-
రూ. 2.94 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.2.94 పెరిగింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.505.34కు చేరుకుంది. సబ్సిడీయేతర ఎల్పీజీ ధర సిలిండర్కు రూ.60 పెరిగి రూ. 880కు చేరింది. జూన్ నుంచి సబ్సిడీ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. మార్కెట్లో ఇంధన ధరల ఆధారంగా ఎల్పీజీపై జీఎస్టీని గణిస్తారు. ధరపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్నును మాత్రం మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలి. దీని వల్లే తాజాగా ఎల్పీజీ ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
వెసులుపాటు!
ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కోవడమంటే ఇదే.. గ్యాస్-ఆధార్ అనుసంధాన గడువును పెంచి వెసులుబాటు కల్పించినట్లు ఫోజిలిచ్చిన ప్రభుత్వం అదే చేత్తో సబ్సిడీని లాగేసుకుంది. కొత్త సంవత్సరం రోజే గ్యాస్ ధర భారీగా పెంచేసి వినియోగదారులను గ్యాస్ బండతో బాదిన సర్కారు అక్కడితో ఊరుకోలేదు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి గడువు ఇస్తూనే.. సబ్సిడీ కొనసాగింపు విషయాన్ని ప్రస్తావించకుండా మౌనం వహించింది. ఫలితంగా అనుసంధానం చేసుకోని వారికి డిసెంబర్ 31 తర్వాత నగదు రాయితీ కట్ చేయాలన్న పాత ఉత్తర్వులే వర్తిస్తాయని భాష్యం చెబుతున్న డీలర్లు ఆ మేరకు బిల్లింగ్ కూడా ప్రారంభించేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: ఇప్పటివరకు కేంద్రం, చమురు సంస్థలు ఇచ్చిన వెసలుబాటుతో ఆధార్ అనుసంధానం చేసుకోకపోయినా సబ్సిడీ రేటుకే గ్యాస్ సిలెండర్ అందుకుంటున్న వినియోగదారులకు ఊహించని పిడుగుపాటు. తాజాగా కొత్త సంవత్సరం రోజునే గ్యాస్ ధర పెంచడంతోపాటు అనుసంధాన గడువును ఫిబ్రవరి 28 వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో మరో రెండు నెలలు బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటి వద్దే పూర్తి సబ్సిడీ రేటుకే సిలిండర్ అందుకోవచ్చని ఆశించినవారికి ఈ రెండు నెలలు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ విడిపించుకోవడం పెను భారమే. గడువు పెంచుతూ మొబైల్ ఆదేశాలు జారీ చేసిన చమురు సంస్థలు సబ్సిడీ కొనసాగింపు విషయం మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై స్పష్టత కోసం గురువారం రాత్రి వరకు ఎదురు చూ సిన గ్యాస్ ఏజెన్సీలు.. పాత జీవో ప్రకారం.. అంటే డిసెంబర్ 31లోగా అనుసంధానం చేసుకోని వారికి ఈ నెల నుంచి నగదు సబ్సిడీ ఇవ్వరాదన్న ఉత్తర్వుల అమలకే సిద్ధమయ్యారు. దీని ప్రకారం ఇంతవరకు సబ్సిడీ మొత్తం పోను మిగిలిన సొమ్ము మాత్రమే చెల్లించి సిలిండర్ విడిపించుకుంటున్న వినియోగదారులు, ఈ నెల నుంచి మార్కెట్ ధర ఎంతుంటే అంతా చెల్లించి విడిపించుకోవాలి. జిల్లాలో ఇప్పటికీ ఆధార్ అనుసంధానం చేసుకోని 63,122 మందికి ఇది పెనుభారం కానుం ది. సగటున నెలకు * 5.05 కోట్ల అదనపు భారం పడింది. ఈ మేరకు శుక్రవారం నుంచి గ్యాస్ ఏజెన్సీలు బిల్లింగ్ ప్రారంభించాయి. జిల్లాలో 2,95,487 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 63,122 మంది ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా విశిష్ట సంఖ్యతో కూడిన కార్డులు ఇంకా జారీ కాకపోవడం వంటి కారణాలకు తోడు ఆధార్ను బ్యాంకు ఖాతాకు జత చేయడంలో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరి కూడా అనుసంధానం లో జాప్యానికి దారి తీస్తోంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా అనుసంధానం చేసుకోలేదన్న సాకుతో సబ్సిడీ కట్ చేయడం దారుణమని వినియోగదారులు వాపోతున్నారు. ఇక నుంచి చెల్లింపులు ఇలా.. కొత్త బిల్లింగ్ ప్రకారం సిలిండర్ ధర వసూలు చేసే విధానం ఇలా ఉంటుంది. జనవరి ఒకటికి ముందు ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు సబ్సిడీ మినహాయించి రూ.411కే సిలిం డర్ అందజేసేవారు. కొత్త విధానంలో సబ్సిడీ ఉండదు కను క.. పెంచిన ధరతో కలుపుకొని మొత్తం రూ.1316 చెల్లిస్తేనే సిలిండర్ అందజేస్తారు. అంటే ఒక్కసారి రూ.905 భారం పడిందన్నమాట. ఇక ఇప్పటికే అనుసంధానం చేసుకొని నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చిన వారు సిలిండర్ విడిపించుకున్నప్పుడు పూర్తి సొమ్ము చెల్లిస్తే.. సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాకు జమ అవుతున్న విషయం తెలిసిందే. ధర పెరిగిన నేపథ్యంలో సిలిండర్ విడిపించుకున్నప్పుడు 1316 చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం 800 వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఈ లెక్కన వీరికి రూ.516కే గ్యాస్ అందుతుందన్నమాట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement