-
వ్యూహాత్మక రోడ్డుకోసం భారీ నిర్మాణ సామగ్రి
పితోర్గఢ్: భారత్–చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత సానువుల్లో కీలకమైన వ్యూహాత్మక రోడ్డు నిర్మాణం వేగవంతం చేసేందుకుగాను భారీ యంత్ర సామగ్రిని హెలీకాప్టర్ల ద్వారా తరలించినట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్గఢ్ జిల్లా జోహార్ లోయలో మున్సియారీ–బుగ్డియార్–మిలాం మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయితే చైనా సరిహద్దులకు అతి సమీపంలోకి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ, భారీ కొండరాళ్లు అడ్డురావడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రాళ్లను అడ్డుతొలగించేందుకు అవసరమైన భారీ యంత్ర సామగ్రిని అక్కడికి తరలించేందుకు బీఆర్వో 2019లో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా, యంత్ర సామగ్రితో బయలుదేరిన హెలీకాప్టర్లు ఆ మార్గానికి దగ్గర్లోని లాప్సిలో విజయవంతంగా దిగాయి. దీంతో పనులు వేగం పుంజుకుని ఈ రహదారి నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని బీఆర్వో చీఫ్ ఇంజినీర్ బిమల్ గోస్వామి వెల్లడించారు. 2010లో ప్రారంభమైన ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలోని మొదటి, చివరి భాగాలు పూర్తి కాగా భారీ కొండరాళ్ల కారణంగా 22 కిలోమీటర్ల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. -
రూ. 90 కోట్లు.. 31 ఫంక్షన్ హాళ్లు
పనులకు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ పెళ్లిళ్లతోపాటు సభలు, సమావేశాలకు వీలుగా మల్టీపర్పస్గా నిర్మాణం ఒక్కోదాని అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు ఆగస్టు పది నుంచే పనులు ప్రారంభం కావాలి: కమిషనర్ సోమేశ్కుమార్. హైదరాబాద్: గ్రేటర్ ప్రజలు ఫంక్షన్లు, పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ. 90 కోట్లతో 31 బహుళ వినియోగ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో సంబంధిత ఇంజనీర్లు టెండర్లు ఆహ్వానించారు. విశ్వనగరంలో భాగంగా ఓవైపు ఎస్సార్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్) పనుల కోసం రూ. 2631 కోట్లు మంజూరు చేస్తూ, ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పరిపాలనపర అనుమతులివ్వడం తెలిసిందే. వాటికి అతిత్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈలోగా జీహెచ్ఎంసీ నిధుల నుంచే రూ. 90 కోట్లతో ఫంక్షన్ హాళ్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాల ఫ్లై ఓవర్లు.. స్లమ్ఫ్రీలో భాగంగా పేదలకు ఉపకరించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారి కోసం మార్కెట్లు, ఫంక్షన్హాళ్లు, బస్షెల్టర్లు తదితరమైనవి లేకపోవడం గుర్తించిన సీఎం కె. చంద్రశేఖరరావు వాటి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం తెలిసిందే. అందుకు అనుగుణంగా వాటి ఏర్పాటు కోసం గత కొద్ది వారాలుగా స్థలాలను అన్వేషించిన అధికారులు ఆయా అవసరాల కోసం తగిన స్థలాలను గుర్తించారు. వాటిల్లో 31 ప్రాంతాల్లో బహుళ ఉపయోగ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మొత్తం 50 ఫంక్షన్హాళ్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 ఫంక్షన్హాళ్లు నిర్మించాలని భావిస్తున్నారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఒక్కోహాలు అంచనా వ్యయం రూ. 2.90 కోట్లు. టెండర్ల ప్రక్రియను ఆగస్టు 10 లోగా పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. టెండర్లకు ఎందుకింత తొందర? 31 ఫంక్షన్ హాళ్లల్లో నాలుగింటికి ఈనెల 28 నుంచే టెండర్లు ఆహ్వానించగా, శుక్రవారం సాయంత్రానికి గడువు కూడా ముగిసింది. మిగతా వాటికి 7వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువుంది. పనులు నాణ్యంగా జరిగేందుకు అర్హులైన వారు ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేందుకు తగినంత సమయం ఇవ్వకుండా నాలుగింటికి హడావుడిగా గడువు కూడా ముగిసిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. త్వరలో మార్కెట్లు, బస్షెల్టర్లు..: ఇప్పటికే ఆయా స్థలాలను పలు అవసరాల కోసం గుర్తించిన అధికారులు ఇతర స్థలాల్లో ఆధునిక మార్కెట్లు, బస్షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు(ఆటో, ట్యాక్సీస్టాండ్లతోపాటు), ఆధునిక దోబీఘాట్లు, మహిళల టాయ్లెట్లు, ఆటస్థలాలు, జిమ్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక మార్గదర్శకాలివి.. దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలోమూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పా ట్లు. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు. ఫంక్షన్హాళ్లు నిర్మించనున్న ప్రదేశాలు.. ఇప్పటికే టెండరు గడువు ముగిసినవి.. 1. జుమ్మెరాత్బజార్(పురానాపూల్-ముస్లింజంగ్ బ్రిడ్జి) 2. ఆజాద్ మార్కెట్, ఇసామియా బజార్ 3. మునిసిపల్ కళ్యాణమంటపం (శాంతినగర్) 4.దూద్బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర, చిలకలగూడ టెండర్లకు 7వ తేదీ వరకు గడువున్నవి... 5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ 6. పోలీస్స్టేషన్ వెనుక, కుషాయిగూడ 7. శ్రీరామ్నగర్కాలనీ, (కాప్రాసర్కిల్) 8. కొత్తపేట. 9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్బీనగర్ సర్కిల్) 10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్-4) 11.భానునగర్ (సర్కిల్-4) 12. మైలార్దేవ్పల్లి (రాజేంద్రనగర్ సర్కిల్) 13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్) 14.భోజగుట్ట(సర్కిల్-7) 15. అంబర్పేట 16. హకీంబాబా దర్గా, ఫిల్మ్నగర్ 17. బంజారాహిల్స్ 18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్పేట 19. గచ్చిబౌలి 20. రాయదుర్గం 21. చందానగర్ 22. హఫీజ్పేట 23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్ (సర్కిల్-13) 24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్పల్లి సర్కిల్) 25.ఆల్విన్కాలనీ 26. జగద్గిరిగుట్ట 27. సర్వే నం.2/2 ఓల్డ్ అల్వాల్ 28. హెచ్ఎంటీ కాలనీ 29.టీఆర్టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ 30. కేపీహెచ్బీ 31. ఫేజ్ 2 హౌసింగ్కాలనీ(నార్త్జోన్)
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement