-
కర్నూల్ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు
కర్నూలు: కర్నూల్ మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అభినందించారు. కాగా, కోర్సుల అనుమతి లభించడంలో సహకరించినందుకు ఎంపి సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ తదితర విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని ఎంపీ తెలిపారు. -
వైద్యం ఇక ‘సూపర్’
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాతికేళ్ల క్రితం సూపర్స్పెషాలిటీ కోర్సులు మంజూరైనా భవనం లేక ఎన్నో అవస్థలు. ఆ సమస్య 2002లో తీరింది. ‘సూపర్’ విభాగాలున్నా ఎండీ, ఎంసీహెచ్ కోర్సులు లేని లోటు ఇన్నాళ్లకు తీరింది. ఇటీవల మూడు విభాగాలు పీజీ సీట్లు సాధించగా, తాజాగా నెఫ్రాలజీ విభాగం సైతం ఆ జాబితాలో చేరింది. త్వరలో మరో మూడు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఎంసీహెచ్ కోర్సుకు అనుమతులు రానున్నాయి. దీంతో సామాన్య రోగులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూడకుండా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ‘సూపర్’ వైద్యం అందనుంది. కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (బోధనాసుపత్రి)కి 65 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఇప్పటికీ సూపర్స్పెషాలిటీ కోర్సులు ఇక్కడ ప్రారంభం కాలేదు. ఆరు జిల్లాలకు పెద్ద దిక్కుగా మారి, రోజూ వేలాది మందికి చికిత్సను అందించే ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గత పాలకులు విముఖత చూపారు. చెప్పుకోవడానికి అవసరమైన సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. అలాగే సమయం, శ్రమ తెలియకుండా పనిచేసే వైద్యులు ఉన్నారు. కానీ అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందిని మంజూరు చేయడంలో గత పాలకులు తగిన శ్రద్ధ చూపలేదు. ఫలితంగా రాయలసీమ జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా, తిరిగి ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి. సామాన్యునికి జబ్బు వస్తే ప్రైవేటుకు వెళ్లి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు గాను ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు బోధనాసుపత్రిలో సూపర్స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో తన వంత పాత్ర పోషించారు. ఎంసీఐని సంప్రదించి, అందుకు సంబంధించిన ఫైలును ముందుకు కదలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కారణంగా ఇటీవల యురాలజీ (ఎంసీహెచ్), నేడు నెఫ్రాలజీ (ఎండీ) విభాగాలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం కార్డియాలజీ (ఎండీ), గ్యాస్ట్రో ఎంట్రాలజి (ఎండీ) విభాగాల్లోనూ పీజీ కోర్సు మొదలైంది. ఆయా విభాగాల్లో ఏడాదికి రెండు సీట్ల చొప్పున మూడేళ్లకు ప్రస్తుతం ఆరుగురు పీజీ వైద్య విద్యార్థులు చదువుతూనే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఉపయోగాలు ఇవీ.. ఆసుపత్రిలోని కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, యురాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి, క్యాన్సర్ విభాగాలను సూపర్స్పెషాలిటీ విభాగాలుగా పిలుస్తారు. ఆయా విభాగాలు దాదాపు 35 ఏళ్ల క్రితమే ఏర్పడినా ఇప్పటి వరకు వాటికి పీజీ సీట్లు మంజూరు కాలేదు. దీంతో పేదలు మెరుగైన వైద్యానికి దూరమయ్యే పరిస్థితి. నెఫ్రాలజీ, న్యూరోసర్జరి, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి విభాగాల్లో పడకల సంఖ్యకు మించి రెండు, మూడింతలు రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా ప్రతి విభాగంలో 40 నుంచి 100 పడకలు అధికంగా ఉంటున్నాయి. అయినా ఆయా విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఆయా విభాగాల్లో పీజీ సీట్లు రావడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా విభాగాల్లో జూనియర్ వైద్యుల సంఖ్య ఆరుకు పెరుగుతుంది, దీంతో పాటు రోగులకు వచ్చే వ్యాధులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వీలుంది. దీంతో పాటు వైద్య విద్యార్థులు అభ్యసించేందుకు, వారు జాతీయ, రా్రïÙ్టయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమరి్పంచేందుకు సైతం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పలు పరిశోధనలకు సైతం ఈ ఆసుపత్రి వేదికగా అయ్యే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ(బోధనాసుపత్రి)లోని నెఫ్రాలజీ విభాగానికి పీజీ సీట్లు మంజూరైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి తనకు వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకునేందుకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పటికీ సూపర్స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి రానీయకుండా ప్రభుత్వం కర్నూలు ఆసుపత్రిలో రూ.720 కోట్లతో నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేస్తోందన్నారు. అలాగే వందలాది మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తోందని చెప్పారు. దాతలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్)లో భాగంగా ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. నరేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 4 సూపర్స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు వచ్చాయని, త్వరలో న్యూరోసర్జరి, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి విభాగాలకు సైతం ఎంసీహెచ్ కోర్సు రానుందన్నారు. దీనివల్ల ఆయా విభాగాలు బలోపేతం అవుతాయని, రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, డాక్టర్ నరసింహులు, యురాలజిస్టు డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ సీతారామయ్య, నెఫ్రాలజిస్టు డాక్టర్ పీఎన్ జిక్కి, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
మిగిలిన 4 సీట్లకు 29న కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్ల భర్తీలో మిగిలిన నాలుగు సీట్లకు ఈ నెల 29న తుదివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేర్కొంది. ఇందులో డీఎం న్యూరాలజీ ఎస్వీయూ పరిధిలో ఒక సీటు, ఎంసీహెచ్ న్యూరో సర్జరీ ఆంధ్రా వర్సిటీ పరిధిలో ఒకటి, ఎంసీహెచ్ జెనిటో యూరినరీ సర్జరీ ఓయూ పరిధిలో ఒక సీటు ఉండగా, ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీలో ఒక సీటు అన్ రిజర్వ్డ్గా ఉంది. వీటికి లోకల్ అభ్యర్థులు హాజరు కావాలని, లేని పక్షంలో నిబంధనలకు లోబడి నాన్లోకల్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
సీఎం జగన్కు ఘన స్వాగతం..!
నేపాల్లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..
కలర్ఫుల్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
అది పెళ్లిచూపులు.. ఇది ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన శోభా
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్
ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్
హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement