-
సన్ లైఫ్ గ్లోబల్ విస్తరణ బాట
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్(ఎస్ఎల్జీఎస్) తాజాగా పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రానున్న రెండేళ్లలో 700 మందిని ఉద్యోగాలలోకి తీసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా నాలెడ్జ్ సరీ్వసులు, బిజినెస్ సరీ్వసులు అందిస్తోంది. ప్రధానంగా కెనడియన్ దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ ఇంక్కు సేవలు సమకూరుస్తోంది. ఇండియా, ఫిలిప్పీన్స్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ప్రస్తుతం 5,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. దేశీయంగా 3,000 మందితో రెండు కేంద్రాల నుంచి, 2,000 మంది ఉద్యోగులతో కెనడా నుంచి సన్ లైఫ్ఫైనాన్షియల్కు తోడ్పాటునిస్తోంది. ఈ రెండు దేశాలలోనూ కలిపి 2025కల్లా మొత్తం 1,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు ఎస్ఎల్జీఎస్ ఎండీ తరుణ్ సరీన్ తెలియజేశారు. 2022కల్లా సన్ లైఫ్ ఫైనాన్షియల్ నిర్వహణలోని ఆస్తులు 1.33 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
పన్ను ఆదా కోసం ఈక్విటీ పథకం
న్యూఢిల్లీ: అధిక రిస్క్ తీసుకునేందుకు సంసిద్ధులై ఉండి, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న వారు, అదే సమయంలో పన్ను ఆదా చేసుకోవాలనుకుంటే అందుకు ఆదిత్య ‘బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96’ ఓ ఎంపిక అవుతుంది. ఇదొక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్). ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడులపై ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకి న్ పీరియడ్ ఉంటుంది. పనితీరులో ఈ పథకం బెంచ్మార్క్ కంటే ముందుండడం ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. సెబీ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ సేవింగ్స్ పథకా న్ని ఇందులో విలీనం చేసింది. ఎందుకంటే విలీనం చేసిన పథకం నిర్వహణలోని ఆస్తులు కేవలం రూ.27 కోట్లే. ఏబీఎస్ఎల్ ట్యాక్స్ రిలీఫ్96 పథకం నిర్వహణలో రూ.6,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పనితీరు ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ బీఎస్ఈ 200. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 14.4 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 13.4 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 12.9 శాతం, ఐదేళ్లలో 24.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఏబీఎస్ఎల్ ట్యాక్స్ రిలీఫ్96 పథకం అందించింది. ఇక బెంచ్ మార్క్ రాబడులు మూడేళ్ల కాలంలో 12.1 శాతం, ఐదేళ్లలో 18.4 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాలంలో చూసుకుంటే ఈ పథకం పనితీరు పోటీ పథకాలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ సేవర్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ పథకాల కంటే కూడా మెరుగ్గా ఉంది. 2012, 2014, 2017 మార్కెట్ ర్యాలీల సమయాల్లోనూ మంచి పనితీరును చూపించింది. అన్ని వేళలా దాదాపు 95 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లోనే కొనసాగిస్తుంటుంది. మల్టీక్యాప్ విధానంలో అన్ని రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన స్టాక్స్ మధ్య పెట్టుబడులను విభజిస్తుంది. మరో ముఖ్యమైన విషయం 2006 నుంచి ఈ పథకాన్ని అజయ్గార్గ్ అనే ఫండ్ మేనేజరే నిర్వహిస్తుండడం. సూక్ష్మదృష్టితో స్టాక్స్, రంగాలను ఎంపిక చేసుకోవడం ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండడానికి కారణం. పోర్ట్ఫోలియోలోని సుందరం క్లేటాన్, గిల్లెట్ ఇండియా మల్టీబ్యాగర్ రాబడులను ఇచ్చాయి. అలాగే, హానీవెల్ ఆటోమేషన్స్ కూడా. ఈ స్టాక్లో ఇప్పటికీ ఐదు శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్లో పెట్టుబడులు ర్యాలీ సమయాల్లో రాబడుల ఆర్జనకు మద్దతుగా నిలిచాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం మొత్తం పెట్టుబడుల్లో 97 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇటీవలి కాలంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో కరెక్షన్ చోటు చేసుకున్నప్పటికీ, ఆయా విభాగాల్లోని పెట్టుబడులను కదిలించకుండా అలాగే కొనసాగించింది. ప్రస్తుతం మిడ్ క్యాప్స్లో 23 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉండడం వల్ల కరెక్షన్ చోటు చేసుకున్నప్పటికీ రికవరీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ మొదలైతే ఎక్కువగా ప్రయోజనం పొందనుంది. -
బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి, కెనడాకు చెందిన సన్లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని ఆదిత్య బిర్లా నువో సోమవారం పూర్తి చేసింది. ఈ అదనపు వాటాను తమ జాయింట్ వెంచర్ భాగస్వామి, కెనడాకు చెందిన సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్ఎల్) బీఎస్ఈకి నివేదించింది. దీంతో బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.7,235 కోట్లుగా ఉంది. వాటా విక్రయంతో తమ నికర రుణ భారం గణనీయంగా తగ్గుతుందని ఏబీఎన్ఎల్ పేర్కొంది. డీల్ తర్వాత బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్లో ఆదిత్య బిర్లా నువోకు 51 శాతం, సన్ లైఫ్ ఫైనాన్షియల్కు 49 శాతం చొప్పున వాటాలుంటాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement