-
గొంతుకోసి మహిళ హత్య
మునిపల్లి (అందోల్): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి హత్యకు గురైంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ల్యాగల శ్రీనివాస్కు కల్లపల్లి బెల్లూర్కు చెందిన నాగొల్ల రాణెమ్మ(32)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాగి ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ నిద్రకు ఉపక్రమించాడు. రాణెమ్మ పిల్లలను పడుకోబెట్టి తానూ పడుకుంది. కాగా, ఉదయం లేచి తన భార్యను కొడవలితో ఎవరో గొంతుకోసి హత్య చేశారని శ్రీనివాస్ రోదించడం మొదలుపెట్టాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు శ్రీనివాస్పై అనుమానంతో అతడిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని రాణెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్కు మద్యం అలవాటు ఉందని, గతంలో మద్యం మత్తులో తన కాలు కోసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్ను విచారిస్తున్నారు. -
తనూజ కేసులో స్నేహితుడే కీలకం?
తనూజ మృతి కేసు పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు లైంగికంగా వేధించినట్టు అనుమానం? పెందుర్తి : అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక తనూజ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడి పాత్ర కీలకంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడి మేనమామ(వరసకు) ప్రోద్బలంతోనే బాలికను బయటకు రప్పించినట్లు తెలిస్తోంది. ఆయనపై ప్రస్తుతం రౌడీ షీటు కూడా ఉన్నట్లు తెలిసింది. బాలిక స్నేహితుడి మేనమామ, మరో రౌడీ షీటరుతోపాటు మరో వ్యక్తి కూడా ఈ దుశ్చర్యలో పాలుపంచుకున్నట్టు సమాచారం. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా ? లేదా ? అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వెల్లడవుతుంది. మొత్తానికి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసు చిక్కుముడి ఒకటి రెండు రోజుల్లో వీడే అవకాశం ఉంది. అసలేం జరిగింది? కృష్ణరాయపురానికి చెందిన కె.తనూజ(14) ఓ యువకుడితో స్నేహం చేయడం చూసిన తల్లిదండ్రులు గత శనివారం రాత్రి తీవ్రంగా మందలించారు. ఆ సమయంలో తనూజ ఇంటి నుంచి బయటకి వచ్చేసింది. ఇదే సమయంలో స్నేహితుడ్ని తనూజ కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణరాయపురంలోని బీఆర్టీఎస్ రోడ్డుపక్కన ఉన్న అపార్ట్మెంటులోని ఒక ఫ్లాట్లోకి వెళ్లినట్టు వాచ్మెన్ పోలీసులకు వివరించాడు. అదే సమయంలో మరో ఫ్లాట్లో మద్యం సేవిస్తూ ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు వారితో మాట్లాడాడు. అందరూ కలిసి బాలికను లైంగికంగా వేధించినట్లు పై వివరాల ఆధారంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు ఆ యువకుడితో పాటు రౌడీషీటరైన అతని మేనమామ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వినికిడి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement