-
ఏసీ బోగీలో పాము!
సాక్షి, అన్నానగర్: తమిళనాడులోని కోవై నుంచి చెన్నైకు వస్తున్న చేరన్ ఎక్స్ప్రెస్ రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. చెన్నై సెంట్రల్-కోయంబత్తూరు మధ్య నడిచే చేరన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12674) గురువారం రాత్రి కోవై నుంచి చెన్నైకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్కు సమీపిస్తుండగా బి-3 ఏసీ బోగీలోని ఒక ప్రయాణికుడు తన లగేజీని తీసుకుంటుండగా బెర్త్ కింద పాము కనిపించింది. భయాందోళన చెందిన అతను కేకలు పెట్టాడు. అతడి అరుపులు విని ఇతర ప్రయాణికులు కూడా కేకలు పెడుతూ పరుగులు తీశారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో చెన్నై సెంట్రల్ స్టేషన్ రావడంతో బోగీలోని ప్రయాణికలు తమ లగేజీలు తీసుకుని దిగారు. కాగా, ఏసీ బోగీలో పాము ఉందని, దాన్ని తొలగించామని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ చెప్పారు. అయితే అది అక్కడకు ఎలా వచ్చిందో తెలియలేదని, విచారిస్తున్నట్టు తెలిపారు. అది పొడవైనదిగాను, విషపామువలే ఉందని ఆ బోగీలో ఉన్న భువన అనే ప్రయాణికురాలు తెలిపింది. -
వైష్ణవీ మాతా న మో నమః
న్యూఢిల్లీ: ఢిల్లీ-కత్రాల మధ్య తొలి సూపర్ఫాస్ట్ రైలు సేవలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ‘శ్రీ శక్తి ఎక్స్ప్రెస్ ఏసీ రైలును సంబంధి త అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మాతా వైష్ణో దేవి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కత్రాకు ఇక్కడి నుంచి సోవ ప్రతిరోజూ నడవనుంది. సాయంత్రం 5.30కు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.10 నిమిషాలకు శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్కు చేరుకుంటుందని వారు చెప్పారు. అలాగే అదేరోజు రాత్రి 10.55కు అక్కడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45కు ఢిల్లీ చేరుకుంటుందని వివరించారు. ఇందులో మొత్తం 15 ఏసీ బోగీలు ఉన్నాయని, ఇది అంబాలా కంటోన్మెంట్, లూథియానా, జలంధర్. పఠాన్కోట్, జమ్మూతావి, ఉధంపూర్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ నెల నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, వైష్ణోదే వి దేవాలయాన్ని ప్రతిఏడాది సుమారు కోటి మంది సందర్శిస్తారని అంచనా. కాగా, కత్రా రైల్వే స్టేషన్కు ఆధునిక హంగులను ఏర్పాటుచేశారు. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్థం టూరిస్టు కౌంటర్, క్లాక్ రూం, వెయిటింగ్ హాలు, వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, లిఫ్టు వంటి ఎన్నో సౌకర్యాలను అమర్చారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
క్వాలిఫయర్-1.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement