-
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్వర్క్ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో మూడో స్థానంలో చంద్రబాబు
-
జీఎస్టీ చట్టం: ఓ ఆసక్తికరమైన వార్త
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు. -
పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ఎమర్జెన్సీ దుష్ఫలితాలు, రాజ్యాంగ దుర్వి నియోగాన్ని భావితరాలకు తెలి పేందుకు పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర మంత్రి వెం కయ్యనాయుడు సూచించారు. ఎమర్జెన్సీ ని చీకటిరోజుగా అభివర్ణిస్తూ ప్రజా స్వామిక భారతదేశంలో ఎమర్జెన్సీని మించిన చెడు నిర్ణయం లేదన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, వాటి ఫలితాలు భావితరాలకు తెలియాల్సిన అవసరముందన్నారు. ఆదివారం హైదరా బాద్లో జరిగిన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ.. అప్రజాస్వామిక, నియం తృత్వ నిర్ణయానికి 1977లోనే కాకుండా మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయాల్లో విపక్షనేతలు, మీడియా నిర్వాహకులు, ఉద్యమకారులు, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సెన్సార్ను అంగీకరించని పత్రికలను వెలువరించకుండా చేశారని, ప్రతిపక్షనేతలను జైళ్లలో పెట్టార ని, ప్రశ్నించిన సొంత పార్టీ నేతలనూ ఇందిరాగాంధీ వేధిం చారన్నారు. ఎన్నికల గడువును ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచారని, ఇలాంటి అవకాశమే ఉంటే పదవుల నుంచి ఎవరూ దిగరని పేర్కొన్నారు. మారువేషాల్లో తిరిగాం: దత్తాత్రేయ కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ది ఇప్పటికీ ఎమర్జెన్సీ తరహా ఆలోచనా విధానమేనన్నారు. బ్రిటీష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడినట్టే కాంగ్రెస్తో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశాన్ని జైలుగా మార్చారని, మారువేషాల్లో తిరిగామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు!
లైఫ్ చదువుకు పెద్ద పీట... మంచిదే! మరి... చదువు ఏం నేర్పాలి? పిల్లల్లో విలువల్ని నేర్పాలి... బతకగలమనే ధైర్యాన్నివ్వాలి! అలాంటి చదువును... ఇప్పుడు చదవనిస్తున్నామా? నాకిదిష్టం అని చెప్పే అవకాశం ఈ తరం పిల్లలకు ఉంటోందా? వాళ్లలో ఆలోచన పుట్టకముందే ఆశయాలు సిద్ధమవుతున్నాయి. డాలర్ల సంపాదనే జీవితమా? తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యమా! ఇవన్నీ కనిపించని రంపాలే. ...లేత గుండెలను కోస్తున్నాయి. చిట్టి మొగ్గలు వాడిపోతున్నాయి పిల్లల్ని వికసించనివ్వండి! వాళ్లను ఆలోచించనివ్వండి!! ‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను... కాలేకపోయాను. మా అబ్బాయి డాక్టర్ అయి నా కల తీరుస్తాడు’’ మురిసిపోతూ చెప్తున్నాడు పవన్కుమార్ ఫోన్లో తన ఫ్రెండ్తో. రీడింగ్ టేబుల్ దగ్గర ఉన్న వినీత్కి వినిపిస్తూనే ఉన్నాయా మాటలు. తల పుస్తకంలో దూర్చి ఉన్నాడు, కళ్లు అక్షరాల వెంట పరుగుతీస్తున్నాయి. విషయమే బుర్రకెక్కడం లేదు. ఏవేవో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. న్యూటన్స్లా, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్, బయాలజీ ల్యాబ్ ప్రాక్టికల్స్ అన్నీ 24 ఫ్రేమ్స్లో కళ్లముందు గిర్రున కదలాడుతున్నాయి. ఆకు అడ్డుకోత, చర్మ నిలువుకోత... రికార్డు రాసి రాసి తనకు మాత్రం గుండెకోత మిగిలేట్టుంది... నిర్లిప్తంగా పుస్తకం మూశాడు. ‘‘చంటీ బుక్ మూస్తున్నావ్... రివిజన్ పూర్తయిందా’’ అన్నది డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్న సుమిత్ర. ‘‘వేరే సబ్జెక్టు చదువుదామని...’’ ఆపద్ధర్మంగా తోచిన అబద్ధం చెప్పి, తప్పదన్నట్లు మరో పుస్తకం తీశాడు వినీత్. ఆ క్షణానికైతే తప్పించుకుని మరో పుస్తకంలో తల దూర్చాడు. పేరెంట్స్ తన ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భావం ఎక్కడో గుండెల్లో కలుక్కుమనిపించింది. ‘‘రాత్రి పదకొండయింది. ఇక పడుకో నాన్నా! మళ్లీ నాలుగింటికే లేవాలి కదా’’ అంటూ లైటాపేసింది సుమిత్ర. ‘‘సతీశ్ వాళ్లబ్బాయి అర్ధరాత్రి రెండింటి వరకు చదువుకుంటున్నాడు. వీడిని పది దాటినప్పటి నుంచి నువ్వే ఎప్పుడెప్పుడు పడుకోబెడదామా అన్నట్లు చూస్తుంటావు. ఇలాగైతే మెడిసిన్లో సీట్ వచ్చినట్లే’’ విసుక్కున్నాడు పవన్. ‘‘నిద్రపోకపోతే ఎలా? చదివింది బుర్రకెక్కాలి కదండీ!’’ సుమిత్ర సర్దిచెప్పబోయింది. ‘‘నువ్విలాగే వెనకేసుకురా. లాస్ట్ వీక్... వీక్లీ టెస్ట్లో మార్కులు తగ్గినప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పటికి మూడుసార్లు ఫోన్ చేశారు. ర్యాంకు తెస్తాడని మీ వాడి మీద హోప్స్ పెట్టుకున్నాం. ఇలాగైతే కష్టం’’ అంటూ చివాట్లేశారాయన. ఎంతెంత ఫీజులు కట్టాను. నీకే బాధ్యత తెలియకపోతే ఇక వాడికెలా తెలుస్తుంది. డబ్బు కడితే తెలుస్తుంది... భార్య మీద ఉన్న పాత అసహనాలన్నీ ఈ వంకతో తీర్చుకున్నాడు పవన్. వినీత్ పడుకున్నాడు. కళ్లు మూసుకుంటే కనురెప్పల కింద పుస్తకాల దొంతరలు కనిపిస్తున్నాయి. పేరెంట్స్ మాటలు చెవుల్ని తాకుతున్నాయి. మూసుకుందామంటే చెవులకు రెప్పలు లేవు.పరీక్షలన్నీ అయిపోయాయి. రిజల్ట్స్ రోజు దగ్గర పడుతుంటే... పవన్లో ఆందోళన పెరుగుతోంది. ఏదైమైనా తన కొడుకు డాక్టర్ కావాల్సిందే. డాక్టర్గారి తండ్రిగా పొందే గౌరవాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒక్కో రిజల్ట్ వస్తుంటే అంచనాలు తప్పుతున్నాయేమోననే ఉద్వేగం కూడా పెరుగుతోందా తండ్రిలో. ‘‘ప్రణవ్! నీకు ఈ టీషర్ట్ ఇష్టం కదా తీసుకో’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తమ్ముడికిచ్చాడు వినీత్.‘‘థాంక్స్ అన్నయ్యా!’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తీసుకుని ఒంటిమీద పెట్టుకుని అద్దంలో చూసుకున్నాడు ప్రణవ్. వినీత్ తమ్ముడి కళ్లలో ఆనందం చూస్తూ ‘‘నా జీన్స్, హుడీస్, జెర్కిన్స్లో నీకేమేమి కావాలో అన్నీ తీసుకో’’ అన్నాడు. ప్రణవ్కది కొత్త. అన్నయ్య అడక్కుండానే ఇవ్వడం ఎప్పుడూ లేదు. ‘‘అన్నీ నేను తీసుకుంటే నీకు వద్దా అన్నయ్యా? ఎప్పుడూ ఒక్కసారి వేసుకుంటానన్నా ఇచ్చేవాడివి కాదు. ఇప్పుడన్నీ ఇచ్చేస్తున్నావేంటన్నయ్యా. నెక్ట్స్ ఇయర్ నువ్వు మెడిసిన్లో చేరి హాస్టల్కెళ్లిపోతావ్గా. అందుకే ఇప్పుడే ఇస్తున్నావా’’ వినీత్సమాధానం కోసం చూడట్లేదు ప్రణవ్. తానే ఓ సమాధానం వెతుక్కున్నాడు. వినీత్ మెల్లగా చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకు అర్థం వెతకడం ప్రణవ్ బాల్యానికి చేతగాదు, నవ్వులో తేడా గుర్తించగలిగిన సుమిత్రకు, పవన్కు... వినీత్ అలా నవ్వినట్లే తెలియదు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరూ నిద్రలేచిన అలికిడి లేదు. సుమిత్ర నిద్రలేచి పాలపాకెట్ కోసం తలుపు దగ్గరకు వెళ్లింది. చెయ్యెత్తి గడియ తీయబోయింది... కానీ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇంత ఉదయాన్నే తలుపు ఎవరు తీశారు? బహుశా రాత్రి పవన్ కారిడార్లో నిలబడి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూనే లోపలికి వచ్చాడేమో! తలుపు గడియ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు... అనుకుంది. అదే మాట భర్తను అడిగింది. తాను గడియ వేసినట్లు చెప్పాడు. అంతలోనే పవన్కు ఏదో సందేహం... వినీత్ గదిలోకెళ్లి చూశాడు.బాత్రూమ్లో ఉన్నాడేమోనని చెవులు రిక్కించాడు... నిశ్శబ్దం. ‘‘వినీత్ను బయటకు పంపించావా?’’ సుమిత్రకు వినిపించేలా అన్నాడు. లేదంది సుమిత్ర. గుండె కొట్టుకోవడం పైకి వినిపిస్తోంది పవన్కి. రీడింగ్ టేబుల్ మీద రోల్ చేసి క్లిప్ పెట్టిన పేపర్ మీద ఆగింది అతడి దృష్టి. క్షణాల్లోనే అర్థమైంది... వినీత్ లేడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ‘‘నాన్నా! మీ యాంబిషన్ని నేను ఫుల్ఫిల్ చేయలేను. సారీ’’ అని ఒకే ఒక వాక్యం ఉంది. సుమిత్రకు పవన్ మీద పట్టరాని కోపం వస్తోంది. వినీత్ బాల్యం వాడిది కాకుండా పోవడానికి కారకుడు భర్తేనని ఆమె గుండె ఘోషిస్తోంది. ఒక్కో సంఘటనా కళ్ల ముందు మెదలుతోంది. పవన్ అప్పటికే ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. సుమిత్ర ఆవేశంగా లేచి వెళ్లి... వినీత్ పుస్తకాలన్నీ తెచ్చి పవన్ ముందు పడేసింది. ‘‘మీకు ఏడాది టైమిస్తాను. వీటన్నింటినీ చదివి పరీక్ష రాయండి. మెడిసిన్లో సీటొచ్చే ర్యాంకు కాదు కదా! కనీసం క్వాలిఫై అవండి’’ అంటున్నప్పుడు ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. సుమిత్రను సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు పవన్. వినీత్ ఆచూకీ తెలియడం లేదు. కనీసం బాడీ కూడా... కన్న పేగు ఆ మాట అనలేక పోతోంది... కానీ కడుపు రగిలిపోతూనే ఉంది, మనసు కుమిలిపోతోంది. వాళ్లిద్దరినీ మార్చి మార్చి చూసిన సైకాలజిస్ట్ ‘‘మీరు డాక్టర్ కావాలనుకుని కాలేకపోయారు, మీ కొడుకు ద్వారా ఆ కోరిక తీర్చుకోవడానికి ఇది రెండున్నర గంటల సినిమా కాదు కదా! జీవితం... మీ అబ్బాయి జీవితం. మీ లక్ష్యాలను అందుకోవడానికి పిల్లలను సాధనాలు చేయడం సబబేనా’’ అంటూ మొదలు పెట్టి గంటన్నర సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్య వ్యాపారంగా మారిన నేపథ్యంలో ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఇంజనీరు లేదా డాక్టరు అయి తీరాలనే టార్గెట్ని పేరెంట్స్ మెదళ్లలో చొప్పించిన వైనం పవన్కు అర్థమవుతోంది. ఆ మాయాజాలంలో పడి వినీత్ గమ్యాన్ని అగమ్యగోచరంగా చేశాననే పశ్చాత్తాపం మొదలైంది.‘‘వినీత్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదో పని చేసుకుని బతుకుతున్నాడా? ఎప్పటికైనా ఇంటికి వస్తాడా’’ ప్రశ్నలు అనుక్షణం ఎదురుగా వెక్కిరిస్తున్నాయి. పరీక్షే జీవితం కాదు! జీవితం అంటే పరీక్షలో రాణించడం ఒక్కటే కాదని పిల్లలకు చెప్పాలి. లైఫ్లో సక్సెస్ అయిన వారిలో స్కూల్ ఫైనల్ ఫెయిలైన వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లు ఒక ఫెయిల్యూర్ తర్వాత జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ఎలా మలుచుకున్నారో, ఎలా రాణించారో వివరించాలి. ఒకసారి పరీక్ష పోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, కోరుకున్న కోర్సులో సీట్ రాకపోయినా ప్రయత్నించడానికి మరో ఏడాది మన చేతుల్లోనే ఉందని చెప్పి వారిని ప్రోత్సహించాలి. కనిపించే లక్షణాలివి! ⇒ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. దేనిమీదా ఆసక్తి ఉండదు. ⇒వాళ్లకు ఇష్టమైనవి వండినా కడుపునిండా తినలేరు. కంటినిండా నిద్రపోలేరు. ⇒తమకిష్టమైన దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఇతరులకిచ్చేస్తుంటారు. ⇒కొన్నాళ్లయినా అమ్మానాన్నలను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఫలితాలు ఆశించిన విధంగా లేనప్పుడు... పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ల ప్రవర్తనలో తేడాను గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ఒంటరిగా వదలకూడదు. – వాకా మంజులారెడ్డి ఇన్పుట్స్: రోష్ని స్వచ్ఛంద సంస్థ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement