-
చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్
లాస్ ఎంజెల్స్: తన నటనను మెచ్చుకుంటూ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు పాల్ ఫెయిగ్ ప్రశంసలు కురిపించడంతో తనకు చంద్రుడికంటె పైన ఉన్నట్లుందని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పేర్కొంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, నటి అలియా భట్కు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు పాల్ ఫెయిగ్ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న డియర్ జిందగీ చిత్రంలో వారిద్దరు చాలా అద్భుతంగా నటించారని అన్నారు. గోస్ట్ బస్టర్స్, ది హీట్ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన పాల్.. డియర్ జిందగీ దర్శకుడు గౌరీ షిండేను కూడా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆమె చాలా అద్భుతమైన రచయిత అని అన్నారు. ‘డియర్ జిందగీ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచిన షారుక్ ఖాన్, అలియా భట్కు నా అభినందనలు’ అంటూ ఆయన తన పోస్ట్లో రాశారు. పాల్ కు షారుక్ స్నేహితుడు కాగా.. పాల్ భార్య లౌరీ కారన్ షారుక్కు మంచి అభిమాని. పాల్ తమను పొగడటంపట్ల ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అలియా అయితే.. తనకు చంద్రుడిపైకి వెళ్లినట్లు ఉందంటూ ట్వీట్ చేసింది. -
చల్లని రాత్రిలో షారుక్కు వెచ్చటి కానుక
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆయన అభిమానులు వెచ్చటి కానుకను పంపించారు. ప్రస్తుతం ఆమ్స్టర్డాంలో షూటింగ్ లో ఉన్న ఆయనకు చలి నుంచి బయటపడేందుకు కొంతమంది బాయ్స్ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ ను పంపించారు. ఈ సందర్భంగా అభిమానులు పంపించిన గిఫ్ట్ ను ఫొటో తీసి దానికి.. 'ఆమ్స్టర్డాంలోని చల్లటి రాత్రిలో షూటింగ్. వెచ్చదనం కోసం అమ్మాయిలు కౌగిలిని పంపించగా అబ్బాయిలు ఓ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ను గిఫ్ట్ గా కొరియర్ చేశారు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'ది రింగ్' అనే చిత్రంలో షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా అనుష్క శర్మ నటిస్తోంది. అలీ దర్శకత్వంలో సినిమా చేయడం షారుక్ కు ఇదే తొలిసారి. -
'మేమిద్దరం మంచి స్నేహితులేమేమీ కాదు'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరిగే స్నేహం ఏమీ లేదంటున్నాడు సహచర నటుడు అజయ్ దేవగణ్. తామిద్దర మధ్య ఉన్నది కేవలం నటనపరంగా ఉన్న సాన్నిహిత్యమే తప్పా.. ఒక మంచి ఫ్రెండ్ షిప్ అయితే ఏమీ లేదని అజయ్ స్పష్టం చేశాడు. వీరిద్దరూ నటనలో పోటీ పడి చేయడమే కాకుండా.. నిజ జీవితంలో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉందన్న వార్తలను అజయ్ ఖండించాడు. ఇటీవల బల్గేరియాలో షారుక్-అజయ్ లు కలిసి ఒకే డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని విందు స్వీకరించిన అనంతరం వారి స్నేహాన్ని బలపరస్తూ వార్తలు వచ్చాయి. దీనిపై అజయ్ స్పందిస్తూ.. ' మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయితే కాదు. షారుక్ నా సహచర నటుడు మాత్రమే. మేము తరుచు కలిసి షేర్ చేసుకున్న అంశాలు కూడా ఏమీ లేవు. అలాగని మా ఇద్దరి మధ్య ఏ విధమైన వార్ కూడా లేదు 'అని తెలిపాడు. ప్రస్తుతం అజయ్ మళయాళం సూపర్ హిట్ మూవీ 'దృశ్యం' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31 వ తేదీన విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement