-
తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు
సాక్షి, అమరావతి: తుపాన్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రెండు దశల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ నిర్ణయించింది. తిత్లీ, నివర్ తుపాన్లు, భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు రెండు దశల్లో రూ.540 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో రూ.154 కోట్లతో 260 పనులను ఇప్పటికే ఆమోదించారు. త్వరలో మరో రూ.386 కోట్లతో పనులకు ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మొదటి దశలో రాష్ట్ర ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.74 కోట్లతో 50 పనులను ఆమోదించారు. వాటిలో 25 పనులను ప్రారంభించగా మరో 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్లతో 210 పనులను ఆమోదించారు. వాటిలో 55 పనులను ప్రారంభించగా 155 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక రెండో దశ పనులకు తుది ఆమోదం రాగానే పనులు మొదలుపెడతారు. చదవండి: సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి -
అంచనాకు అందని నష్టం
నష్టంపై శాఖల వారీ సర్వే రాత్రికల్లా విశాఖకు మళ్లీ కరెంటు సామాజిక బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఆర్థికసాయం చేయండి విశాఖ కలెక్టరేట్లో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి ‘‘అంచనాకు అందని నష్టమిది. ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం. తుపాను నష్టంపై శాఖల వారీగా సర్వే జరుగుతుంది. రేపటికల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. విశాఖ నేవీ రంగానికే రూ.2 వేల కోట్ల నష్టం కనిపిస్తోంది. స్టీల్ప్లాంటు కూడా బాగా దెబ్బతింది. ఎవ్వరూ అధైర్యపడొద్దు. సమన్వయంతో జరిగిన నష్టం నుంచి బయటపడదాం’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ధైర్యం చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో మంగ ళవారం ఉదయం 11 గంటలకు అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి తుపాను సహాయ చర్యలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖ నగరానికి అనుకోని కష్టం వచ్చింది. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతగిలింది. ప్రపంచంలో ఎక్కడా నేరుగా నగరాన్ని దెబ్బతీసిన తుపానుల గురించి వినలేదు. ఇదే మొదటిది. నేవీ రంగానికి రూ.2 వేల కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీకి రూ.300 కోట్లు, స్టీల్ప్లాంట్కు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది. స్టీల్ప్లాంటులో ఉత్పత్తి పడిపోవడంవల్ల రోజుకు రూ 30 నుంచి 40 కోట్ల నష్టం కనిపిస్తోంది. ఫర్నేస్లు పనిచేయడం నిలిచిపోతే ఈ నష్టం మరింత పెరిగే ప్రమాదముంది. ఈ లోగానే పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. ప్రయివేటు పరిశ్రమలు లాభాల కోసమే పనిచేయడంమాని మానవత్వంతో సహాయక చర్యలకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆ విధంగా ముందుకురాని సంస్థలు, పరిశ్రమలపై చర్యలు తప్పవన్నారు. సహాయక చర్యల విధులకు రాకపోతే అవసరాన్ని బట్టి అరెస్టులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో టెలికాం ఉద్యోగులు విఫలమయ్యారనీ, అదేవిధంగా సెల్ఫోన్ నెట్వర్క్ ఆపరేటర్లు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని మండిపడ్డారు. సెల్ టవర్లు నిర్విరామంగా పనిచేసేందుకు వీలుగా డీజిల్ కూడా సిద్ధం చేసుకోలేని స్థితిలో ఆపరేటర్లు ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రానికి విద్యుత్ సరఫరా... విశాఖ నగరంలో మంగళవారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అదనంగా విద్యుత్ సిబ్బందిని, ట్రాన్స్ఫార్మర్లను తెప్పించి ఇక్కడి ఫీడర్లకు కలపనున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో డిమాండుకు సరిపడా విద్యుత్ను సరఫరా చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. బయట ప్రాంతాల నుంచి నిర్వాసితుల కోసం వచ్చే ఆహార పదార్థాలు, తాగునీటిని లూటీ చేయవద్దని హితవు చెప్పారు. అందరికీ సమృద్ధిగా ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాల కృత్రిమ కొరత తలెత్తకుండా అందరూ సహకరించాలని కోరారు. పాలు, కూరగాయలను అధిక మొత్తంలో తెప్పిస్తున్నామని తెలిపారు. నగరంలో సాయంత్రానికి పెట్రోలు కొరత తీరుతుందని, ఇన్సూరెన్సు కంపెనీలు సాధ్యమైనంత త్వరగా ఆదుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి నిర్వాసితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. యువత శ్రమదానం ద్వారా నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు సహకరించాలన్నారు. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధమయ్యేవరకూ హైదరాబాద్ వెళ్లేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
Advertisement