-
సిలిండర్పై రూ.2 వడ్డింపు
మళ్లీ పెరిగిన సబ్సిడీ వంటగ్యాస్ ధర న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్(ఎల్పీజీ) ధర మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి సిలిండర్కు రూ.2 చొప్పున ధర పెరిగింది. ఇప్పటివరకు 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.428.59 ఉండగా.. తాజా పెంపుతో ధర రూ.430.64కు చేరింది. డీలర్లకు చెల్లించే కమీషన్ పెంపులో భాగంగా అక్టోబర్ 28నే సిలిండర్కు రూ.1.5 చొప్పున పెంచారు. సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. సిలిండర్కు రూ.37.5 చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దీంతో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.529.50కు చేరినట్లయింది. -
ఎక్కడపడితే అక్కడే
హోటళ్లు, రెస్టారెంట్లు,వెల్డింగ్ షాపులు ‘కమర్షియల్’ అవసరాలకు వంట గ్యాస్ బ్లాకులో అమ్మేసుకుంటున్న డీలర్లు సబ్సిడీ వంట గ్యాస్ ఇళ్లకు బదులు హోటళ్లు, వెల్డింగ్ షాపుల్లో ‘మండిపోతోంది’. పల్లెల్లో కొంతమంది సిలిండర్కు నాలుగైదొందలు ఖర్చు చేయలేకపోవడం... నెలనెలా బుకింగ్లు చేసుకోకపోవడం... డీలర్లకు వరంగా మారింది. ఏడాదికి ఒక్కో కనెక్షన్కూ వచ్చే పన్నెండు సిలిండర్లలో చాలావరకు మిగిలిపోతున్నాయి. వీటిని డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. యథేచ్ఛగా బ్లాకులో అమ్ముకుంటూ రెట్టింపు సొమ్ము గడిస్తున్నారు. - మెదక్ రూరల్ ఒక్కో కుటుంబానికి ఏడాదికి పన్నెండు... నగదు బదిలీ... ఆపై ఆధార్ అనుసంధానం... కంపెనీలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గృహోపయోగ గ్యాస్ వ్యాపార అవసరాలకు తరలిపోతూనేవుంది. మెదక్ పట్టణంలోని ఏ కమర్షియల్ ప్రాం తంలో చూసినా సబ్సిడీ వంట గ్యాసే కనిపిస్తుంది. హోటళ్లు, వెల్డింగ్ షాపులు, కొత్తగా కట్టే మిల్లులు... ఇక్కడా అక్కడని లేదు... ఎక్కడపడితే అక్కడ ఇవే సిలిండర్లు! పక్కదారి... సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఆధార్ కార్డును అనుసంధానం చేసింది. ఒక్కో కనెక్షన్కు ఏడాదికి పన్నెండు చొప్పున సిలిండర్లను పరిమితం చేసింది. పట్టణాల్లో ఇది బానే ఉందిగానీ... గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి చాలామంది సబ్సిడీ గ్యాస్ను ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వం దీపం పథకం కింద గ్రామాల్లోని మహిళా గ్రూప్ సభ్యులకు సబ్సిడీలపై గ్యాస్ను అందిస్తుంది. అయినా గ్యాస్పై వంట చేసేది నూటికి సుమారు 5 శాతం మాత్రమే. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.698. ఇందులో రూ.234 సబ్సిడీ లభిస్తుంది. ఎక్కువగా పేదలు, శ్రామికులు నెలకు సిలిండర్పై ఇంత మొత్తం ఒకేసారి వెచ్చించలేకపోతున్నా రు. దీంతో గ్రామాల్లో చాలావరకు సబ్సిడీ గ్యాస్ మిగిలిపోతోంది. ఇదే డీలర్లకు వరంగా మారింది. వారి పేరున సిలిండర్లను బ్లాక్కు తరలిస్తున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించేవారికి సిలిండర్పై రూ.100 నుంచి 150 వరకు అదనంగా తీసుకుని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెలకు ఐదువేల సిలిండర్లు..! మెదక్ పట్టణంతో పాటు మండలంలో అన్ని కంపెనీలకు కలిపి సుమారు 35 వేల గ్యాస్ కనెక్షన్లున్నాయి. కాగా ఓ డీలర్ నెలకు 5 వేలకు పైగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లోనే విక్రయిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారుల గ్యాస్ పాస్ పుస్తకాలను తన వద్దనే పెట్టుకుని వారి పేర్లపై గ్యాస్ను బుక్చేసి బ్లాక్లో డెలివరీ చేస్తున్నట్టు విశ్వససనీయ సమాచారం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమయ్యే సబ్సిడీ మొత్తంలో కొంత డీలరు తీసుకుంటున్నాడు. మిగిలింది వారికి ఇస్తున్నాడు. పట్టణంలోని ఏ హోటల్లో చూసినా సదరు డీలరు సప్లై చేసే కంపెనీ సిలిండర్లే కనిపిస్తాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి, సిలిండర్లను బ్లాక్మార్కెట్లోకి తరలిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వంట గ్యాస్పై రూ.3 పెంపు
డీలర్ల కమీషన్ పెంపు వల్ల పెరిగిన ధర న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్కు రూ. 3 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సిలిండర్పై డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ను రూ. 40.71 నుంచి రూ. 43.71కు కేంద్రం గత వారం పెంచడంతో ఆ మేరకు సిలిండర్ ధరను పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచే ధర పెంపు అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. అయితే అధికారికంగా ప్రకటించకుండానే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా వంట గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. మరోవైపు డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటాను దాటి వినియోగదారులు కొనుగోలు చేసేవి) 14.2 కేజీల సిలిండర్ ధర సైతం పెరిగింది. ప్రస్తుతం రూ. 880గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 883.50కి చేరింది. కమీషన్ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 13,896 మంది ఎల్పీ జీ డిస్ట్రిబ్యూటర్లకు లబ్ధి చేకూరనుంది. డీలర్ల కమీషన్ను చివరిసారిగా 2013 డిసెంబర్లో సిలిండర్కు రూ. 3.46 చొప్పున పెంచడంతో వారి కమీషన్ రూ. 40.71కి చేరింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement