-
డబ్బంటే చేదా...?
- లుంబినీ పార్కులో నిరుపయోగంగా అద్భుత నిర్మాణాలు - ఔత్సాహికులు ముందుకొచ్చినా... అలక్ష్యం - ఆదాయంపై ఆరాటంలేని హెచ్ఎండీఏ ఏ సంస్థ అయినా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని..ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది.అయితే హెచ్ఎండీఏ ఇందుకు వ్యతిరేకం. లుంబినీ పార్కు ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నా అందిపుచ్చుకోలేక పోతోంది. దీంతో లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. - హుస్సేన్సాగర్ తీరాన లుంబినీ పార్కులో పదేళ్ల క్రితం రెస్టారెంట్ కోసం అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్ను నిర్మించారు. అలాగే లేజర్ షోను ఆనుకొని సర్వాంగ సుందరంగా ఓ వాణిజ్య సముదాయాన్ని హెచ్ఎండీఏ నిర్మించింది. వీటిని లీజుకు ఇచ్చే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయం సంస్థకు అందకుండా పోతోంది. - లుంబినీ పార్కులో భారీ స్టీల్ స్ట్రక్చర్ను నిర్మించేందుకు 11ఏళ్ల క్రితం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ దాన్ని గాలికొదిలేశారు. అందులో ఫుడ్ కోర్టు పెట్టుకొనేందుకు అనుమతిస్తే నెలకు రూ.50-60వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. అయితే.. అధికారులు స్పందించక పోవడంతో అది వెనుదిరిగింది. - లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణం చేశారు. ఆతర్వాత దీనికి రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులున్న ఈ భవనం ఏళ్లతరబడి ఖాళీగా పడిఉంది. ఈ భవనాన్ని లీజ్కిస్తే నెలకు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫాస్టు ఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్కు ఇవ్వాలంటూ పలు సంస్థలు బీపీపీకి దరఖాస్తు చేసుకొన్నాయి. నక్షత్ర (స్టార్) హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే... ఇక్కడ హోట ల్ నిర్వహణకు అనుమతి లేదంటూ అధికారులు తిరస్కరించారు. వీటి మాటేమిటి ? లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్లో రెస్టారెంట్ ఉంది. అలాగే నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు హెచ్ఎండీఏ సొంత స్థలంలో నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎం దుకు అనుమతి లేదన్నది ఇక్కడ అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకొనే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవనం మాత్రం బందోబస్తుకు వచ్చే పోలీసులకు విడిదిగా మారింది. హెచ్ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కసరత్తు చేస్తున్న కమిషనర్ శాలిని మిశ్రా లుంబినీ పార్కులో నిరుపయోగంగా ఉన్న అద్భుతమైన నిర్మాణాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. -
బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఎక్కడనేది దాదాపు తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మెలిక పెడితే తప్ప బయ్యారం మండలంలోనే ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షాల సభ్యులు మాట్లాడిన అనంతరం.. కేసీఆర్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్లాంట్ను బయ్యారంలోనే ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సందర్భంగా బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని పలు రాజకీయ పార్టీలు ప్రతిపాదించాయి. వైఎస్సార్సీపీ పక్షాన ఆ పార్టీ ఫ్లోర్లీడర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న సభ్యుల విజ్ఞప్తికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. బయ్యారంలో ఏర్పాటు చేస్తేనే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఇతర ఖనిజ సంపదను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇటీవల ప్రధాన మంత్రి మోడీని కలిసిన సందర్భంగా ఇచ్చిన వినతిపత్రంలో కూడా బయ్యారంలోనే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. దీంతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర సాధికార కమిటీకి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన ఇతర ప్రాంతాలను ఇక పరిశీలించే అవకాశం లేద ని తెలుస్తోంది. బయ్యారంలోనే ఎందుకు..? జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్ర సాధికార కమిటీ గత నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నుంచి నిపుణుల బృందం జిల్లా అధికారులు ప్రతిపాదించిన బయ్యారం మండలం ధర్మాపురం, కొత్తగూడెం మండలం కూనారం గ్రామాలకు ఉన్న అనుకూల, ప్రతికూలతలపై అధ్యయనం చేసింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక మేరకు సెయిల్ తీసుకునే నిర్ణయానికి కేంద్ర ఆమోదం లభిస్తే జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది. అయితే, అధికారులు ప్రతిపాదించిన రెండు ప్రాంతాల్లో బయ్యారం మండలమే అనుకూలమనే వాదన వినిపిస్తోంది. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడంతో పాటు, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉన్నాయి. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు 14 కిలోమీటర్ల దూరంలో రైలుమార్గం ఉంది. సింగరేణి కాలరీస్ పరిధిలో జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్కాస్టు, అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు వచ్చే అవకాశం ఉంది. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220 కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది. కాగా, కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడం ఇక్కడ ప్రతికూలంగా ఉంది. దీనిపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భారీ ప్రాజెక్టు నిర్మించిన చోట యూజీ మైనింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అసలుకే మోసం వస్తుందనే భావన జీఎస్ఐ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బయ్యారం అయితేనే మంచిదనే ఆలోచనలో అటు సెయిల్, జీఎస్ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement