-
‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్లను రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు, రాయచోటి, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, పి. రవీంద్రనాథ్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఆర్అండ్బి అతిథిగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రిషితేశ్వరి లాగా ఏ విద్యార్థినిలు ర్యాగింగ్ భూతానికి బలికాకూడదన్నారు. ఆమె తల్లిదండ్రుల గర్భశోకం మరొకరికి కలగకూడదన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి తిరుపాల్రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, జెడ్పీటీసీలు సుదర్శన్రెడ్డి, సురేష్యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు పి. ప్రసాద్రెడ్డి, వైఎస్ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు. -
'ర్యాగింగ్ అరికట్టాలంటూ వీసీకి వినతిపత్రం'
కేపీహెచ్బీకాలనీ (హైదరాబాద్): జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పరిరక్షణ ఫోరం (టీజీపీఎఫ్) ఆధ్వర్యంలో ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్యార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో విద్యార్ధిని బలి తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ కళాశాల యాజమాన్యంపై, ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. టీజీపీఎఫ్ టెక్నికల్ విభాగం ఇన్చార్జ్ బోయపల్లి అశోక్గౌడ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంఆర్ కళాశాల ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థి సాయినాథ్ ర్యాగింగ్ బారినపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement