-
Gujarat Assembly Election 2022: అధికారం కోసమే జోడో యాత్ర
సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అధికారం కోల్పోయినవారు మళ్లీ గద్దెనెక్కడానికి పాదయాత్ర సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిని చాలా ఏళ్ల క్రితమే ప్రజలు గద్దెదింపారని చెప్పారు. మోదీ సోమవారం గుజరాత్లోని సురేంద్రనగర్, నవసారి, జంబూసార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా, తన(మోదీ) ఔకత్(స్థాయి) ఏథమిటో బయటపెడతామని సవాళ్లు విసురుతున్నారని ఆక్షేపించారు. వారి ఆహంకారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వారు(కాంగ్రెస్ పెద్దలు) రాజకుటుంబం నుంచి వచ్చారని, తాను కేవలం ఒక సేవకుడినని, తనకు పెద్ద స్థాయి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు గతంలో తనను దిగజారుడు భాషలో దూషించారని గుర్తుచేశారు. స్థాయిల సంగతి పక్కనపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని ప్రతిపక్షానికి హితవు పలికారు. తన దృష్టి మొత్తం దేశ ప్రగతి పైనే ఉందని.. అవమానాలు, దూషణలను జీర్ణించుకుంటానని చెప్పారు. గుజరాత్ ఉప్పు తింటూ అవమానిస్తున్నారు నర్మదా ప్రాజెక్టును అడ్డుకొని, గుజరాత్ గొంతెండిపోయేలా చేసినవారిని పక్కన పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. నర్మదా ప్రాజెక్టును వ్యతిరేకించిన వారికి గుజరాత్ ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అప్పట్లోనే తాను గట్టిగా వాదించానని, ఇప్పుడు ఈ లాభాలు కళ్లముందే కనిపిస్తున్నాయని వివరించారు. పాదయాత్ర చేస్తున్న వారికి వేరుశనగ పంటకు, పత్తి పంటకు మధ్య తేడా తెలియదని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు గుజరాత్లో తయారవుతున్న ఉప్పు తింటూ గుజరాత్నే అవమానిస్తున్నారని తప్పుపట్టారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఉప్పులో గుజరాత్ వాటా 80 శాతం ఉందని గుర్తుచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కొన్ని స్థానాల్లో గెలిపించడం ద్వారా సురేంద్రనగర్ జిల్లా ప్రజలు పొరపాటు చేశారని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. -
500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు
గుజరాత్: గుజరాత్లోని సురేందర్ నగర్ జిల్లాలో సోమవారం ఏడు నెలల పసికందు ప్రమాదవాశాత్తూ బోరుబావిలో పడిపోయింది. 500 అడుగుల వరకు ఉన్న బోరుబావిలో 100 అడుగుల వద్ద పసికందు ఇరుక్కపోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని పాపను బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆదుర్ధా పడుతున్నారు. ఎలాగైనా తమ కంటిపాపను బైటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement