. మంగళవారం హైదరాబాద్ తాజ్కృష్ణ హోటల్లో జరిగిన రాష్ట్ర రుణ సదస్సులో రుణ ప్రణాళిక అంచనాలను నాబార్డు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 20 శాతం ఎక్కువ. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.43,444.35 కోట్లు కేటాయించారు. వాటిలో పంట రుణాలకు రూ.30,435.09 కోట్లు, టర్మ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,009.26 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రుణాలకు రూ.8,464.58 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,922.21 కోట్లని అంచనా వేశారు. రుణ ప్రణాళికను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ప్రణాళిక వివరాలను నాబార్డు సీజీఎం వి.వి.వి.సత్యనారాయణ వెల్లడించారు. పెట్టుబడి రుణాలలో చిన్న నీటిపారుదలకు రూ.621 కోట్లు, వ్యవసాయ క్షేత్రాల యాంత్రీకరణకు రూ.1858 కోట్లు, పొడి, శీతల గిడ్డంగులకు రూ.775 కోట్లు, పట్టు పురుగుల పెంపకం, పూల తోటలు, గ్రీన్హౌస్ స్థాపన సహా ఉద్యానవనాలకు రూ.924 కోట్లు కేటాయించామన్నారు. ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ. 2 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేసిందన్నారు. రుణమాఫీలో బ్యాంకుల సహకారం అంతంతే రాష్ట్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్ల రైతు రుణ మాఫీ ప్రకటిస్తే బ్యాంకులు సహకారం అందించలేదని ఈటల ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలంటూ అడ్డంకులు సృష్టించారన్నారు. వచ్చే ఏడాది, ఆపై ఏడాది ప్రభుత్వం బదనాం కాకుండా రుణమాఫీకి సహకారం అందించాలని బ్యాంకులను కోరారు. పేదలకు రుణాలిచ్చాక, వారు చెల్లించకుంటే ప్రభుత్వ తరఫున సాయం చేస్తామన్నారు. ‘‘ఎన్ని ప్రణాళికలున్నా, హైటెక్ యుగమంటున్నా ఇప్పటికీ 65 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. 60 శాతం వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారు. అంతరాలు మారలేదు.పేదరికం పోలేదు’’ అన్నారు. తెల్ల కార్డులు, ఆరోగ్యశ్రీలు అంతం కావాలంటే ప్రజలు తమ కాళ్లపై నిలబడాలన్నారు. బ్యాంకులు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రుణాలెంతో, ప్రజలకు ఇస్తున్నదెంతో ఆలోచించుకోవాలన్నారు. ‘‘రైతులను పరిగణనలోకి తీసుకోకుంటే వృథా. రైతు విషయంలో వడ్డీలను లెక్కిస్తే వారికి సమాజమే బాకీ పడుతుంది’’ అన్నారు. రుణమాఫీ అర్హులకే అందేలా చూస్తున్నామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర చెప్పారు. రుణ సదస్సులో ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకులు ఆర్ఎన్ దాస్, ఆంధ్రబ్యాంకు ఎండీ సురేశ్ ఎన్ పటేల్ పాల్గొన్నారు. ఈటల వ్యాఖ్యలపై గందరగోళం ‘వచ్చే ఏడాది, ఆపై ఏడాది ప్రభుత్వం బదనాం కాకుండా రుణమాఫీకి సహకారం అందించండి’ అన్న ఈటల వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రెండేళ్లు రెండుసార్లు రుణమాఫీకి బ్యాంకు లు సహకరించాలని ఈటల అనడంపై మీడియా ప్రశ్నించగా తన ఉద్దేశం అది కాదన్నారు. ‘ఒకేసారి రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించడమంటే చిన్న విషయం కాదు. అయినా ఒకసారి ఇచ్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం’ అని వివరించారు. -
కేంద్ర రుణాల్లో రాష్ట్రం కోత!
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్నట్టు ఉంది రాష్ర్ట ప్రభుత్వ వ్యవహారం... రైతులకు వ్యవసాయ రుణాల కింద రూ.38 వేల కోట్లు ఇస్తామంటూ కేంద్రం ప్రకటిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏడు వేల కోట్లు తక్కువగా రూ.30,995 వేల కోట్లతో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేసింది. పైగా ఇది గతేడాది కంటే రూ.3,771 కోట్లు ఎక్కువంటూ గొప్పలకు పోయింది. కేంద్ర అధికారుల చీవాట్ల తో చివరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ. 30,995 కోట్లు కేటాయిస్తూ మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశం లో నిర్ణయించారు. దానిని ప్రభుత్వం కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన వ్యవసాయ రుణలక్ష్యాల్లో తెలంగాణకు రూ.38 వేల కోట్లుగా పేర్కొంది. ఇది రాష్ర్టం నిర్దేశించుకున్న వ్యవసాయ రుణప్రణాళికకు రూ.7వేల కోట్లు తక్కువ. దీనిపై కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. నాబార్డు సూచనలు తుంగలో తొక్కిన కలెక్టర్లు... ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయ పంట, టర్మ్, అనుబంధ రంగాల రుణాలు ఏ మేరకు ఉండాలనే దానిపై నాబార్డు కొన్ని ప్రతిపాదనలు తయారుచేస్తుంది. ఆ ప్రకారం ఈ ఏడాది కూడా జిల్లాల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్లకు పంపింది. నాబార్డు ఇచ్చిన ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సమావేశాలు నిర్వహించింది. బ్యాంకర్లు, వ్యవసాయఅధికారులతో కూడిన కమిటీ ఆయా జిల్లాలకు ఎంత రుణం అవసరమో నివేదిక తయారుచేసి ఎస్ఎల్బీసీకి పం పించింది. విచిత్రమేంటంటే నాబార్డు రూ. 35,179 కోట్లు అవసరమని అంచనా వేస్తూ ప్రతి పాదనలు పంపిస్తే రూ. 30,995 కోట్లు మాత్రమే అవసరమని కలెక్టర్లు నివేదికలు పంపించారు. దీనిపై నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో దీనిపై వాడీవేడి చర్చ జరి గినట్లు తెలిసింది. నాబార్డు అధికారులు చెప్పేవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. నాబార్డు విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రకటించిన వ్యవసాయ రుణప్రణాళికను సవరించే యోచనలో సర్కారు ఉంది. మళ్లీ జిల్లాల నుంచి సవరింపుతో రుణ ప్రణాళిక నివేదిక తెప్పించుకొని రూ. 38 వేల కోట్లతో రుణప్రణాళికను తయారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement