-
చిన్నారికి అట్లకాడతో వాతలు
జంగారెడ్డిగూడెం: కాల్చిన అట్ల కాడతో చిన్నారికి వాతలు పెట్టిన పెంపుడు తల్లి కటకటాల పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యనమదల నాగ వెంకటలక్ష్మి (7) పట్టణంలోని బాలాజీ నగర్ మండల పరిషత్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని యనమదల లక్ష్మి అనే మహిళ పెంచుకుంటోంది. చిన్నారి తల్లి దుర్గ భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. తల్లి దుర్గకు, పెంపుడు తల్లి లక్ష్మికి అక్కడ పరిచయం ఏర్పడింది. లక్ష్మికి అప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉండగా, ఆడపిల్ల కావాలి పెంచుకుంటానని దుర్గని అడగడంతో చిన్నారి నాగవెంకటలక్ష్మిని రెండేళ్ల వయసులోనే లక్ష్మికి పెంచుకోవడానికి ఇచ్చింది. కాగా, కొంతకాలంగా చిన్నారి నాగవెంకటలక్ష్మిని పెంపుడు తల్లి లక్ష్మి చిత్రహింసలు పెడుతోంది. ఇంటి పనులు చేయించడం, కర్రలతో కొట్టడం, అట్ల కాడతో కాల్చడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. ఇటీవల చిన్నారి శరీరంపై అట్ల కాడతో తీవ్రంగా కాల్చింది. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయించలేదు. ఆ గాయాలతోనే నాగవెంకటలక్ష్మి పాఠశాలకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా చిన్నారి నాగవెంకటలక్ష్మిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి పాఠశాలకు వెళ్లింది. ఆడుకుంటూ పడిపోవడంతో బాలిక ఒంటిపై కాలిన గాయాలను తోటి విద్యార్థులు గమనించి ప్రధానోపాధ్యాయిని గణేష్ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె జంగారెడ్డిగూడెం ఎస్సై ఎం.సాగర్బాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో యూఎన్ స్వర్ణకుమారి, సూపర్వైజర్ పి.బ్యూలా పాఠశాలకు వచ్చి చిన్నారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం చిన్నారిని ఏలూరు సీడీపీవో కార్యాలయానికి తరలించి పూర్తి వైద్యం చేయిస్తామని, అనంతరం చిల్డ్రన్ హోమ్కు తరలిస్తామని సీడీపీవో స్వర్ణకుమారి చెప్పారు. చిత్రహింసలు పెట్టిన పెంపుడు తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.సాగర్బాబు చెప్పారు. స్పందించిన ప్రభుత్వం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బాలికను దెందులూరులోని బాలసదన్కు తరలించి సంరక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. -
చిట్టితల్లికి ఎన్ని చిత్రహింసలో!
మొదటి ఫొటోలో మీరు చూస్తున్నది ఎవరినో తెలుసా? కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో కనీ వినీ ఎరుగని చిత్రహింసలకు గురై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో పడి ఉన్న ప్రత్యూషనే! అవును.. ఒకవైపు మొహం అంతా కాలిపోయినట్లు ఉండి, ఎముకల గూడులా మారిపోయిన ప్రత్యూష ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఇలా చక్కగా ఉండేది. ఈ ఫొటోను, ఇప్పటి ఫొటోను చూస్తే.. అసలు ఆ అమ్మాయేనా ఇలా ఉన్నది అనే అనుమానం రాక తప్పదు. ప్రత్యూష అసలు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో.. తర్వాత చాముండేశ్వరి అనే మహిళను ఆమె తండ్రి రమేష్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి ప్రత్యూషతో బలవంతంగా యాసిడ్ తాగించడం, సిగరెట్లతో కాల్చడం లాంటి వికృత చర్యలకు పాల్పడ్డారు. దాంతో దాదాపు జీవచ్ఛవంలా మారిన ఆమె.. ఎలాగోలా బయటపడింది. ప్రస్తుతం ఆమె సవతి తల్లి, కన్న తండ్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను హాస్టల్లో చేర్చి, మంచి చదువు చెప్పిస్తామని.. మంచి అబ్బాయిని చూసి తన సొంత ఖర్చుతో పెళ్లి చేయిస్తామని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈమే బతికుంటే.. ఈ ఫొటోలో కనిపిస్తున్నమహిళే ప్రత్యూష అసలు తల్లి. ఈమె ఆత్మహత్య చేసుకోవడం వల్లే రమేష్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాముండేశ్వరి అనే ఆ మహిళ.. ప్రత్యూషను కన్న కూతురిలా చూడకుండా, ఇంట్లో ఆమెను భారంగా భావించింది. దాంతో చిత్రహింసల పాలు చేసింది. - వాసుదేవరెడ్డి, సాక్షి టీవీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement