-
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్దేవ్లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్చంద్రదేవ్ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ - సుజయకృష్ణ రంగారావు
-
వెనక్కు తగ్గిన మంత్రి?
♦ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షి కథనాలపై వివరణ ఇచ్చుకున్న సుజయ్కృష్ణ రంగారావు ♦ పార్టీ తలదించుకునే పరిస్థితి రానీయనంటూ వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: బొబ్బిలి రాజవంశీయుడు, రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఆర్వీ సుజయ కృష్ణ రంగారావు గిరిజనులకిచ్చిన భూములను లాక్కునే యత్నాలపై ఆలోచనలో పడ్డారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద గిరిజనులకు పూర్వీకులు పంపిణీ చేసిన భూములను మంత్రి సుజయ్ వెనక్కు లాక్కోవడానికి చేస్తున్న కుట్రలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వరుస కథనాల ఆధారంగా విపక్షాలు సైతం మంత్రి చర్యలపై మండిపడ్డాయి. స్వపక్షంలోనూ మంత్రికి మద్దతుగా నిలిచేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పై పెచ్చు కొత్తగా పార్టీలోకి వచ్చి మంత్రి పదవి సైతం దక్కించుకున్న సుజయ కృష్ణ రంగారావు టీడీపీకి జిల్లాలో చెడ్డపేరు తీసుకువస్తున్నారనే విషయాన్ని ఆ పార్టీ జిల్లా నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. భూముల దందాపై ఇంటా బయటా అభాసుపాలయిన మంత్రి ఆలోచనలో పడ్డారు. దీనిపై తెలుగు దేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తను తప్పు చేయనని, పార్టీకి తలవంపులు తెచ్చే పని చేయనంటూ ‘సాక్షి’ కథనాలపై ఆయనిచ్చిన వివరణ గిరిజన రైతుల భూముల జోలికి వెళ్లనని పరోక్షంగా ప్రకటించినట్టయింది. కుటుంబ సభ్యుల్లాంటి నాయకులు, కార్యకర్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందంటూ, బొబ్బలిలో గిరిజనుల భూములు లాక్కుంటున్నానని ‘సాక్షి’ వారం రోజుల పాటు వార్తలు రాశారన్నారు. నాకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ముచేయనని చెప్పుకున్నారు. నా వల్ల పార్టీకి, ప్రభుత్వానికీ తలదించుకునే పరిస్థితి రాదన్నారు. సాక్షి కథనాలు ప్రస్తావిస్తూ నీళ్లు తాగిన మంత్రి! మంత్రి రంగారావు వైఖరిని ఎండగడుతూ ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై వారం రోజులుగా నోరు మెదపని ఆయన ఆదివారం ఆ కథనాలపై వివరణ ఇచ్చేందుకు సైతం తడబడ్డారు. సాక్షి పేరును, కథనాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన గద్గద స్వరంతో మాట్లాడుతుండటాన్ని గమనించిన పార్టీ నాయకులు వెంటనే మంచినీళ్ల బాటిల్ను అందించారు. నీళ్లు తాగిన అనంతరం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తానికి ‘సాక్షి’ కథనంపై తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సుజయ్ ప్రస్తావించడాన్ని కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘సాక్షి’ పుణ్యాన మంత్రి వివరణ ఇచ్చారని, గిరిజనులకు న్యాయం జరుగుతుందన్న చర్చ టీడీపీ క్యాడర్తో పాటు జిల్లా ప్రజల్లో జోరందుకుంది. -
మాపై సుజయకృష్ణా రంగారావు విమర్శలా?
విజయనగరం: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిల్లాలో తోటపల్లి, పెద్దగెడ్డ సహా ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బొబ్బిలిలో మూతపడ్డ పరిశ్రమలనే సుజయకృష్ణ రంగారావు తెరిపించలేకపోయారన్నారు. పైగా వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేస్తున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. అంతేకాకుండా విజయనగరంలో జూనియర్ కాలేజీని తీసుకు వచ్చింది కూడా తామేనని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన భూములను కాపాడుకునేందుకే సుజయకృష్ణా రంగారావు పార్టీ మారారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు ఇవ్వలేక కోట నుంచి పారిపోయిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేసే అర్హత సుజయకృష్ణా రంగారావుకు లేదని అన్నారు. -
'ప్రాణమున్నంతవరకూ వైఎస్ జగన్తోనే'
►పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం ►కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు ►జిల్లాలోని ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరు ► స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనం కోసమే కొందరు పార్టీ మారారు ► పార్టీ వీడినవారు పదవులకు రాజీనామా చేసి గెలివాలి ► ఫిరాంయిపుల చట్టంలో మార్పులు చేయాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బొబ్బిలి: గత ఎన్నికల్లో వైఎస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కలసి నడుస్తామని పార్టీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, శ్రీవాణి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, బేబినాయిన తదితరులతో కలసి వారు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో... సీఎం చంద్రబాబు ఏపీలో వైఎస్సార్సీపీ విషయంలో అలా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. వివరణ తీసుకుని కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసత్య ప్రచారం చేసిందని, మరోసారి అసత్య ప్రచారం చేస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. టీడీపీకి చెందిన వారు తిరిగి తమ గూటికి చేరుకున్నారే తప్ప కొత్తవారెవరరూ వైఎస్సార్సీపీని వీడలేదన్నారు. పార్టీలు మారినప్పడు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకోవాలని, ప్రస్తుతం పార్టీ ఫిరాయించినవారు అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలకు కాలపరిమతి లేకపోబట్టే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement