-
నిజమైన సేవకుడు
గుజరాత్ రాష్ట్రంలోని సబర్కాంత జిల్లాలో ‘సహయోగ్’ అనే గ్రామం ఉంది. అక్కడికి వెళ్లి సురేశ్ సోనీ గురించి అడిగి చూడండి. వెంటనే వారి కళ్లలో ఓ మెరుపు, ఆ వెంటనే వెచ్చటి కన్నీళ్లు కనిపిస్తాయి. ‘ఆయన మా దేవుడయ్యా’ అన్న మాట వారి నోట వెలువడుతుంది. అది వారి మనసు లోతుల్లోంచి వచ్చిన మాట. అసలింతకీ ఎవరా సురేశ్ సోనీ?!1966లో ఎం.ఎస్.యూనివర్సిటీ ఆఫ్ బరోడా నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స పూర్తి చేశారు సురేశ్. లెక్చెరర్గా ఉద్యోగం దొరికింది. సరిపడా సంపాదన, భార్యా పిల్లలతో జీవితం సాఫీగానే సాగుతోంది. కానీ మనసే ఎందుకో తృప్తిగా లేదు. దానికి కారణం కేవలం ఆయన మంచితనం. చుట్టుపక్కల ఎవరైనా కాస్త బాధలో ఉంటే ఆయన మనసు పాడైపోతుంది. వాళ్లకి తనవంతుగా ఏదో ఒకటి చేసేవరకూ శాంతి ఉండదు. అలాంటి వ్యక్తి కళ్లు ఓసారి కుష్టు వ్యాధిగ్రస్తుల మీద పడ్డాయి. ఇక నాటి నుంచీ వారి గురించే ఆలోచన.కుష్టు... మనిషిని వికారంగా మార్చే స్తుంది. దాంతో చాలామంది వాళ్లని చూసి ముఖాలు తిప్పుకుంటారు. కొందరైతే చీదరించుకుంటారు కూడా. అది వాళ్ల మనసుల్ని ఎంత మెలిపెడుతుందో ఎవరూ ఆలోచించరు. కానీ సురేశ్ ఆలోచించారు. అలా అందరూ అసహ్యిం చుకుంటే పాపం వాళ్లెలా తట్టుకుంటారు అని ఆలోచించారు. ఆ ఆవేదన ఓ గొప్ప పనికి పురికొల్పింది. ‘సహయోగ్ కుష్టాయజ్ఞ ట్రస్టు’కు ఊపిరి పోసింది. ఊరినే నిర్మించారు... 1988లో తన సహధర్మచారిణి ఇందిరతో కలిసి ఓ మహాయజ్ఞం మొదలు పెట్టారు సురేశ్. మొదట తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాతల సాయంతో గుజరాత్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో 20 ఎకరాల స్థలాన్ని కొని,‘సహయోగ్ కుష్టాయజ్ఙ ట్రస్ట్’ను స్థాపించారు. వ్యాధిగ్రస్తులతో పాటు తమ కుటుంబం కూడా నివసించేందుకుగాను గృహాలు నిర్మించారు. వాటితో పాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీ, పిల్లలు చదువుకోవడానికి బడి... ఇలా ఒక్కొక్కటిగా నిర్మిస్తూ ఓ గ్రామాన్నే తయారుచేశారు. దానికి ‘సహయోగ్ విలేజ్’ అని పేరు పెట్టారు. నాటి నుంచి... నిరాదరణకు గురై అష్టకష్టాలు పడుతోన్న కుష్టువ్యాధులకు ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కుష్టురోగులు వస్తున్నారు. సహయోగ్ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.సహయోగ్లో అందించే వైద్యంతో ఇప్పటివరకు వేల మంది కుష్టువ్యాధి నుంచి విముక్తి పొంది తమ కుటుంబా లతో హాయిగా జీవిస్తున్నారు. కొందరైతే తిరిగి వెళ్లడం ఇష్టం లేక, అక్కడే ఉండి వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నారు. అలాంటి వారికి అక్కడ ఇళ్లు కట్టించారు సురేశ్. సహయోగ్ గ్రామస్తులకు భోజనం, వసతి, వైద్యం వంటివన్నీ మొత్తం ట్రస్టే చూసుకుంటుంది. అరవైమంది ట్రస్ట్ సభ్యులు వారికి కావలసినవన్నీ సమ కూరుస్తుంటారు. ఏ కష్టం కలగకుండా కంటిరెప్పలా చూసుకుంటారు. చికిత్స చేయించుకుంటున్న వారి పిల్లలు అక్కడున్న స్కూల్లో చదువుకుంటున్నారు. కుష్టువ్యాధి నుంచి విముక్తి పొందిన కొందరు యువతీ యువకులకు పెళ్లిళ్లు కూడా చేశారు సురేశ్. వాళ్లకు ఇళ్లు ఇచ్చి జీవనోపాధి చూపించారు. కొందరికి కుట్టు మిషన్లు ఇప్పించారు. జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ సహకారంతో షాపులు, కర్మా గారాలు ఏర్పాటు చేయించారు. దాంతో వాళ్లు సుఖంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం సహయోగ్ గ్రామంలో 111 కుటుంబాలున్నాయి. ఆ గ్రామ ప్రజల పోషణ, వైద్య సేవల ఖర్చు సంవత్సరానికి రూ. కోటి దాటుతోందట. అందులో ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.20 లక్షలు. మిగతా మొత్తాన్ని సురేశ్ ఎంతో కష్టపడి సేకరిస్తుంటారు. ఎంత కష్టమైనా పడతారు కానీ, అక్కడి వారికి ఏ లోటూ రానివ్వ నంటారాయన. మరి ఆయన వారికి దేవుడు కాక మరేమవుతారు! - నిఖిత నెల్లుట్ల -
ఎన్డీఏ చైర్మన్గా నరేంద్ర మోడీ!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అచరించాల్సిన వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ తన కసరత్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్తో ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోని గురువారం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా పార్టీలో అత్యంత సీనియర్ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్ల ప్రాధాన్యతతోపాటు లోక్సభ ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతర వ్యూహంపై చర్చించారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఓ వేళ తక్కువ మెజార్టీ వస్తే అనుసరించాల్సిన విధాలపై చర్చ కొనసాగింది. అందుకోసం తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్లను బీజేపీలోకి తీసుకోవాల్సిన అంశంపై కూడా చర్చ జరిగింది. బీజేపీలో రెండు పవర్ సెంటర్లు ఉండొద్దని మోడీ వ్యాఖ్యలపై రాజనాథ్, సోనిల మధ్య ఈ సందర్బంగా ప్రస్తావించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చైర్మన్గా గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ దిశగా బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement