-
ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్ హెల్దీ సూపర్ ఫుడ్గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీకృతమైందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మనుషుల ఆరోగ్యానికే కాకుండా భూగోళం ఆరోగ్యానికి కూడా దోహదపడే అసలైన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలేనని జీ20 తదితర అంతర్జాతీయ వేదికల్లోను, దేశీయంగాను చాటి చెప్పటంలో మన దేశం విజయవంతమైందని అంటూ, భవిష్యత్తులో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి చిరుధాన్యాలు- ఇప్పుడు, తర్వాత’ అనే అంశంపై నొవోటెల్ హోటల్లో రెండు రోజుల అంతర్జాతీయ చిరుధాన్యాల సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థలోని న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డా. సురేశ్ కుమార్ చౌదరి అధ్యక్షతవహించారు. దేశంలో చాలా రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ప్రారంభించాయని, ప్రజలు నెమ్మదిగా చిరుధాన్యాల వినియోగం వైపు మళ్లుతున్నారన్నారు. అయితే, చిరుధాన్యాల రైతులకు మరింత ఆదాయాన్ని అందించే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2023 తర్వాత కాలంలో చిరుధాన్యాలు మన ఆహారంలో మరింతగా భాగం కావాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రభుత్వేర సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు ఆహార కంపెనీలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని డా. సురేశ్ కుమార్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి చిరుధాన్యాల పుట్టిల్లు భారత్: ఎఫ్.ఎ.ఓ. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) భారత్ ప్రతినిధి టకయుకి హగివర ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలకు భారత్ పుట్టిల్లని, చిరుధాన్యాల వాణిజ్యానికి భారత్ మూలకేంద్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. క్లైమెట్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రతలను అధిగమించడానికి చిరుధాన్యాలు ఉపకరిస్తాయని భారత్ ప్రపంచానికి శక్తివంతంగా చాటిచెప్పిందన్నారు. ఐసిఎఆర్, ఐఐఎంఆర్ చేసిన కృషి అనితరసాధ్యమైనదన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఆహార వాణిజ్యంలో దిగ్గజాల్లాంటి బహుళజాతి కంపెనీలు కూడా చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నాయన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి చిరుధాన్యాలతో కూడిన సుస్థిర వ్యవసాయం దోహదం చేస్తుందన్నారు. రైతులకు దక్కుతున్నది స్వల్పమే చిరుధాన్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 300కుపైగా అధునాతన, వినూత్న ఆహారోత్పత్తులను ఉత్పత్తి చేసే సాంకేతికతలను రూపొందించటంలో హైదరాబాద్లోని ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ విశిష్ట ప్రాతను పోషించిందని, ప్రపంచానికే ఇది మార్గదర్శకమని ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. డి.కె. యాదవ్ తెలిపారు. గతంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసేవారమని, ఇప్పుడు అధునాతన తినుబండారాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందన్నారు. అయితే, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను అమ్మి వ్యాపారులు సంపాదించే మొత్తంలో 15-20% మాత్రమే చిరుధాన్యాల రైతులకు దక్కుతున్నదని, కనీసం 50% దక్కేలా విధానపరమైన చర్యలు తీసుకోగలిగితే చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తుందన్నారు. రూ. 250 కోట్లతో ఐఐఎంఆర్ను అంతర్జాతీయ చిరుధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేశామని డా. యాదవ్ వివరించారు. వరి, గోధుమలకు దీటుగా రైతులకు ఆదాయాన్నందించేలా అధిక దిగుడినిచ్చే 9 రకాల చిరుధాన్యాల వంగడాలను అందుబాటులోకి తెచ్చామని, సర్టిఫైడ్ సీడ్కు కొరత లేదన్నారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సి. తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాలను పెద్దలతో పాటు పిల్లలు, యువత కూడా ఇష్టంగా తినేలా వినూత్న ఉత్పత్తులను న్యూట్రిహబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో ప్రయోగాత్మక సాగులో మేలైన జొన్న వంగడాల ద్వారా హెక్టారుకు 7-8 టన్నుల జొన్నల దిగుబడి సాధించినట్లు తెలిపారు. గుజరాత్లో బంగాళదుంపలు సాగు చేసిన తర్వాత ఆ పొలాల్లో హెక్టారుకు 7-8 టన్నుల సజ్జ దిగుబడి వచ్చిందన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత చిరుధాన్యాలకు పునర్వైభవం రానుందన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈఓ డా. బి. దాయకర్రావు ప్రసంగిస్తూ గతంలో చిరుధాన్యాలు కొనే వారే ఉండేవారు కాదని, ఇప్పుడు కొందామంటే 40% మేరకు కొరత ఏర్పడిందన్నారు. న్యూట్రిహబ్ ద్వారా వినూత్న ఉత్పత్తులు తయారీలో స్టార్టప్లకు, ఆహార కంపెనీలకు ప్రపంచంలోనే ఎక్కడా లేని అధునాతన సాంకేతికతను అందిస్తున్నందున ఎగుమతులు పెరిగాయని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన వైపే చూస్తున్నాయన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చేలా స్టార్టప్లు, కంపెనీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపుదలకు విశిష్ట కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, స్టార్టప్లు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ‘పోషక్ అనాజ్’ జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ పివి వరప్రసాద్, డా. జీవీ రామాంజనేయులు, డా. హేమలత, డా. మీరా తదితరులతో పాటు ‘సాక్షి సాగుబడి’ సీనియర్ న్యూస్ఎడిటర్ పంతంగి రాంబాబు ఉన్నారు. మంగళవారం కూడా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నోవోటెల్లో ఏర్పాటైన స్టాళ్లలో సుమారు 200 స్టార్టప్లు చిరుధాన్యాల ఆహారోత్పత్తులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
స్పిరులినా సాగు!
♦ పలమనేరులో తొలి యూనిట్ స్థాపన ♦ నెలకు రూ. 80 వేల నికరాదాయం ఉద్యోగాలు కోరే వారు కాదు... ఉద్యోగాలు ఇచ్చేందుకు యువత నడుంబిగిస్తేనే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందనే అబ్దుల్ కలాం మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువ ఇంజినీర్. ప్రజోప యోగమైన గొప్పదేదైనా సాధించాలన్న తపన అతన్ని తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగా సూపర్ ఫుడ్ స్పిరులినా అనే నాచు సాగును చేపట్టేలా పురికొల్పింది. బాలారిష్టాలను అధిగమించి ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ.. యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కార్తీక్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని నెల జీతం కోసం పనిచేయడం అతనికి ఇష్టం లేదు. ఏదైనా కొత్త పని చేసి నలుగురికీ ఉపాధి కల్పించే స్థితిలో తానుండాలనుకున్నారు. రెండేళ్లపాటు తపించారు. ఆయన అన్వేషణ ఫలించింది. మంచినీటిలో పెరిగే ఒక రకమైన ఆకుపచ్చని నాచు ‘స్పిరులినా’ను చిన్న చిన్న మడుల్లో సాగు చేసే పనిని ప్రారంభించారు. అంతర్జాలంలో శోధించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఏడాది క్రితం గుడియాత్తం రోడ్డు పక్కన రాష్ట్రంలోనే తొలిగా స్పిరులినాను ఉత్పత్తి చేసే యూనిట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారయ్యే డ్రై స్పిరులినాను చైన్నైలోని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, పొడులు తయారు చేసే ఓ కంపెనీకి విక్రయిస్తున్నారు. నెలకు రూ. 80 వేల నికరాదాయం ఈ యూనిట్ నిర్మాణం కోసం కార్తీక్ రూ. 8.90 లక్షలు ఖర్చు చేశారు. నెలకు 2 క్వింటాళ్ల ఎండిన స్పిరులినాను ఉత్పత్తి చేస్తున్నారు. చెన్నై కంపెనీకి క్వింటాల్ రూ. 65 వేల చొప్పున విక్రయిస్తున్నారు. క్వింటాల్కు రూ. 25 వేల ఖర్చు పోను నెలకు రూ. 80 వేల నికరాదాయం లభిస్తోంది. స్పిరులినాను అధిక పోషక విలువలు కలిగిన ఆహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 20 గ్రాముల స్పిరులినాను ట్యాబ్లెట్లు లేదా పొడి రూపంలో తీసుకుంటే మూడు పూటలా భోజనం ద్వారా ఒనగూడే దానికి సమానమైన శక్తి లభిస్తుంది. పోషకాహార లోపం కలిగిన గర్భవతులు, పిల్లలకు ఇది మంచి పోషకాహారం. షుగర్, క్యాన్సర్, హెచ్ఐవీ రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. కొలెస్ట్రాల్, క్యాల్షియం స్థాయిలను పెంచుతుంది. ప్రొటీన్ పాళ్లు చాలా ఎక్కువ. అంతరిక్ష యాత్రికుల ఆహారంలోనూ స్పిరులినా ఓ ముఖ్య భాగం. - సుబ్రమణ్యం పిచ్చిగుంట్ల, సాక్షి, పలమనేరు భవిష్యత్ స్పిరులినాదే.. ఇండియాలో ఉత్పత్తి అవుతోన్న సగం విటమిన్ పౌడర్ల తయారీలో దీన్ని వాడుతున్నారు. విదేశాల్లో అయితే క్యాప్సూల్స్ గానూ జ్యూస్లు, బర్గర్, పిజ్జాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మనం తీసుకునే 500 గ్రాముల ఆహారం వల్ల 30 నుంచి 40 పీవీ(ప్రొటీన్ వ్యాల్యూస్) లభిస్తుంది. అదే స్పిరులినా రోజుకు 20 గ్రాములు తీసుకుంటే 70 పీవీ లభిస్తుంది. విదేశాల్లో దీనికి గిరాకీ ఎక్కువగా ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు ఆదరణ బావుంటుంది. - నర్సింహులు కార్తీక్ (81259 29939), పలమనేరు, చిత్తూరు జిల్లా 1. సూర్యరశ్మి బాగా సోకే ఎకరా స్థలంలో ఐరన్ ఫ్రేమ్తో 20 ట్యాంకులను నిర్మించారు. ఫ్రేం లోపల భారీ ప్లాస్టిక్ షీట్ను (పీవీసీ షీట్) పరచి మంచి నీటితో నింపారు. చెన్నై నుంచి తెప్పించిన స్పిరులినా మదర్ కల్చర్ను నీటిలో వేసి వారంరోజుల పాటు పెంచుతారు. వారం రోజుల తర్వాత అభివృద్ధి చెందిన స్పిరులినాను వడకట్టి మిగిలిన ట్యాంకుల్లోకి మార్చుతారు; 2. పూర్తిగా తయారైన స్పిరులినాను ఎండబెట్టేందుకు ఉపయోగించే పాలీ హౌస్; 3. ఉష్ణ గదిలో ఎండబెడుతున్న స్పిరులినా; 4. విక్రయానికి సిద్ధంగా ఉన్న డ్రై స్పిరులినా ఉత్పత్తులు; 5. స్పిరులినాను మేతతో కలిపి అందిస్తూ పెంచుతున్న కుందేళ్లు; 6. స్పిరులినాను పోషక పదార్థంగా అందించి పెంచుతున్న పుట్టగొడుగులు. మేడపైన డ్రమ్ముల్లో స్పిరులినా! స్పిరులినా.. అత్యంత ఆరోగ్యవంతమైన శాకాహారం. మాంసకృత్తులు అధిక మోతాదులో కలిగిన తొలి ఐదు ఆహారోత్పత్తుల్లో ఒకటి. ఇది మంచినీటిలో పెరిగే ఒకరకమైన ఆకుపచ్చని నాచు. కుంటల్లో 2 నుంచి 5 రోజుల్లో స్పిరులిన రెట్టింపవుతుంది. అయితే, బొగ్గుపులుసు వాయువును ఉపయోగించి సులభంగా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వారానికి మూడు, నాలుగు రెట్లు స్పిరులినాను పెంచే విశిష్టమైన పద్ధతిని థాయ్లాండ్కు చెందిన సమిల్ షా అనే యువకుడు కనిపెట్టాడు. మేడలపైన ఖాళీలో ఎంచక్కా ఇంటిపంటల మాదిరిగానే పెంచుతున్నాడు కూడా. బ్యాంకాక్లోని నొవొటెల్ హోటల్ భవనం పైన 66 గ్యాలన్లు నీరు పట్టే 40 ప్లాస్టిక్ డ్రమ్ములను పెట్టి స్పిరులినా సాగు చేస్తున్నాడు. ఇవన్నీ సన్నని గొట్టాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఒక డ్రమ్ములో నుంచి మరో డ్రమ్ములోనికి స్పిరులినా గాలి వత్తిడి ద్వారా విస్తరించే ఏర్పాటు చేశాడు. వారానికి మూడు, నాలుగు సార్లు స్పిరులినాను సేకరించి వేరుచోటకు తీసుకెళ్లి దాన్ని పొడిగా మార్చి విక్రయిస్తున్నాడు. నొవొటెల్ హోటెల్ సహా 12 రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి పెట్టాడు. ఈ టై గార్డెన్ నుంచి ఏడాదిలో 300 - 500 కిలోల తాజా స్పిరులినా ఉత్పత్తి అవుతోంది. ‘ఎనర్జియ’ అనే సంస్థను స్థాపించి స్పిరులినాతో కూడిన పాస్తాను, స్పిరులినా పొడిని షా విక్రయిస్తున్నాడు. ప్రకృతి వనరులను అతితక్కువగా వాడుకుంటూ కాలుష్య రహితమైన ఆహారోత్పత్తిని సాధించే మేలైన మార్గం తనదని.. భవిష్యత్తులో మానవాళికి ఆహార భద్రత కల్పించే మార్గం ఇదేనని షా గర్వంగా చెబుతున్నాడు. మరో భవనంపై 90 డ్రమ్ముల్లో కూడా షా స్పిరులినాను సాగు చేస్తున్నాడు. లాభార్జన కోసం మాత్రమే కాకుండా నిరుపేదల గురించి కూడా షా ఆలోచిస్తున్నాడు. శరణార్థులతోశిబిరాల వద్దనే స్పిరులినా సాగు చేయించి వారికి అధికాదాయం సమకూర్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement