-
విధి రాత.. కన్నోళ్లకు కడుపుకోత
మాడుగులపల్లి: పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా మనోధైర్యంతో కష్టాల కడలిని ఈదుతున్నారు ఆ దంపతులు. తమ ఇబ్బందులను చూసి అత్యుత్తమంగా చదువుతూ పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటున్న కుమారుడిని చూసి పొంగిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. విధి వారికి కడుపుకోతను మిగిల్చింది. పిడుగు రూపంలో కుమారుడిని బలిగొనడంతో కన్నవారు తామెరికోసం బతకాలంటూ.. తమకిక దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. మాడుగుపల్లి మండలం పాములపహాడ్ గ్రామానికి చెందిన లింగయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు గోపి(21) డిగ్రీ ఫైనలియర్, కుమార్తె ఇంటర్ చదువుతున్నారు. గోపి మొదటి నుంచి చదువుల్లో చురుకు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 8.7 జీపీఏ సాధించాడు. ఇంటర్లోనూ 750 మార్కులు సాధించాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ సెలవు రోజుల్లో తండ్రికి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏడాది క్రితం తండ్రి లింగయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కాలుకు శస్త్ర చికిత్స జరిగడంతో మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం, జీవాల పెంపకం తదితర పనులన్నీ గోపినే చూసుకుంటున్నాడు. ఈ నెల 20వ తేదీన పక్కింటి వ్యక్తితో కలిసి గోపి గొర్రెల మందను మేపేందుకు తోలుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభంకావడంతో ఇద్దరు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా పక్కనే పిడుగుపడి గోపి మృతిచెందాడు. ఊహించని ఈ ఘటన నుంచి ఆ తల్లిదండ్రులు తేరుకోలేకపోతున్నారు. ఓ వైపు భర్త మంచాన పడడం.. చేతికొచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కన్నతల్లి వేదన వర్ణనాతీతంగా మారింది. వృద్ధాప్యంలో తమకెవరు దిక్కంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది. పుట్టెడు కష్టంలో ఉన్న నిరు పేద కుటుంబానికి ప్రభుత్వం, దాతలు బాసటగా నిలువాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు బలి!
సాక్షి, గురజాల రూరల్: వేసవి సెలవుల్లో ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటకు చెందిన శ్రీహరి నాయక్, మనోహర్ నాయక్, హరిబాబు నాయక్తో పాటు మరికొందరు పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పరుగులు తీశారు. ఇంతలో మూడావత్ పవన్ (17), శ్రీహరి నాయక్(14), మనోహర్ నాయక్ (11)లకు సమీపంలో పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. హరిబాబు నాయక్ కొద్ది దూరంలో స్పృహ కోల్పోయాడు. స్థానికులు వీరిని రెంటచింతల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. హరిబాబు నాయక్ గురజాల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో పవన్ హైదరాబాద్లో చదువుకుంటూ 10 రోజుల కిందటే వేసవి సెలవులకు సమాధానంపేటలోని మేనమామ నరసింహా నాయక్ ఇంటికి వచ్చాడు. -
పిడుగు పడి మహిళ మృతి
నక్కలవాడ (ఆదిలాబాద్): పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (45) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే ఆమె పనిచేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement