-
ఇలా అయితే ‘స్వచ్ఛ ర్యాంకు’ ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్గా మారుస్తామని..స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుపుతామని జీహెచ్ఎంసీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం కోసం పలు ప్రణాళికలు మారుస్తూ దేన్నీ పూర్తి చేయడం లేదు. ఆ తంతు ఒక ఎత్తు కాగా, కనీసం ప్రజల నుంచి ‘ఫీడ్బ్యాక్’ తీసుకునే అంశంలోనూ పూర్తి శ్రద్ధ చూపలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2020’ మొత్తం 6 వేల మార్కులకు కాగా.. అందులో 1500 మార్కులు నగర పౌరుల ఫీడ్బ్యాక్కే ఉన్నాయి. గతంలో వివిధ అంశాల్లో నగరం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫీడ్బ్యాక్లో వెనుకబడినందునే ర్యాంక్ తగ్గిందని చెప్పుకున్నారు. ఆ విషయం తెలిశాకైనా ఫీడ్బ్యాక్ అంశంలో మెరుగుపడేందుకు చర్యలు తీసుకోలేదు. ఈనెల 4 నుంచి 31వ తేదీ వరకు ప్రజలు తమ ఫీడ్బ్యాక్ను నాలుగు విధాలుగా తెలియజేయవచ్చు. వెబ్సైట్, యాప్, ఫోన్ల ద్వారా ఇందుకు అవకాశముంది. ఈ విషయాల్ని నగర పౌరులకు తెలియజేయడంతోపాటు.. ఫీడ్బ్యాక్లో భాగంగా ఉండే ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేలా అవగాహన కల్పించాలి. ఇందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ.. సకాలంలో కాకుండా గడువు ముగియనున్న తరుణంలో కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లే ఎంటమాలజీ సిబ్బందికి స్వచ్ఛసర్వేక్షణ్కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలిచ్చి పంపుతున్నారు. ఈ పుస్తకాల్లో వారు ఇంటిలోని వారి పేరు రాయడంతో పాటు మొబైల్ నెంబర్ వేయాలి. వారికి స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి తెలియజేయడంతో పాటు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరి.. వారి మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేయించాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు ఓటీపీ నమోదు చేయడం తదితరమైనవి వివరించాలి. ఇవన్నీ చేశాక ఫీడ్బ్యాక్లోని ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా సూచించాలి. ఈ పనులు చేసినట్లు వారి సంతకం కూడా తీసుకోవాలి. వారి వద్ద మొబైల్ ఫోన్ లేకుంటే.. తమ మొబైల్ ఫోన్ నుంచైనా వారి పేరు.. వివరాలతో ఫీడ్బ్యాక్ పంపించాలని నిర్ణయించారు. తద్వారా ఎంతమంది ఫీడ్బ్యాక్ పంపించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.దీంతోపాటు ఫీడ్బ్యాక్ ఇచ్చే మిగతా విధానాలను కూడా తెలియజేయాలని కూడా భావించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ముద్రించిన పుస్తకాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. ఇవన్నీ సర్కిళ్లకు.. అక్కడినుంచి ఎంటమాలజీ సిబ్బందికి చేరి.. వారు ఇంటింటికీ వెళ్లేందుకు సెలవులు పోను మిగిలింది దాదాపు ఐదు రోజులు. ఈ స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా ఏమేరకు ప్రయోజనం లభించగలదో సంబంధిత అధికారులకే తెలియాలి. నాలుగో తేదీనుంచే ఈ సర్వే ఉందని తెలుసు. అప్పటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేది. తీరా గడువు ముగుస్తున్న సమయంలో చేస్తున్న ఈ ప్రయత్నం పుస్తకాల మద్రణ ఖర్చు తప్ప.. పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీడ్బ్యాక్కు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ‘మీ ఇంటి వ్యర్థాలను తడి,పొడి వేర్వేరుగా ఇవ్వమని మీ చెత్త సేకరించే వాళ్లు అడుగుతున్నారా ? అనేది ఒక ప్రశ్న. దీనికి ‘అవును.. ప్రతిసారి’ అని సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పమని ఎంటమాలజీ సిబ్బందికి సూచిస్తున్నారు కానీ.. వారా విషయం చెప్పగలరా అన్నదే అంతుబట్టడం లేదు. ఎందుకంటే.. వాస్తవానికి నగరంలో తడిపొడి వేరు చేసి ఇవ్వమని అడుతున్నవారు లేరు సరికదా.. అవగాహన ఉన్న కొన్ని కుటుంబాల వారు వేరుచేసి ఇచ్చిన చెత్తను సైతం కలగలిపే ఆటోల్లో తీసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్లోనగర ర్యాంకు వెనుకబడిందిలా.. సంవత్సరం ర్యాంక్ 2016 19 2017 22 2018 27 2019 35 -
‘స్వచ్ఛ’మే లక్ష్యం!
రూ.195.91 కోట్లు మంజూరు త్వరలో పనులు ప్రారంభం నాలాలు.. మంచినీళ్లు, రహదారులకు ప్రాధాన్యం వినతుల్లో వీటిదే అగ్రస్థానం సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో అందిన వినతుల పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి. దీనికోసం జీహెచ్ఎంసీ రూ.195.91 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో అందిన విజ్ఞప్తుల మేరకు నాలాలు.. మంచినీళ్లు.. రహదారులు, డ్రైనేజీలే నగరంలోని ప్రధాన సమస్యలని స్పష్టమైంది. ప్రాధాన్య క్రమంలో ఈ పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ను 400 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్కు రూ.50 లక్షల వంతున రూ.200 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.195.91 కోట్లు విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేశారు. స్థానిక అవసరాలపై అందిన విజ్ఞప్తుల మేరకు మొత్తం 8,303 పనులు చేయాల్సి ఉంటుందని మెంటర్లు, నోడల్ అధికారులు గుర్తించారు. దీనికి రూ. 718.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాధాన్య క్రమంలో 5,071 పనులను ఎంపిక చేశారు. వీటికి రూ.195.91 కోట్లు మంజూరు చేశారు. వీటిలో సీసీ రోడ్లకు రూ.46.41 కోట్లు, నాలాలకు రూ.21.90 కోట్లు, డ్రైనేజీ పనులకు రూ.38.35 కోట్లు, మంచినీటి సరఫరాకు రూ.23.19 కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే చేపట్టాల్సిందిగా ఇంజినీర్లను ఆదేశించారు. మూడు రోజుల్లో స్వల్పకాలిక టెండర్లు పిలిచి, త్వరగా పనులు చేపట్టాలన్నారు. ఈమేరకు బడ్జెట్ ఎంట్రీలు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ పనుల పురోగతిని ప్రతి సోమవారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదించాలని కమిషనర్ సూచించారు. అదే సెంటిమెంట్ సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6ను శుభసూచకంగా భావించే జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్వచ్చ హైదరాబాద్ పనులకు నిధుల విడుదలలోనూ దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. రూ.195 కోట్లకు (అదనపు మొత్తాన్ని మినహాయిస్తే)పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశారు. 195లోని అంకెలన్నింటినీ కలిపితే 6 అవుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్ వాహనాలు, జీహెచ్ఎంసీ బడ్జెట్లోనూ అంకెల మొత్తం 6 కావడం తెలిసిందే. స్వచ్ఛ హైదరాబాద్లోనూ సంపన్నులకే? స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా మంజూరైన నిధుల్లోనూ సంపన్నులు గల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలున్న సర్కిల్-10 (ఖైరతాబాద్)కే ఎక్కువ కేటాయించారు. ఈ ప్రాంతానికి రూ.24.48 కోట్లు మంజూరు చేశారు. నిధుల మంజూరులో ఇదే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి రెండు స్థానాల్లో సర్కిల్-4 (చార్మినార్) రూ.18.47 కోట్లు, తార్నాక (రూ.17 కోట్లు) ఉన్నాయి. -
స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొందాం : విజయారెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు. శుక్రవారం పంజగుట్ట డివిజన్ పరిధిలోని తబేలా బస్తీలో ఆమె స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. తబేలాబస్తీలో ఉన్న మజీద్లో ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రమదానం చేసి ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. మట్టికుప్పలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ ఓ బృహత్తర కార్యక్రమమని, దీన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
‘ గ్రేటర్’ లక్ష్యంగా స్వచ్ఛ హైదరాబాద్!
జంటనగరాల్లో అధికార పార్టీ నేతల హడావుడి స్వయంగా కాలనీలు తిరిగిన సీఎం కేసీఆర్ వాడలను చుట్టివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో, అధికార పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు స్వయంగా బస్తీలు తిరగడం.. వాడల్లో ప్రజల తో మమేకం కావడం... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంటనగరాలను చుట్టి రావడం.. చర్చనీయాంశమైంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పీఠమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్లో ప్రజలను నేరుగా కలవడం, వారి సమస్యలను వినడం, తాత్కాలికమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సి పనులకు హామీలు ఇవ్వడం కోసం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఉపయోగపడిందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంఐఎం పట్టున్న పాతబస్తీతోపాటు విపక్ష టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధుల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఉద్యమంగా జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పరిశీలించిన వర్గాలు ఇది కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా చేపట్టిందేనని వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం అయిదు రోజుల్లో సుమారు 7 లక్షల మంది ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా క లుసుకోగలిగామని జీహెచ్ఎంసీ అధికారికంగానే ప్రకటించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి రోడ్ల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, గ్రంథాలయాలు, జిమ్ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలకు కూడా అందాయి. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఏకంగా ఐదు వందల బృందాలను రంగంలోకి దింపారు. నగర ప్రజల ముంగిట్లోకి వెళ్లి, వారిని నేరుగా కలిసి మాట్లాడారు. ప్రధానంగా నగరంలోని వివిధ బస్తీ వాసుల్లో విశ్వాసం నింపేలా వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ వరసగా రెండు రోజుల పాటు హామీలు ఇచ్చారు. యూనివర్సిటీ జాగాల్లో పక్కా ఇళ్ళు కట్టిస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధానంగా తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికార పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. పాతబస్తీలో ఎంఐఎం నేతల నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన కార్యక్రమం కావడంతో నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అనివార్యంగా పాల్గొనడమే కాకుండా, ఎలాంటి విమర్శలు చే యలేకపోయారు. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
పరిష్కార వేదికగా...
సమస్యల నుంచి ప్రజలకు విముక్తి ఇళ్లు, నాలాలు,కలుషిత జలాలపైనే వినతులు రూ. 200 కోట్లు మంజూరు రూ. 600 కోట్ల పనులకు విజ్ఞప్తులు ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం కేవలం పారిశుద్ధ్య కార్యక్రమాలకే పరిమితం కాకుండా... ప్రజా సమస్యలు గుర్తించేందుకు ఉపయోగపడింది. గవర్నర్ నుంచి ఐఏఎస్లు, సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా భాగస్వాములైన ఈ కార్యక్రమంలో ప్రజల ‘నాడి’ని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వారిని స్వచ్ఛ టీమ్ సభ్యులుగా ఎంపిక చేసి.. ప్రజల అవసరాలను, డిమాండ్లను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆక్రమణల పాలైన నాలాల వల్ల తలెత్తుతున్నముంపు, కలుషిత నీటి సమస్యలను ప్రజలు గట్టిగా వినిపించారు. ఇళ్లు, పింఛన్లు, వైద్యం, రేషన్ కార్డులను ఎక్కువగా కోరారు. ఈ కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా పనులు చేపట్టడానికి రూ.200 కోట్లు సిద్ధంగా ఉంచినప్పటికీ... అదనపు నిధులు అవసరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పనులను స్వల్ప, దీర్ఘకాలికమైనవిగా విభజించి పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగస్వాములైన ప్యాట్రన్లు/మెంటర్లతో శుక్రవారం సమీక్షించనున్నారు. అప్పటికి దీనిపైస్పష్టత వచ్చే అవకాశం ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు వరాలు స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు, వారి సమస్యలపై సీఎం శ్రద్ధ కనబరిచారు. వారి వేతనాలు పెంచడంతో పాటు జీహెచ్ఎంసీలోని 20 వేల మంది కార్మికులకు దశల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు వివిధ ప్రాంతాల్లోని 2 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇదే సందర్భంలో ఓయూ భూముల్లో ఇళ్లు కట్టిస్తామనడం వివాదానికి దారి తీసింది. తాగునీటి పైపుల్లో డ్రైనేజీ నీరు కలుస్తున్న సమస్యను పరిష్కరించేందుకు రూ.3వేల కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. నాలాలను మెరుగుపర చడానికి ప్రస్తుతం రూ.400 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సమస్య లేదని సీఎం తెలిపారు. పాతబస్తీకి తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు రెండు డబ్బాల విధానాన్ని ప్రారంభించడంతో పాటు, వాటిని ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించేందుకు 2500 ఆటోట్రాలీలతో పేదలకు ఉపాధి కల్పిస్తామన్నారు. తద్వారా చెత్త తరలింపు, నిరుద్యోగులకు ఉపాధి అనే రెండు ప్రయోజనాలు నెరవేరనున్నాయి. నగరం నుంచి రోజుకు సగటున 3600 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తుండగా, స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా రోజుకు సగటున 8 వేల టన్నుల చెత్త, డెబ్రిస్ను అదనంగా సేకరించగలిగారు. మొత్తం 32వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త, డెబ్రిస్ను తరలించారు. అందిన వినతులు.. వాటి పరిష్కార చర్యలపై ఈనెల 26న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగనుంది. కొనసాగుతుంది... పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్, కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement