-
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం ఎనిమిది మంది మృతిచెందారు. నిండ్ర వుండలం నెట్టేరి ఆదిఆంధ్రవాడకు చెందిన మునస్వామి భార్య చెంగవ్ము(56) సోమవారం ఇంటి నుంచి రోడ్డుపై నడిచి వెళుతుండగా స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఆమె మృతిచెందింది. ఆరూరు గ్రామానికి చెందిన నాగతర్నవ్ము (67) వుంగళవారం వుధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వస్తుండగా కుప్పకూలిపోరుుంది. ఇంటికి తీసుకెళుతుండగా చనిపోయింది. నారాయణవనం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిగకు చెందిన రాధాకృష్ణయ్య(56) ఎండ తీవ్రతతో నాలుగు రోజులుగా నీరసంగా ఉండి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇప్పన్తాంగాళ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ(64) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐరాల మండలం మెటకంపల్లె గ్రామానికి చెందిన మునార్సాహెబ్ (60) ఐస్ వ్యాపారం చేసేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స చేశారు. మంగళవారం వేకువజామున మరణించాడు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య(45) మంగళవారం ఉదయం కూలి పనులకెళ్లాడు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామచంద్రాపురం మండలం పాతకందులవారిపల్లి పంచాయతీ ఐఏవైకాలనీకి చెందిన కె.చిన్నసామి(70) కూలి పని చేసుకుని జీవించేవాడు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్మపల్లి పీహెచ్ సీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరదయ్యుపాళెం వుండలం పెద్దపాండూరు గ్రామానికి చెందిన గిరి(40) వుంగళవారం ఉదయుం పొలంలో దుక్కిదున్నుతుండగా వడగాల్పులకు సృ్పహ తప్పిపడిపోయూడు. సూళ్ళూరుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
కాశిబుగ్గ : వడ గాల్పులకు, ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో ఆదివారం తొమ్మిది మంది మృతి చెందారు. వివారాలు... వరంగల్ 16వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన జన్ను అరుణ(25) వడదెబ్బకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. శనివారం కూలీకి వెళ్లి అరుణ పని చేస్తూ ఎండ వేడి తాకిడికి గురై అస్వస్థతకు గురైంది. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. కరీమాబాద్ : కరీమాబాద్ దసరా రోడ్లోని అప్పాల రాజుకుమార్(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న రాజుకుమార్ ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. చెన్నారావుపేట: వుండలంలోని పాత వుగ్దుం పురం గ్రావూనికి చెందిన దొనికల భద్రవ్ము (65) వంట చెరుకు కోసం బయుటికి వెళ్లింది. దీంతో వడదెబ్బకు గురై వుృతి చెందింది ఇప్పగూడెం(స్టేషన్ఘన్పూర్): మండలంలోని ఇప్పగూడెంకు చెందిన బట్టమేకల ఆగమ్మ (90) వడదెబ్బతో మృతిచెందింది. ఆమె ఆది వారం ఉదయం అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందింది. నెల్లికుదురు : మండలంలోని వావిలాల గ్రా మానికి చెందిన ఎరుకొండ పరమేష్ (23) వడ దెబ్బతో మృతిచెందాడు. పరమేష్ గౌడ కుల స్తులకు కథలు చెప్పుకుంటూ జీవనం సాగి స్తుంటాడు. ఈ క్రమంలో కతలు చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో ఆదివారం వడ దెబ్బకు గుైరె అస్వస్థతకు గురయ్యూడు. చికిత్స నిమిత్తం 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. డోర్నకల్: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని దాన్యా తండాకు చెందిన కేలోతు హరి(60) వడ దెబ్బతో మృతి చెందాడు. హరి కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామంలో మబ్బు సిద్దయ్య (55) వడదెబ్బతో మృతి చెందాడు. సిద్దయ్య ఇంటి వద్ద ఇంకుడు గుంత తీస్తుండగా తీవ్రమైన ఎండతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మన్సాన్పల్లి(బచ్చన్నపేట): మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన శాకంపల్లి మల్లారెడ్డి (75) వడదెబ్బతో మృతిచెందాడు. మల్లారెడ్డి రోజూ ఉదయం, సాయంత్రం బావి వద్దకు వెళ్లి వచ్చే వాడు. రోజూ మాదిరిగానే ఆయన ఆదివారం బావి వద్ద వెళ్లి వచ్చి అస్వస్థతకు గురి కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకపోతుండగానే మృతి చెందాడు. -
వడదెబ్బకు ఆరుగురి మృతి
భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మేర కు ఎండతీవ్రత కారణంగా శనివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ఆరుగురు వడదెబ్బకు గురై మృతిచెందారు. మద్దూరు : మండల కేంద్రానికి చెందిన ఇట్టబోరుున సిద్ధిరాములు (68) వడదెబ్బతో మృతి చెందాడు. ఇంటివద్ద ఉంటున్న ఆయన వడగాలులకు తీవ్ర కు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. గుండ్రాతిమడుగు (కురవి) : మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) గ్రామానికి చెందిన కుంచం వెంకటేశ్వర్లు(49) వడదెబ్బతో మృతి చెందాడు. పని నిమిత్తం బయటకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మడికొండ : హన్మకొండ మండలంలోని మడికొండ గ్రామానికి చెందిన కొలిశెట్టి నర్సమ్మ(64) వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం కూలీ పనులకు వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములుగు : మండలంలోని కాసీందేవిపేటకు చెందిన సల్లూరి రవి (42) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి శుక్రవారం ఉదయం కూలీపనికి వెళ్లాడు. అరుుతే ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్కు చెందిన గుమస్తా వడికిచెర్ల రాజన్బాబు (52) వడదెబ్బతో మృతి చెందాడు. రాజన్బాబు మూడు రోజుల క్రితం తన కూతురు వివాహం చేశాడు. అరుుతే ఆ సమయంలో పెండ్లి పనుల్లో భాగంగా ఎండలో తిరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పరిధిలోని తూర్పుకోటకు చెందిన వ్యవసాయ కూలి మేకల కుమార్(38) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోజు మాదిరిగా భార్యతో కలిసి కూలీకి వెళ్లిన ఆయన సాయంత్రం వడదెబ్బకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. కాగా, శనివారం ఉదయం కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. -
వడదెబ్బతో 23 మంది మృతి
రోజురోజుకు ఎండలు పెరుగుతుండగా.. జిల్లా లో శుక్రవారం వడదెబ్బ కారణంగా 23 మంది మృతి చెందారు. పోచమ్మమైదాన్ : నగరంలో కొత్తవాడకు చెంది న క్యాతం లింగయ్య(85) ఆటోనగర్లో పనిచేస్తాడు. ఎండలు వేడిగాలులు బాగా ఉండడంతో వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. వెల్దండ(నర్మెట) : మండలంలోని వెల్దండకు చెందిన కొలిపాక రజిత(35) వ్యవసాయం భర్త తో కలిసి వ్యవసాయం చేస్తుండగా, గురువారం బావి వద్దకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వెంటనే ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అరుునా తగ్గకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. నర్సంపేట రూరల్ : వుండలంలోని దాసరిపల్లికి చెందిన వుండల కొవుురవ్ము(68) ఉపాధి కూలీకి వెళ్తోంది. ఈక్రమంలో అస్వస్థతకు గురి కాగా, చికిత్స చేరుుస్తుండగా వుృతి చెందింది. ధర్మసాగర్ : గ్రామానికి చెందిన ఆవుల కొ మురమ్మ(80) వడదెబ్బకు గురైంది. ఈ మేరకు గురువారం రాత్రి తన ఇంట్లో మృతి చెందింది. కాశిబుగ్గ : వరంగల్ వివేకానంద కాలనీకి చెందిన దేవర రాజమణి-కిషోర్ కుమార్తె, ఏడో తరగతి విద్యార్థి హరిత(12) ఆడుకునే క్రమం లో గురువారం వడదెబ్బకు గురైంది. కుటుంబ సభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొం దుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఏటూరునాగారం : మండలంలోని గుర్రెవులకు చెందిన పూజారి బుసయ్య(65) మిరప కళ్లం వద్ద కూలీకి వెళ్లాడు. అక్కడ ఎండదెబ్బకు గురైన ఆయనకు గురువారం రాత్రి వాంతులు, విరోచనాలు కాగా, శుక్రవారం మృతి చెందాడు. రాజోలు(కురవి) : రాజోలుకు చెందిన పడా ల వర్ధయ్య(50) చేను వద్దకు వెళ్తుండగా ఎండవేడితో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికు లు ఊరికి తీసుకొస్తుండగా మృతి చెందాడు. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు చోక్లా తండకు చెందిన గుగులోత్ సోమ్లా-భద్రి కుమా ర్తె ఐశ్వర్య(12) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. వారంగా ఎండ తీవ్రత వల్ల ఐశ్వర్య అస్వస్థతకు గురైన ఆమెను శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నెక్కొండ : మండల కేంద్రానికి చెందిన కొంకాల సాయిలు(66) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. సాయిలుకు నలుగురు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురు ఉదయ తలకొరివి పెట్టింది. అలాగే, సాయిరెడ్డిపల్లికి చెందిన గునుగుంట్ల వెంకటేశ్వర్లు(45) వడదెబ్బకు గురికాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ తరలించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పెద్దకొర్పోలుకు చెందిన బండారి కమలమ్మ(72) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందింది. చిట్యాల : మండలంలోని జూకల్లు గ్రామానికి చెందిన మేకల వీరస్వామి(70) వడదెబ్బకు గురై శుక్రవారం వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చిట్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మడికొండ : హన్మకొండ మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. వనమాలకనపర్తి గ్రామానికి చెందిన తంపుల రామయ్య(70), మడికొండ గ్రామానికి చెందిన బొల్లికొండ రాజు(50) శుక్రవారం మృతి చెందాడు. మద్దూరు : మండలంలోని ధూల్మిట్టకు చెంది న రైతు తుషాలపురం రాజయ్య(64) వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు చికిత్స పొందు తూ మృతి చెందాడు. చెన్నారావుపేట : వుండలంలోని పాపయ్యుపేటకు చెందిన ఉప్పుల భద్రవ్ము(58) వ్యవసా యు పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెం దింది. అలాగే, ఖాధర్పేట గ్రావు శివారులోని గొల్లపెల్లెకు చెందిన వజినపల్లి సుదర్శన్(60) కిరాణం సామగ్రి తెచ్చేందుకు వెళ్తూ వడదెబ్బకు గురై వుృతి చెందాడు. డోర్నకల్ : డోర్నకల్ యాదవనగర్కు చెంది న ఎర్రబోయిన రాములు(70) తీవ్ర ఎండలతో గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం చికిత్స చేయించే ప్రయత్నాలు చేస్తుండగా మృతి చెందాడు. భూపాలపల్లి : భూపాలపల్లి నగర పంచాయ తీ జంగేడు శివారు కాకతీయకాలనీలో నివాసముండే వైనాల సదయ్య(50) చేపలు పెంచుకుంటూ జీవనం సాగించేవాడు. గురువారం ఉ దయం నుంచి సాయంత్రం వరకు చెరువు వద్దే ఉన్న ఆయన వడదెబ్బకు గురై మృతి చెందాడు. చింతలపల్లి(సంగెం) : మండలంలోని చింతలపల్లికి చెందిన దుడ్డె వెంకటలక్ష్మి(70) గురువారం పొలం వద్దకు వెళ్లింది. అక్కడ వడదెబ్బకు గురైన ఆమె శుక్రవారం మృతి చెందింది. పరకాల : ధర్మారానికి చెందిన గొర్ల కాపరి చిన్న సమ్మయ్య(48) గొర్లను మేపడానికి వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు నిద్రలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాల్నగర్(బచ్చన్నపేట): మండలంలోని చిన్నరామన్చర్ల శివారు గోపాల్నగర్లో గంగంరబోయిన బిక్షపతి(60) వడదెబ్బతో మృతి చెం దాడు. గురువారం కూలీకి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలం గోపరాజుపల్లికి చెందిన వాటర్మెన్ పెరుమాం డ్ల కిషన్ వడదెబ్బతో మృతి చెందాడు. గొర్రెలు మేపడానికి వెళ్లి ఆయన ఎండ కారణంగా వడదెబ్బ బారిన పడ్డాడు. -
వడదెబ్బతో 13 మంది మృతి
ఉదయం ఏడు దాటుతుండగానే నడినెత్తిపైకి వస్తున్న సూర్యుడు, మండుతున్న ఎండలు.. ఫలితంగా వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడి గాలులు తట్టుకోలేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు సోమవారం వడదెబ్బ కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతి చెందారు. మడికొండ : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్లోని బాలజీనగర్కు చెందిన దేవర మణేమ్మ (60) ఆదివారం పని కి వెళ్లింది. సోమవారం ఉదయం తర్వాత వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాజీపేట : కాజీపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై తిలక్నగర్కు చెందిన గొర్రె దర్గమ్మ(52), బాలాజీనగర్ చెందిన దేవర మీనమ్మ(65) మరణించారు. కరీమాబాద్ : వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిట్ట పుల్లమ్మ(80) వడదెబ్బతో తీవ్ర అస్వస్తతకు గురై సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసముద్రం : ఇనుగుర్తికి చెందిన లింగాడపు వెంకన్న(35) కొద్దిరోజులుగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు. చేర్యాల : వేచరేణికి చెందిన మాదాసు చంద్రమ్మ(60) రోజు వారిలాగే వ్యవసాయ కూలీగా వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమ్మ మృతి చెందింది. నాగిరెడ్డిపల్లి(బచ్చన్నపేట) : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దేవరాయ కనుకయ్య(35) ఆదివారం వ్యవసాయ బావి వద్దకు పనుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చి అనారోగ్యంగా ఉందని అన్నం తినకుండానే పడుకున్నాడు. ఉదయం ఆటోలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు. నర్సింహులపేట: మండలంలోని బీరిశెట్టిగూడెంలో సూరబోయిన కిష్టయ్య(65) వడదెబ్బకు మృతి చెందాడు. ఎండ వేడిమి తీవ్ర అస్వస్తతకు గురైన కిష్టయ్య స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని కంకరబోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సీఐ శేర్ వెంగళయ్య(85) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. దేశాయిపల్లి(దుగ్గొండి) : మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల అయిలయ్య(65) ఇంటి వద్ద రేకులషెడ్డులో నివసిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రంతా ఇంటి వద్ద చికిత్స అనంతరం ఉదయం వరంగల్కు తరలిస్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన బక్క భాస్కర్(30) జనగామలో ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. ఇంటి వద్ద వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ పరిస్థితి తగ్గుముఖం పట్టలేదు. సోమవారం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి గత ఏడాదే వివాహమైంది. స్టేషన్ఘన్పూర్ టౌన్ : మండల కేంద్రానికి చెందిన గట్టు మైసయ్య(65) స్థానికంగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం పనికి వెళ్లిన అతడు రాత్రి ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీరు తాగి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఏటూరునాగారం : మండలంలోని ముల్లకట్టకు చెందిన గడిగ సమ్మక్క (75) పొలం పనుల కోసం ఎండలో తిరగడంతో ఆదివారం రాత్రి వడదెబ్బ తాకింది. ఆమె అపస్మార్థక స్థితికి చేరుకొని సోమవారం వేకువజామున మృతి చెందింది
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement