-
బీఎస్పీ అధికారంలోకి వస్తే 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
హన్మకొండ చౌరస్తా, నయీంనగర్: వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.7,500 అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హామీనిచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మంగళవారం ‘బహుజన విద్యార్థి భరోసా’సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్పీ హామీలివే... పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుంచి వంద మందికి విదేశీ విద్య అందిస్తామని, అందులో 50మంది విద్యార్థినులు ఉంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని, కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పుతామని హామీనిచ్చారు. 8నుంచి 12 తరగతి విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ ఆత్మహత్యలు లేకుండా కార్యాచరణ రూపొందిస్తామని, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోతే కాంట్రాక్టర్లను చేస్తామని వాగ్దానం చేశారు. శ్రీకాంతాచారి పేరు తో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పేపర్ లీకేజీలు లేకుండా చర్యలు చేపడతామని, పూర్ణ, ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీ య ప్రమాణాలతో క్రీడా స్టేడియాలను నిర్మిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ జరుగుతుండగా గద్దర్ మరణ వార్త తెలిసినా సీఎం కేసీఆర్ కనీసంగా స్పందించలేదని, సంతాప తీర్మానం చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. -
మార్కెటింగ్లో మనంపూర్: రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు: ‘‘మనం ఎక్కువగా పనిచేస్తాం. కానీ మార్కెటింగ్ బాగా చేసుకోలేం. ప్రతిపక్షం మాత్రం తక్కువగా పనిచేస్తుంది. ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటుంది’’ అని కాంగ్రెస్ కార్యకర్తలతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారమిక్కడ ‘యువత, విద్యార్థుల మేనిఫెస్టో రూపకల్పనకు సంప్రదింపుల సమాలోచనం’ పేరుతో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు, ఉద్యోగులు, పంచాయతీ ప్రతినిధులు, ఇతర వర్గాలకు చెందిన 250 మంది యువ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లో ప్రవేశాలు పారదర్శకంగా లేకపోవడంతో యువతకు ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరుండాలని ప్రజలను అడుగుతుందా? అని ప్రశ్నించారు. మన ఉన్నత విద్యా విధానాన్ని పారిశ్రామిక రంగం, ఎన్జీఓ, ఇతర రంగాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంద న్నారు. మహిళలకు సరైన అధికారాలు లేకపోవడమే వారిపై వేధింపులకు కారణమని విశ్లేషిస్తూ.. మహిళా సాధికారతే వారి సమస్యలకు పరిష్కారమని తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement