-
అవధులు లేనిదదే!
‘మనవాళ్లొట్టి వెధవాయిలోయ్’ అని ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం నోట పలికించారు గురజాడ. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మనవాళ్లు కూడా ఆయన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా, వెధవాయిత్వాన్ని కడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారులెండి. దేశంలో నిరక్ష రాస్యత ఎంతగా తగ్గుముఖం పట్టినా, ఎన్ని విశ్వవిద్యాలయాలు పుట్టుకొస్తున్నా, ఎన్నెన్ని జ్ఞాన ప్రవచనాలు మన చెవుల్లో అనుదినమూ మార్మోగుతూనే ఉన్నా, మన వెధవాయిత్వం మాత్రం నానాటికీ వర్ధిల్లుతూనే ఉంది. వెధవాయిత్వం అనగా మూర్ఖత్వం. ఇది మానవ సహజ లక్షణం. ఈ లక్షణం గురజాడవారికి ముందూ ఉంది, ఆ తర్వాతా ఉంది. మూర్ఖత్వానికి మూలకారణమేంటి అని తరచి చూస్తే, అజ్ఞానమే కారణంగా కనిపిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేస్తే, మూర్ఖత్వం తొలగిపోతుంది కదా అనుకోవచ్చు. అదంత తేలికపాటి వ్యవహారం కాదు. ‘మూర్ఖత్వానికీ జ్ఞానానికీ ఉన్న తేడా అల్లా జ్ఞానానికి అవధులు ఉన్నాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్. మూర్ఖత్వం అవధులు లేనిదని ఆయన కవిహృదయం. లోకంలో అవధులు లేని మూర్ఖత్వమే లేకుంటే, జ్ఞానానికి విలువెక్కడిది? చీకటి ఉన్నచోటే కదా చిరుదీపానికి విలువ! చరిత్రంతా మూర్ఖత్వానికీ జ్ఞానానికీ మధ్య సంఘర్షణే! ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు/ దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు/ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు’ అని భర్తృహరి ఏనాడో సంస్కృతంలో చెప్పిన మాటలను ఏనుగు లక్ష్మణకవి తేట తెలుగులో చెప్పాడు. లోకంలో ఎలాంటి అసాధ్యాన్నయినా సాధించవచ్చు గాని, మూర్ఖులను ఒప్పించి మెప్పించడం సాధ్యంకాని పని అని గుర్తించిన భర్తృహరిని మించిన మహాజ్ఞానులు ఇంకెవరుంటారు? భర్తృహరి మాటలను గుర్తుంచుకుంటే, మూర్ఖులతో పేచీ లేకుండా మన మానాన మనం కడుపులో చల్ల కదలకుండా బతికేయవచ్చు. కాదూ కూడదని పని గట్టుకుని మరీ మూర్ఖులను ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం అది వికటించి, ప్రాణాల మీదకు కూడా రావచ్చు. మూర్ఖబలాన్ని తక్కువగా అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది. కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించిన గెలీలియో ఉదంతమే ఇందుకు ఉదాహరణ. సూర్యుని చుట్టూనే భూమి తిరుగుతుందని చెప్పిన పాపానికి నాటి మతాధి కారులు గెలీలియోను ఖైదుపాలు చేశారు. చివరకు ఖైదులోనే అతను కన్నుమూశాడు. అంతకంటే ముందుకాలం వాడు సోక్రటీస్. యువకులకు జ్ఞానబోధ చేశాడు. మూర్ఖ మతాధిపతులు కన్నెర్ర చేశారు. అతడి చేతికి విషపాత్రనిచ్చారు. అదీ మూర్ఖత్వం తడాఖా! సత్యాన్ని వెల్లడించిన పాపానికి ప్రాణాలనే బలిగొనేంత బలవత్తర శక్తి మూర్ఖత్వానిది. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజి చేస్తుంటేగాని పొలిటీషియను కానేరడు’ అని మహాజ్ఞాని గిరీశం నుడివాడు. పొలిటీషియన్ అయినా కాకున్నా, మానవమాత్రులందరూ కాలానుగుణంగా అభిప్రాయాలను మార్చుకుంటూనే ఉంటారు. బాల్యంలో ఉన్న అభిప్రాయాలు యవ్వనంలో మారి పోతాయి. యవ్వనంలోని అభిప్రాయాలు వార్ధక్యంలో పటాపంచలైపోతాయి. అసలు అభిప్రాయాలను మార్చుకోని వారు ఇద్దరే ఇద్దరు అంటాడు అమెరికన్ కవి జేమ్స్ రసెల్ లోవల్. ‘ఈ ప్రపంచంలో మూర్ఖుడూ, మృతుడూ మాత్రమే తమ అభిప్రాయాలను మార్చుకోరు’ అన్నాడు. ‘ఎఱుగువాని దెలుప నెవ్వడయినను జాలు/ నొరుల వశము గాదు వోగు దెల్ప/ యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా?’ అన్నాడు వేమన. అయినా, మూర్ఖులకు జ్ఞానబోధ చేయాలనే కాంక్ష కొందరు జ్ఞానులలో మితిమీరి ఉంటుంది. పరిసరాలను, పరిసరాల్లోని పరిస్థితులను పట్టించు కోకుండా ప్రవచనాలకు లంకించుకునే ‘జ్ఞానులు’ ఆ బాపతులోకే వస్తారు. అయితే, మూర్ఖులను జ్ఞానబోధ చేయడంతోనే మన విద్యావ్యవస్థలో పురోగతి మొదలైన సంగతిని మనం మరువరాదు. మూర్ఖులైన ముగ్గురు రాకుమారులకు విష్ణుశర్మ బోధించిన ‘పంచతంత్రం’ ప్రపంచ సాహిత్యంలోనే ఒక మైలురాయి. మూర్ఖులకు జ్ఞానబోధ చేయడం అంటే కత్తిమీద సాము వంటి విన్యాసమే! విష్ణుశర్మ ఆ పనిని విజయవంతంగా చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటి రచన ‘పంచతంత్రం’. దాదాపు అదేకాలంలో– క్రీస్తుశకం ఐదు నుంచి పదిహేనో శతాబ్ది మధ్యకాలంలో యూరోప్లో ‘ఫూల్స్ లిటరేచర్’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘ఫూల్స్ లిటరేచర్’లో వెలువడిన కవితలు, కథలలో ‘ఫూల్’ పాత్ర తప్పనిసరి. యూరోపియన్ మూర్ఖసాహిత్యంలోని ‘ఫూల్’ పాత్ర ఒక్కోసారి తెలివితక్కువ మూర్ఖునిగా, ఒక్కోసారి మొండి మూర్ఖునిగా, ఒక్కోసారి అతితెలివి మూర్ఖునిగా కనిపిస్తాడు. ప్రపంచ సాహిత్యంలో మూర్ఖపాత్రలు కోకొల్లలు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అనేది సనాతన మూర్ఖత్వం. ‘అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయిష’ అనేది హైటెక్ మూర్ఖత్వం. కాలం శరవేగంగా మారుతోంది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పురోభివృద్ధి చెందుతోంది. మనుషుల మూర్ఖత్వంలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే, ముడి పదార్థమైన మూర్ఖత్వం మాత్రం యథాతథంగానే ఉంటోంది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని మనసారా ఆకాంక్షించాడు గురజాడ. మనుషుల్లోని మూర్ఖత్వం మాసిపోయి, జ్ఞానమొక్కటే నిలిచి వెలిగే రోజులు ఎప్పటికైనా వస్తాయా? -
నిర్విన్కు దెయ్యం పట్టిందా?
- ఏదో శక్తులున్నాయని ప్రజల మూఢవిశ్వాసం - కొన్నాళ్లుగా వ్యాధుల బారిన పడుతున్న జనం కొత్తకోట: హైటెక్ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. తమను ఏదో శక్తులు ప్రభావితం చేస్తున్నాయని మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ గ్రామస్తులు భయపడుతున్నారు. ఒక రోజు గ్రామం విడిచి వెళితే ఊరికి పట్టుకున్న శక్తులు తొలగిపోతాయని భావించి, ఆదివారం వనంబాట పట్టారు. వివరాల్లోకి వెళితే.. నిర్విన్లో కొన్నాళ్లుగా ప్రజలు తరుచు వ్యాధుల బారిన పడటంతో గ్రామానికి ఏదో అయిందన్న భావన గ్రామస్తుల్లో నెలకొంది. దీంతో ఒకరోజు గ్రామాన్ని వదిలి వెళ్లాలని కొందరు పెద్దలు నిర్ణయించారు. గ్రామంలో ఎవరు సంచరించకుండా ఉంటే ఊరికి పట్టుకున్న శక్తి తొలగిపోతుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గ్రామస్తులందరూ ప్రధాన వీధిలో ఒకచోట పూజలు చేశారు. గ్రామంలో ఒక్కరూ ఉండకుండా అందరూ ఊరు విడిచి వనాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు వనాల్లోనే గడిపారు. చిన్న పిల్లలు చెట్ల కింద ఆటలాడుకున్నారు. మహిళలు బొడ్డెమ్మలు వేశారు. గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా నాలుగు పొలిమేరల్లో రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేశారు. గ్రామసేవకులు పొలిమేరల్లో కాపలా కాశారు. ఈ సంప్రదాయంతో తమ గ్రామానికి పట్టుకున్న శక్తి వదులుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. -
కేపీఎస్సీ నియామకాల రద్దు మూర్ఖత్వం
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్ఎస్) 2011లో నిర్వహించిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం మూర్ఖత్వమని బళ్లారి ఎంపీ శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం బళ్లారి తాలూకాలోని సంగనకల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి కేపీఎస్సీలో పాసైతే ఆ పరీక్షలను ఏకంగా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. 362 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించిన వారు గెజిటెడ్ ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయని ఆశిస్తే కేబినెట్ సమావేశంలో మొత్తం పరీక్షలను రద్దు చేయడం బాధాకరమన్నారు. ఆ పరీక్షల్లో ఎందరో పేదలు, దళితులు, అగ్రవర్ణాలకు చెందిన నిరుపేద మహిళలు కష్టపడి చదివి పాసయ్యారని, వారందరి జీవితాలను సీఎం నాశనం చేస్తున్నారన్నారు. కేపీఎస్సీని స్వయంప్రతిపత్తిగా మార్చాలని రాజకీయ జోక్యం తగదన్నారు. యూపీఎస్సీ మాదిరిగానే కేపీఎస్సీని మార్చాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఏకంగా పరీక్షలనే రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుసగా బోరుబావుల్లో పడి చిన్నారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగా, జెడ్పీ సభ్యుడు రాజశేఖరగౌడ, బీజేపీ నాయకులు రామలింగప్ప పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేసినా ఓబుళేసు గెలుపు తథ్యం కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ తరుపున సీఎం సిద్ధరామయ్య ఇక్కడ తిష్టవేసి ప్రచారం నిర్వహించినా బీజేపీ అభ్యర్థి ఓబుళేసు గెలువడం ఖాయమని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు.ఆయన సంగనకల్లు గ్రామంలో ఓబుళేసు తరుపున ఎన్నికల ప్రచారం పాల్గొని,ఇంటింటా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి ఓబుళేసుకు బళ్లారి గ్రామీణ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయని, తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఓబుళేసు నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకుని, వారికి పనులు చేసి పెట్టారని గుర్తు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement